వేదాంతం


వేదాంతం


  • శరీరములు మూడు. స్థూలము, సూక్ష్మము, మరియు కారణము అని. 


  • గుణములు మూడు.  సత్వం  అనగా జ్ఞానం, రజస్సు అనగా శక్తి , మరియు తమస్సు అనగా ద్రవ్యరాశి.


  • నాలుగు కులాలు:  తమస్సు అనగా అజ్ఞానం,  తమస్సు—రజస్సు అనగా  అజ్ఞానం + క్రియాశీలత,  రజస్సు—సత్వం అనగా సత్కర్మ +  జ్ఞానం,  మరియు సత్వం అనగా  జ్ఞానం.


పుట్టుకతో నిమిత్తములేకుండానే ఏదో ఒక కులములో చేరవచ్చు. జీవితములో అతడు సాధించడానికి ఎంచుకున్న లక్ష్యము వలన అయే సహజశక్తులమీద ఆధారపడిఉంటుంది.


  • కామం అనగా కోరిక అనగా ఇంద్రియాలే తాననుకొని గడిపే జీవితం శూద్రదశ.


  • అర్థం అనగా లాభార్జనం చేస్తూనే కోరికలను అదుపులో ఉంచుకొనే వైశ్యదశ.


  • ధర్మం అనగా స్వయంశిక్షణతోనూ , బాధ్యతతోనూ , సత్కర్మతోనూ గడిపే క్షత్రియదశ.


  • మోక్షం అనగా విడుదల, మతధర్మ బోధనలతో కూడిన జీవితము బ్రాహ్మణదశ.


ఈ నాలుగు కులాల మానవులకు సేవ చేయడానికి ఉపకరించే సాధనములు శరీరము, మనస్సు, సంకల్పశక్తి మరియు ఆత్మ.

సనాతన ఋషులు చెప్పిన మాయను ఆధునిక కాలము లోని గొప్ప ఆవిష్కరణలు ధృవీకరణ చేశాయి.
ఉదాహరణకు ఒకే ఒక చర్యను చూడటం అసంభవం అని మన ఋషులు చెప్పినదే సమానంగానూ, వ్యతిరేకంగాను రెండు బలాలు ఉంటాయి అని న్యూటన్ సిద్ధాంతము దీనికి ఉదాహరణ.


  • కారణ విశ్వం  భావముల ఆనందమయ లోకం. ఇది సూక్ష్మ విశ్వం కంటే ఎన్నోరెట్లు పెద్దది. 
  • దాని తరువాతది హిరణ్యలోకం. ధ్యానశక్తిగల  సాధకుల లోకమే  హిరణ్యలోకం.  ఈ హిరణ్యలోకములో సద్భక్తులు , మంచి సాధకులు తమతమ కర్మబీజములను దగ్ధము చేసికుంటారు. 


  • దాని తరువాతది సూక్ష్మలోకం.  ఈ సూక్ష్మలోకంలో భూమి మీద అంతకు క్రితమువి మరియు అప్పుడే మరణించిన జీవులన్నీ ఉంటాయి. అవి తమతమ గుణకర్మలననుసరించి వివిధ క్షేత్రాలలో నివసిస్తారు, వివిధ క్షేత్రాలలో సంచరించే స్వేఛ్ఛ వారు వారు చేసికున్న పుణ్యము ప్రకారము ఉంటుంది.  ఎక్కువ పుణ్యం చేసికున్న వారు  తక్కువ  పుణ్యం చేసికున్న వారి క్షేత్రాలలో సంచరించే స్వేఛ్ఛ ఉంటుంది.
 సూక్ష్మలోకవాసులు కాంతి మీద ఆధారపడిజీవిస్తారు.  జీవులు వారి వారి కర్మఫలమునుబట్టి భూమి మీదకి రావడానికిరెండు నుండి ఐదువేల సంవత్సరాల సమయము పడుతుంది.  భూమిమీద జీవులు ప్రాణశక్తి మీద ఆధారపడిజీవిస్తారు. ఈ సూక్ష్మ విశ్వం భౌతిక విశ్వం కంటే ఎన్నోరెట్లు పెద్దది. అనగా భౌతిక విశ్వంలో కనిపించే వాటికన్నా అనేకమైన సౌర, నక్షత్ర మండలములు ఎన్నో ఉంటాయి. సూక్ష్మలోకవాసులు పాతవారైనా కొత్త వారైనా, ఒకరినొకరిని గుర్తుపట్టగలరు. అనగా పాతవారు అనగా క్రితం జన్మలోనివారు. కొత్తవారు అనగా అప్పుడే స్తూల శరీరము భూమి మీద వదలినవారు.   సూక్ష్మలోక రాత్రులు పగలులు మనము నివసించే భూమిమీద కంటే దీర్ఘముగా ఉంటాయి. పరమాత్మ  ఈ భూమిని ఒక భావముగా రూపొందించాడు.  దాన్ని త్వరితము చేశాడు.

పరమాణుశక్తి,   ఆ తరువాత పదార్ధము పుట్టాయి. భూసంబంధమైన అణువుల్ని సమన్వయపరిచి ఈ విధమైన ఘన గోళముగా రూపొందించినాడు.  కేవలం పరమాత్మ సంకల్పం చేత కూడియుంటాయి, వికల్పము చేత విడిపోయి శక్తిగా పరివర్తన చెందుతాయి. అణుశక్తి తన మూలచైతన్యము లోనికి వెళ్ళిపోతుంది, భూభావం స్తూల(త)త్వము లోంచి అదృశ్యం ఔతుంది. మనిషి స్వప్నంలో సృష్టించే విశ్వములు కూడా దేవుని మౌళిక ఆదర్శాన్ని అనుసరించి అప్రయత్నముగానే కరిగిస్తాడు.


  • పరిపూర్ణసిద్ధిని పొందినవాడు సిద్ధుడు. 
  • జీవించిఉండగానే ముక్తిని పొందినవాడు జీవన్ముక్తుడు.
  • సర్వోత్కృష్ట  స్వతంత్రుడు అనగా మృత్యుంజయుడుని పరాముక్త అంటారు. 



జ్యోతిషామపితజ్జ్యోతిః సమస్తః పరముచ్యతే
జ్ఞానం జ్ఞేయం  జ్ఞానగమ్యం హ్రుదిసర్వస్య విష్ఠితం   గీత  ---13—18

సూర్యునికి, చంద్రునికి,  మరియు అగ్నికి ప్రకాశము నిచ్చునది, అజ్ఞానముకంటే అతీతమైనది, జ్ఞానస్వరూపమయినదియు, పొందతగినదియు, సమస్తప్రాణులయొక్క హృదయమునందు ఉన్నది ఆ పరమాత్మే. 

ఆదిత్యానాం అహం విష్ణుః జ్యోతిషాం రవిరంశుమాన్
మరీచిర్ మరుతామస్మి నక్షత్రాణాం అహం శశీ.  గీత  ---10—21 

నేను ఆదిత్యులలో విష్ణువును, ప్రకాశింపజేయువానిలో కిరణములుగల సూర్యుడను, మరుత్తులను దేవతలలో మరీచియనువాడను, నక్షత్రములలో చంద్రుడను అయియున్నాను.


యదాదిత్యగతం తేజో జగద్భాసయతెఖిలం
యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధిమమకం  గీత  ---15—12

సూర్యునియందున్నా ఏ తేజస్సు ప్రపంచమునంతను ప్రకాశింపజేయుచున్నదో, అట్లే చంద్రునియందును , అగ్నియందును ఏ తేజస్సు గలదో , ఇదియంతయు నాదిగా నెఱుగుము.


మయ్యాధ్యక్షేణ ప్రకృతిః సూయతే సచరాచరం
హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే        గీత  ---9—10

ఓ అర్జునా! అధ్యక్షుడనై (సాక్షీభూతుడనై యున్న నాచేత ప్రకృతి  చరాచర ప్రపంచమునంతను సృజించుచున్నది.  ఈ కారణముచేతనే జగత్తు ప్రవర్తించుచున్నది.



ᐅనిజ విద్వత్తు



-------------------------
నిజ విద్వత్తు 
-------------------------


విత్‌' అనే ధాతువు నుంచి విద్య అన్నపదం వచ్చింది. విత్తి అంటే తెలుసుకోవటం లేక జ్ఞానం. ఏమీ తెలియని స్థితి నుంచి బయటపడటం లేక జ్ఞప్తిచేసుకోవటం జ్ఞానం. ఆదిలో ఉన్నదల్లా అవిద్య లేక అజ్ఞానం. ఏమీ తెలియని పరిస్థితిలో నుంచే తెలివి అనే స్థితికి చేరుకోవాలి. చీకట్లో కనిపించని వస్తువులు వెలుతురు రాగానే స్పష్టంగా తెలుస్తాయి. అందువల్ల అవిద్యకు చీకటి, విద్యకు వెలుగు సంకేతాలుగా ఏర్పడ్డాయి.

ఆదిలో ఉన్నదల్లా చీకటేనని నాసదీయసూక్తం చెబుతున్నది. ఉన్నదల్లా చీకటే అయితే వెలుగు ఎలా వచ్చింది అనే ప్రశ్నకు సమాధానం ఏమిటి? చీకటి కడుపులోంచే వెలుగు పుట్టిందని చెప్పుకోవాలి. చీకట్లో వెలుగు ఉన్నదని ఉపనిషత్తు కూడా చెబుతున్నది. దీన్నిబట్టి, అవ్యక్తమైన చీకటిలాంటి అవిద్యనుంచి విద్యాజ్యోతి ఆవిర్భవించిందన్న విషయం నిర్వివాదం కాబట్టి, ఆ రెండింటిమధ్య ఎలాంటి వైరానికి ఆస్కారం లేదు. కాని, ప్రత్యక్షంగా పరస్పరం విరుద్ధంగా కనిపించే చీకటి వెలుగులు ఒకటేనని, సమన్వయ లోపంవల్ల అలా అనిపిస్తుందని విజ్ఞులు చెబుతున్నారు. సృష్టిలో లేని లోపం దృష్టికి ఎందుకు కనిపిస్తున్నది? ఈ లోపం పోవటానికి మార్గం ఏమైనా ఉన్నదా? ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాలి.

విద్య రెండు రకాలు. ఒకటి భౌతిక విద్య. రెండోది ఆధ్యాత్మిక విద్య. బాహ్యప్రపంచంలోని వస్తువిశేషాలకు మాత్రమే పరిమితమైనది భౌతికమని, 'నేనెవరు? ఈ ప్రపంచం ఏమిటి? ఎలా వచ్చాను? ఎక్కడికి వెళ్తాను?'- ఇలాంటి బాహ్యేతరమైన ప్రశ్నలకు సమాధానం వెతికే జిజ్ఞాసను ఆధ్యాత్మికమని స్థూలంగా చెబుతారు. ఇంద్రియాలు, మనసు ప్రపంచాన్ని తెలుసుకోవటానికి ఉత్సాహపడినంతగా- ఆత్మ గురించి విచారించటానికి ఇష్టపడం. ఎందుకంటే, త్రిగుణాత్మకమైన ప్రకృతి రూపాంతరం చెందుతూ కవ్వించినట్టు ఆత్మ ఉవ్విళ్లూరించలేదు. వినోదయాత్రకు ఉన్న ఆదరణ ఈ ప్రపంచంలో విచారప్రస్థానానికి ఎందుకుంటుంది?

మరి, ఆధ్యాత్మిక విద్య అసలైన విద్య అనటంలో ఉన్న మర్మం ఏమిటి? తీగలాగితే డొంక కదులుతుందన్న సామెత ఈ విద్యకూ అన్వయిస్తుంది. ముందుగా, నేనెవరు? అన్న ప్రశ్నకు సమాధానం రాబట్టుకుంటే, సర్వం తేటతెల్లమవుతుంది.

ప్రజ్ఞానం బ్రహ్మ ... అని ... రుగ్వేదం, 

అహంబ్రహ్మాస్మి ... అని ... యజుర్వేదం, 

తత్త్వమసి ... అని ... సామవేదం, 

అయం ఆత్మాబ్రహ్మా ... అని ... అధర్వవేదం 

చెబుతున్నాయి. ఒక శిల్పి బండరాతిని చిల్లగొట్టి అందమైన శిల్పం తయారుచేస్తాడు. జ్ఞానికూడా అనాత్మ వస్తువును వేరుచేసి ఆత్మసాక్షాత్కారం పొందుతాడు.

ఈ శిల్పచాతుర్యం కోసం మళ్లీ మనసునే వాడుకోవాలి. మనోబుద్ధి అహంకారాలు చిత్తవృత్తులని పతంజలి సూత్రీకరించాడు. ఇంద్రియాలకన్నా మనసు, మనసు కన్నా బుద్ధి, బుద్ధికన్నా ఆత్మ గొప్పదని గీత బోధిస్తున్నది. గీతాగ్రంథానికి యోగప్రస్థానం అన్న మరో పేరున్నది. అనుష్ఠానం, అనుభవం ద్వారా మాత్రమే ఆత్మవస్తువును అనాత్మవస్తువు నుంచి వేరుచేయటం సాధ్యమవుతుంది. యోగించి, భౌతికమైన వస్తువు, దాని పరిజ్ఞానం పరిమితం, అశాశ్వతం అని తెలుసుకోవటమే అసలైన విద్య.

- ఉప్పు రాఘవేంద్రరావు


ᐅఆత్మ రమణీయం


ఆత్మ అనిర్వచనీయ సౌందర్యం

సంతి రమ్యతరాద్రమ్యా? సుస్థిరాదపి సుస్థిరా?

చిన్తా పర్యవాసానేయం పదార్ధశ్రీ: కిమీహనే.

ప్రపంచంలో అతిరమణీయమైన పదార్ధము లెన్నియో కలవు. కొంతకాలము స్థిరముగనుండు పదార్ధములు ఎన్నియో కలవు. కాని కాలగర్భమున అవియన్నియు ఎట్టకేలకు నశించిపోవుట వలన చింతనే అవి కలుగజేయుచున్నవి. అందువలన వాని నాశ్రయింపవలదు, అని శ్రీవసిష్ఠమహర్షి శ్రీరామచంద్రునకు భోధించెను.

సుందరమైన వస్తువు ఆనందమును గొల్పును, చక్కని పుష్పము జనులకు ఆహ్లాదమును గలుగజేయును. అట్లే సుంధర భవనము, సుందర చిత్రము, సుందర దేహము జనుల హృదయ సీమలందు ఆనందము యొక్క సంచారమునకు హేతుభూతములగుచున్నవి.

A Thing of beauty is a joy forever అను ఆంగ్లసూక్తి ఈ భావమునే స్పష్టీకరించుచున్నది. "సుందర పదార్ధము పరమానందమును గలిగజేయు" నని ఆ వాక్యముయొక్క అర్ధము. అయితే సుందరమైన వస్తువేది? చపలమై, క్షణికమై నేడో రేపో నశించిపోవు పదార్ధము సుందరమైన దెట్లగును? అది యెంత రమణీయముగ గంపట్టినప్పటికిని దాని సౌందర్యము సౌందర్యము కానేరదు.

నేడు మహాసుందరముగ నగుపించిన గులాబిపువ్వు సాయంత్రమునకు వాడిపోయి, రేపటికి నశించి పోవుచున్నది. ఈనాడు అత్యంత రమణీయముగ కనుపించిన మహాభవనము కొద్ది సంవత్సరములకు శిధిలమై పోవుచున్నది, నేడు లోకైక సుందరి అని ఖ్యాతివడసిన మగువ కొలది వత్సరములకు వృద్ధాప్యమునకు బలియై కురూపిణియై మరణించుచున్నది. ఇక ఆ క్షణిక సౌందర్యమునకు ఏమి విలువ?

That which is permanent is really beautiful ... నాశములేని వస్తువే వాస్తవముగ సుందరమైనది. అట్లు నాశములేని వస్తువు ప్రపంచములో ఏది కలదు? ఒక్క దైవము తప్ప తదితరమైన ప్రతివస్తువును కాలప్రవాహమున గొట్టుకొని పోవలసినదే. ఆత్మవస్తు వొకటి తప్ప తక్కిన దృశ్యపదార్ధములన్నియు కాలగర్భమున అంతరించి పోవలసినవే. దీనినిబట్టి అన్నిటికంటె గొప్ప సౌందర్యము దైవమునకే, ఆత్మకే కలదని స్పష్టమగుచున్నది. కావున దానినే జీవులు ఆశ్రయింపవలసియున్నారు. అదియే జనులకు పరమానందమును గలుగజేయును జూచి మోసాపోరాదు. తాత్కాలిక సౌందర్యములకు, పైపై తళుకు బెళుకులకు ఎన్నడును లోనుకాగూడదు.  కావున విజ్ఞులగువారు ప్రపంచములోని పదార్ధములను చక్కగ వివేచించి, వాని ఆపాత సౌందర్యములకు మురిసిపోక, వానిపై ఆసక్తిని తగ్గించుకొని, శాశ్వతమై, స్థిరమై, సనాతనమైనట్టి పరమాత్మయందు అనన్యభ క్తిగలిగి, హృదయగుహయందట్టి లోకోత్తరసౌందర్యమును సదా వీక్షించుచు బ్రహ్మనుభూతిని బడసి జీవితమును చరితార్ధ మొనర్చుకొందురుగాక!


ᐅబ్రహ్మచర్య నియమం

బ్రహ్మచర్యం - ఆచరణ

"ఆష్టాశీతి సహస్రాణామృషీణా మూర్ధ్వరేససాం

ఉత్తరేణార్నమ: పంథాస్తేమృతత్వం హి భేజిరే"

బ్రహ్మచర్యం వల్ల అమృతత్వాన్ని పొందవచ్చని విష్ణుపురాణం చెబుతుంది. బ్రహ్మచర్యం గొప్ప సాధన. బ్రహ్మచర్యం అంటే భౌతిక వాంచలను త్యజించడం. ఆత్మ జ్ఞాన సంపాదనకు ఈ సాధన చాలా అవసరం. చాందోగ్యోపనిషత్తు ఒక చోట్ల బ్రహ్మచర్యాన్ని చాలా స్తుతించింది. జీవికి మేలు కలిగించే విషయాన్ని స్తుతించడం, కీడు కలిగించే విషయాన్ని నిందించడం వేదంలో పరిపాటి. దీన్నే అర్ధవాదమంటారు. స్తుతింపబడినదాన్ని సాధకులు అవశ్యం గ్రహించాలి. నిందింపబడినదాన్ని అవశ్యం పరిహరించాలనేది ఉద్దేశ్యం. చాందోగ్యోపనిషత్తు 8వ అధ్యాయం 5వ ఖండంలో బ్రహ్మచర్యం క్రింది విధంగా స్తుతింపబడింది.... యజ్ఞం అని లోకంలో దేన్ని అంటారో అది బ్రహ్మచర్యమే. ఎందుకంటే నిష్కామంగా చేసే యజ్ఞాల ద్వారా కర్మయోగి చిత్తశుద్ధి పొంది తద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు. అదే ఫలాన్ని (ఆత్మజ్ఞాన్ని) సాధకుడు బ్రహ్మచర్య సాధన ద్వారానూ పొందుతాడు. కాబట్టి యజ్ఞం అనేది బ్రహ్మచర్యమే అని స్తుతి. ఇష్టం అని లోకంలో దేన్ని అంటారో అది కూడా బ్రహ్మచర్యమే. ఇష్టం అనేది ఒక విధమైన వైదిక కర్మ. ఈ కర్మ ద్వారా భగవంతుని పూజించడం జరుగుతుంది.

సాధకుడు తన బ్రహ్మచర్య నియమమే భగవంతునికి చేసే పూజగా భావించి ఆ దేవుని అనుగ్రహానికి పాత్రుడవుతాడు. కనుక ఇష్టం అనేది కూడా బ్రహ్మచర్యమే అని స్తుతి. మౌనం అని దేన్ని అంటారో అది కూడా బ్రహ్మచర్యమే. మౌనం అంటే ధ్యానం. సాధకుడు శాస్త్రాల ద్వారా ఆచార్యుల ద్వారా ఆత్మ స్వరూపాన్ని గురించి తెలుసుకుని బ్రహ్మచర్య సాధన ద్వారా ఆ స్వరూపాన్ని ధ్యానించగలుగుతారు. కనుక మౌనం అనది కూడా బ్రహ్మచర్యమే అనేది మరో స్తుతి. అరణ్యాయనం అని దేన్ని అంటారో అది కూడా బ్రహ్మచర్యమే. అరణ్యాయనం అంటే వానప్రస్థాశ్రమ స్వీకారం. ఇది చాలా పుణ్య హేతువు. అరణ్యాయనానికి బ్రహ్మలోకాన్ని పొందుట అని కూడా మరో అర్ధం ఉంది. సాధకునికి బ్రహ్మచర్య సాధన వల్ల బ్రహ్మలోకప్రాప్తి సిద్ధిస్తుంది. కనుక అరణ్యాయనం అనేది కూడా బ్రహ్మచర్యమే అనేది మరో స్తుతి. యజ్ఞం, ఇష్టం, సత్రాయణం, అనాశకాయనం, మౌనం, అరణ్యాయనం - ఇవి వేదంలో ప్రసిద్ధికెక్కిన పురుషార్థ సాధనాలు. ఈ ప్రసిద్ధ పురుషార్థ సాధనాల ద్వారా బ్రహ్మచర్య స్తుతి చాందోగ్యోపనిషత్తు చేసింది. కనుక శ్రేయోమార్గంలో పోదలుచుకొన్న సాధకులకు బ్రహ్మచర్య నియమం అవశ్యాచరణీయం.

ᐅJīvo Brahmaiva



-------------------------------------------------------------------
Brahma satyam jagat mithyā, jīvo brahmaiva nāparah 
-------------------------------------------------------------------

akhaṇḍamaṇḍalākāraṁ vyāptaṁ yena carācaram 

tatpadaṁ darśitaṁ yena tasmai śrīgurave namaḥ [1]

Salutations to that Guru, who has shown to me That undivided Whole, by which is pervaded all that which moves and that which does not move.
ajñānatimirāndhasya jñānāñjanaśalākayā 

cakṣurunmīlitaṁ yena tasmai śrīgurave namaḥ [2]

Salutations to that Guru, who has opened my eyes, by applying the divine collyrium (kājal) of knowledge, thus removing the blindness of ignorance.
gururbrahmā gururviṣṇuḥ gururdevo maheśvaraḥ 

gururevaṁ paraṁ brahma tasmai śrīgurave namaḥ [3]

Salutations to that Guru, who is Brahma, Vishnu and Shiva, who is verily the supreme Brahman.
sthāvaraṁ jaṅgamaṁ vyāptaṁ yatkiṅcit sacarācaram 

tatpadaṁ darśitaṁ yena tasmai śrīgurave namaḥ [4]

Salutations to that Guru, who has shown to me That, which pervades all that is animate/inanimate and movable/immovable.
cinmayaṁ vyāpi yatsarvaṁ trailokyaṁ sacarācaram 

tatpadaṁ darśitaṁ yena tasmai śrīgurave namaḥ [5]

Salutations to that Guru, who has shown to me That Pure Consciousness, which pervades all the three worlds, including all movable/immovable objects.
sarvaśrutiśiroratna virajitapadāmbuja 

vedāntambujasūryo yaḥ tasmai śrīgurave namaḥ [6]

Salutations to that Guru, who is like the Sun (which enables the blossoming of) the lotus of Vedanta, and at whose lotus feet abide the crown jewels of all the Veda-s.
caitanyaḥ śāśvataḥ śāntaḥ vyomātīto nirañjanaḥ 

bindunādakalātītaḥ tasmai śrīgurave namaḥ [7]

Salutations to that Guru, who is of the nature of Eternal Consciousness, taintless, and who transcends space, time, bindu (zero/nothingness), nāda (sound) and kalā (divisions).
jñānaśaktisamārūḍhaḥ tattvamālāvibhūṣitaḥ 

bhuktimuktipradātā ca tasmai śrīgurave namaḥ [8]

Salutations to that Guru, who is established in the power of knowledge, who is adorned by the garland of truth, and who is the giver of both mundane enjoyments (bhukti) and liberation (mukti).
anekajanmasamprāpta karmabandhavidāhine 

ātmajñānapradānena tasmai śrīgurave namaḥ [9]

Salutations to that Guru, who provides the knowledge of the Self, which burns away the bondage of karma accumulated over several births.
śoṣaṇaṁ bhavasindhośca jñāpanaṁ sārasampadaḥ 

guroḥ pādodakaṁ samyak tasmai śrīgurave namaḥ [10]

Salutations to that Guru, whose very pādodakaṁ (water left behind after washing the Guru's feet) provides knowledge of the True Wealth and dries up the ocean of saṁsāra.
na guroradhikaṁ tattvaṁ na guroradhikaṁ tapaḥ 

tattvajñānāt paraṁ nāsti tasmai śrīgurave namaḥ [11]

Salutations to that Guru, for there is no reality greater than the Guru, no penance greater than (service to) the Guru and nothing greater than the knowledge of Reality (taught by the Guru).
mannāthaḥ jagannāthaḥ madguruḥ śrijagadguruḥ 

madātmā sarvabhūtātmā tasmai śrīgurave namaḥ [12]

Salutations to that Guru, who is my lord and the lord of the universe, my teacher and the teacher of the world, my Self and the Self of all phenomena.
gururādiranādiśca guruḥ paramadaivatam 

guroḥ parataraṁ nāsti tasmai śrīgurave namaḥ [13]

Salutations to that Guru, for the Guru is the beginning (of all) but is himself beginning-less, the Guru is the highest divinity, there is nothing greater than the Guru.
brahmānandaṁ paramasukhadaṁ kevalaṁ jñānamūrtiṁ 

dvandvātītaṁ gaganasadṛśaṁ tattvamasyādilakṣyam 

ekaṁ nityaṁ vimalamacalaṁ sarvadhīsākṣibhūtaṁ 

bhāvātītaṁ triguṇarahitaṁ sadguruṁ taṁ namāmi [14]

I bow to the Guru, who is verily the joy of Brahman, the supreme happiness, the embodiment of knowledge, who is beyond all dualities, who is the like the sky and is pointed to by the mahāvākya-s such as tattvamasi, who is eternal and unmoving, who is the witness of all phenomena, who is beyond existence and the three guṇa-s.
tvameva mātā ca pitā tvameva 

tvameva bandhuśca sakhā tvameva 

tvameva vidyā draviṇaṁ tvameva 

tvameva sarvaṁ mama devadeva [15]

You (the Guru) are the mother, you are the father. You are the brother, you are the friend. You are knowledge, you are wealth. You are everything, my lord of lords.

iti śrīgurustotram samāptam

Thus ends the Guru stotram.
.
.
Viveka Chudamani - http://www.youtube.com/watch?v=DE448YMpprU


ᐅగీతాసారం



-------------------
భగవద్గీతాసారం
-------------------

నీవు అనవసరంగా ఎందుకు దిగులుపడుతున్నావు? నీవు ఎవర్ని చూసి భయపడుతున్నావు? నిన్ను ఎవరు చంపగలరు? ఆత్మకు పుట్టుక గిట్టుకలు లేవు. జరిగినది మంచికోసమే జరిగింది. జరుగుతున్నదేదో మంచికోసమే జరుగుతోంది. జరగబోయేది మంచి కోసమే జరగబోతుంది. గతాన్ని గురించి మనస్సు పాడుచేసుకోవద్దు. భవిష్యత్తును గురించి దిగులుపడవద్దు. ఏమి నష్టపోయావని నీవు బాధపడుతున్నావు? నీతో కూడా నీవు ఏమి తెచ్చావు? ఏమి పోగొట్టుకున్నావు? నీవు ఏమి తయారుచేసావు? ఆ చేసినదేదో నాశనం అయింది. నీవు ఏమీ తీసుకురాలేదు. నీ దగ్గరున్న దాన్ని నీవు ఇక్కడే పొందావు. నీకు ఇవ్వబడినదేదో అది ఇక్కడే ఇవ్వబడింది. నీవు తీసుకున్నది ఈ ప్రపంచంనుండే తీసుకోబడింది. నీవు యిచ్చింది, ఈ ప్రపంచం నుండీ తీసుకున్నదే. నీవు వట్టి చేతులతో వచ్చావు. వట్టి చేతులతో పోతావు. ఈరోజు నీదైనది. గతంలో అది మరొకడిది. అదే ఆ తరువాత మరొకడిది అవుతుంది. నీవు దాన్ని నీ సొంతం అనుకుంటావు. దానిలో లీనమైపోతున్నావు. ఈ అనుబంధమే అన్ని దుఖాలకు మూలకారణం.

మార్పు అన్నది జీవితపు నియమం. ఒక్క క్షణంలో నీవు లక్షాధిపతివి ఆ తరువాత క్షణంలో నీవు బికారివి. ఈ శరీరం నీది కాదు. అంతేకాదు నీవి ఈ శరీరం కానే కావు. భూమి, నీరు, గాలి, నిప్పు, ఆకాశం ఇవి పంచభూతాలు. వీటితో నీ శరీరం ఏర్పడింది. చనిపోయిన తరువాత ఈ పంచభూతాలు అవి వచ్చిన చోటుకు వెనుతిరిగిపోతాయి. కానీ ఆత్మ అన్నది మరణం లేనిది. అది నిరంతరమైనది. అటువంటప్పుడు నీవు ఎవరివి? భగవంతుని శరణుజొచ్చు. అతడే అంతిమ ఆధారం. ఈ అనుభవాన్ని పొందిన వ్యక్తి భయం, దిగులు, నిరాశల నుండీ పూర్తిగా ముక్తుడై ఉంటాడు. నీవు చేసే ప్రతి ఒక్క పని అతడికి అర్పించు. ఈవిధంగా చేయడం వల్ల, కలకాలం నిలిచిపోయే సచ్చితానందాన్ని నీవు పొందుతావు.

ᐅద్వైతాద్వైత అంతరం-అర్థం

|| ద్వైతాద్వైత విశిష్టాద్వైతాoతరం - అర్థం ||


దేవుడు ఉన్నాడని అంగీకరించే మతం ఆస్తిక మతం. ఆస్తికులలో జీవులు చేతులు, కాళ్ళు మొదలైన వివిధ శరీరావయవాలులాగా దేవుని చేరి ఉంటారని చెప్పేవారు విశిష్టాద్వైతులు.

జీవుడికీ, దేవుడికీ అన్ని కాలాల్లోనూ, అన్ని అవస్థలలోనూ భేదం ఉంటుందని వాదించేవారు ద్వైతులు.

రెండు విధాలు కానిది, భేదం లేదని వాదించేవారు అద్వైతులు. ఈ వాదాన్ని ప్రతిపాదించినవారు శ్రీ శంకరాచార్యులు. అద్వైత వాదాన్నే "మాయా వాదం" అంటారు. దీనినే ప్రచ్చన్న బౌద్ధం అని కూడా అంటారు. ఈ దేహమే దేవాలయం. అందులో జీవుడే దేవుడు. దేహం పోయినా జీవుడు ఉంటాడని అద్వైతుల వాదన. దేహం నశించాక జీవుడు వేరే శరీరంలో ప్రవేశిస్తాడు. లేకపోతే ప్రకృతితో అంతర్లీనమైపోతాడు.

పాలలో ఉండే వెన్నను తీసేస్తే ఆ వెన్న తిరిగి పాలలో కలవదు. అలాగే దేవుడు నుండి జీవుడుని వేరుచేస్తే ఆ జీవుడు తిరిగి దేవుడులో కలవడు. కాబట్టి జగత్తు సత్యం, జీవుడు సత్యం అంటుంది విశిష్టాద్వైతం. విశిష్టాద్వైత వాదాన్ని ప్రతిపాదించినవారు శ్రీరామానుజాచార్యులవారు.

అద్వైత విశిష్టాద్వైతాల తరువాత ద్వైతమతం ఆవిర్భవించింది. ఈ మతాన్ని స్థాపించింది ఆనందతీర్ధులు. వీరినే మధ్వాచార్యులు అని కూడా అంటారు. వీరు జగత్తు సత్యం, దేవుడు సత్యం, జీవుడు సత్యం అంటారు. జీవుడూ, దేవుడూ ఎప్పటికీ ఒక్కటి కాజాలరు. భక్తి చేతనే జీవుడు తరిస్తాడు అని ద్వైతులు అంటారు. వీరికి వేదాలు ప్రమాణమైనా భాగవతం వీరి బోధనలకు ముఖ్యం. రెండుగా ఉండడం అంటే జీవాత్మ, పరమాత్మలకు భేదం చెప్పే మతం ద్వైతం. జీవాత్మ, పరమాత్మలకు భేదం చెప్పేవాడు ద్వైతవాది.

అద్వైతం జీవులలో పరస్పర భేదాన్ని నిర్దేశిస్తూ ఈశ్వరునితో కూడా భేదాన్ని నిర్దేశిస్తుంది. అద్వైతం జీవులలో మాయను తొలగించి శుద్ధ చైతన్య రూపంలో సర్వానికి అభేదాన్ని ఋజువు చేస్తుంది. అంటే ఆత్మ శుద్ధ చైతన్య రూపం అనీ, సర్వాన్నీ తెలుసుకోగల శక్తి సర్వసాక్షి అనే సంకేతంలో ఉందని, జీవులందరూ తదితర వస్తువులందు భేదాన్ని సాధించే సదుపాయాలన్నీ కల్పితాలు అని తెలుస్తుంది. అంతా మాయ అని తెలుస్తుంది.

అద్వైతం, భావాద్వైతం, క్రియాద్వైతం, ద్రవ్యాద్వైతం అని మూడు విధాలుగా ఉంటుంది.

మూల రూపానికి వివిధ అవతార రూపాలకి పరస్పర భేదం లేదని తెలుసుకుని ప్రవర్తించడం భావాద్వైతం. బట్టకీ, బట్టలో ఉండే నూలు పోగులూ ఏవిధంగా అభేదంగా ఉంటాయో అదే విధంగా కారణ కార్యగత రూపాలకి ఏమీ తేడా ఉండదు. ప్రకృతి, ప్రపంచం కూడా స్వతంత్రంగా ఏ కార్యాన్నీ పుట్టించడం లేదు. కారణ కార్యాలలో భగవంతుని రూపాలు సన్నిహితమై ఉండటం వల్ల కార్యాలు ఉద్భవిస్తున్నాయి. కారణ కార్యగతమైన భగవద్రూపాలకి పరస్పరం భేదం లేదని చింతన చేయడం భావాద్వైతం.

ఇంద్రియ వ్యాపారాలు భగవంతుడు లేనిదే జరగవు. అన్ని కర్మలూ భగవంతునికీ, భగవంతుని అధీనంలో ఉన్న బుద్ధితో సమర్పించడం క్రియాద్వైతం. జ్ఞాన కర్మేంద్రియాలతో చేసే పనులన్నీ శ్రీమన్నారాయణుడే చెప్పి ఆయావిధాలుగా చేయిస్తున్నాడని తెలుసుకోవడం క్రియాద్వైతం. నేను కర్తను కాదు, హరియే కర్త అని తెలుసుకోవడం క్రియాద్వైతం.

కుటుంబం, భార్య, బిడ్డలు, ఇతర వస్తువులు సర్వమూ భగవంతుని అధీనం అని తెలుసుకుంటూ సర్వమూ ఆ పరమాత్మునికే అర్పించికోవడం ద్రవ్యాద్వైతం. ధనాది ద్రవ్యాలలో శ్రీనారాయణుడు నామ, రూప, అక్షరాలలో వ్యాప్తుడై ఉంటాడనే ఐక్య భావన ద్రవ్యాద్వైతం.


- తెలుగుదనం

ᐅజీవుడే దేవుడు



అహం బ్రహ్మాస్మి

"దేహమే దేవాలయం జీవుడే దేవుడు" అనే వేద ప్రమాణానుసారం, సృష్టిలో ఉండే ప్రతి జీవి దేహం ఒక దేవాలయమే. ప్రతి జీవి కూడా పరబ్రహ్మమే.

"జ్ఞాన హీనః పశుభిస్సమానః" అంటే జ్ఞానం లేని ప్రతి వ్యక్తి విచక్షణాజ్ఞానం లేని పశువుతో సమానమని అర్ధం. ఇక్కడ జ్ఞానం అంటే ఏమిటని విచారిస్తే చతుర్వేదముల నుండి గ్రహించబడిన 4 మహావాక్యములు అంటే 4 వేదాల సారము

(1) "అహం బ్రహ్మాస్మి" = నేనే పరబ్రహ్మమును

(2) "అయమాత్మాబ్రహ్మ" = నా ఆత్మయే బ్రహ్మ అంటే దేవుడు

(3) "ప్రజ్ఞానం బ్రహ్మ" = విశేషణమైన జ్ఞానమేదికలదో అదియే బ్రహ్మ

(4) "తత్వమసి" = ఏదైతే దేవుడు పరబ్రహ్మము ఉన్నదో అది నీవే అయి ఉన్నావు.

పై నాలుగు మహావాక్యములు నీవే భగవంతుడవు అనే నగ్న సత్యాన్ని మన ముందుంచినా "సముద్రము తలాపున ఉంచుకొని , చేప నీళ్ళకు ఏడ్చినట్లుగా" మనం జ్ఞాన స్వరూపులం, అఖండ సచ్చిదానంద స్వరూపులం అయి ఉండి కూడా నాకు 'సుఖం ' లేదు 'శాంతి ' లేదు అని బాధపడుతూ ఆ సుఖం, శాంతిని పొందడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా మనం పొందే సుఖం పరావర్తన సుఖం. అంటే మన నుండి ఉద్భవించిన సుఖం. జ్ఞానం మనం మరచిపోయినందువల్లనే ఒక్క మానవ జీవితానికే ఇంత బాధ్యత తద్వారా ఇన్ని అనర్ధాలు, బాధలు, దుఃఖాలు, భయాలు కలుగుతున్నాయి. ఇది అనుభూతిలోకి రావడానికి వేదవాక్యముపై విశ్వాసముంచి తద్వారా ఆ ఆత్మభూతస్థితిలో ఉండుటే  మార్గము.

ᐅబ్రహ్మ సత్యం జగన్మిధ్య


బ్రహ్మ సత్యం జగన్మిధ్య  ~ జీవొ బ్రహ్మైవ నా పరః

బ్రహ్మమొక్కటే సత్యం. జగత్తు మిధ్య. ఈ జీవుడే బ్రహ్మం. జీవుడు, బ్రహ్మము వేరు కాదు. - ఇదే శంకరుని మాయావాదంగా ప్రసిద్ధమైనది. అయితే కంటికి కనిపిస్తున్న జగత్తు మిధ్య కావడమేమిటి? ఏనుగు తరుముకొస్తుంటే పారిపోవక తప్పదు కదా? - ఇందుకు మాయావాదం వివరణ : జగత్తులో జీవిస్తున్నంతకాలం దాని ఉనికి అనే భావనకు తగినట్లుగానే (అనగా అది యదార్ధమన్నట్లుగానే) ప్రవర్తించాలి. ఎప్పుడైతే ఇదంతా మిధ్య అన్న జ్ఞానం గోచరమౌతుందో అపుడు అందుకు అనుగుణమైన ప్రవర్తన దానంతట అదే వస్తుంది.

ఈ జీవితంలో సుఖం అనిపించేది ఒక భ్రమ. మరి ఈ ఎడతెరిపి లేని దుఃఖానికి కారణం ఏమిటి? "ఆత్మానాత్మ వివేకం" అనే ప్రకరణ గ్రంధంలో ఇలా వివరించాడు -

ఆత్మ ఈ శరీరాన్ని ఎందుకు ధరించవలసి వస్తున్నది?

  • పూర్వ జన్మ లలోని కర్మ వలన.


కర్మ ఎందుకు జరుగుతుంది?

  • రాగం (కోరిక) వలన.


రాగాదులు ఎందుకు కలుగుతాయి?

  • అభిమానం (నా, నాది, నేను, కావాలి అనే భావం) వలన.


అభిమానం ఎందుకు కలుగుతుంది?

  • అవివేకం వలన


అవివేకం ఎందుకు కలుగుతుంది?

  • అజ్ఞానం వలన


అజ్ఞానం ఎందుకు కలుగుతుంది?

  • అజ్ఞానానికి కారణం లేదు. అది అనాదిగా ఉన్నది. (వెలుగు లేని చోట చీకటి ఉన్నట్లుగా. అందుకు కారణం ఉండదు.)

దాని పుట్టుక ఎవరూ ఎరుగరు. అది మాయ. త్రిగుణాత్మకం. జ్ఞానానికి విరోధి. అదే అజ్ఞానం.
అనగా అజ్ఞానం వలన అవివేకం, అవివేకం వలన అభిమానం, అభిమానం వలన రాగాదులు, రాగాదుల వలన కర్మలు, కర్మల వలన పునర్జన్మ (శరీర ధారణ), అందువలన దుఃఖం కలుగుతున్నాయి.


ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత -- ఈ మూడింటినీ కలిపి ప్రస్థానత్రయి అన్నారు. వీటికి అన్నిటికీ సమన్వయం చేకూర్చి, వాటి భావం > వేదముల లక్ష్యము > జీవాత్మ, పరమాత్మల ఏకత్వ భావనే ప్రాతిపదిక.

ఓం తత్ సత్

ఓం తత్ సత్

!! ఓం అసతొమా సద్గమయ, తమసొమా జ్యొతిర్గమయ, మృత్యొర్మా అమృతం గమయ !!
ॐ असतो मा सद्गमय । तमसो मा ज्योतिर्गमय । मृत्योर्मा अमृतं गमय ।

 ॐ शान्तिः शान्तिः शान्तिः ॥



O Lord lead us from Untruth to Truth,
Lead us from Darkness to Light,
Lead us from Death to Immortality



ఓం శహనాభవతు, శహనౌభునక్తు ... సహవీర్యం కరవావహై ... తేజస్వి నావధీతమస్తు మావిద్విషావహై


ఓం శాంతి శాంతి శాంతి



.

ptl