ᐅ చోదక శక్తి
ᐅ చోదక శక్తి
తీవ్రమైన భావోత్ప్రేరకమే తపన. అది మనల్ని మున్ముందుకు నడిపే ఇంధనం. మనో వ్యాపారాలను గమ్యంవైపు సాగేలాచేసే హృదయజనిత శక్తి. మనిషి సహజంగా ప్రగతి కాముకుడు. ప్రగతిని మనసు ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూనే ఉంటుంది.
బాహ్యాంతర్గత విధి విధానాలను వాడిగా, వడిగా క్రియారూపంలోకి తీసుకెళ్తుంది. నిప్పురవ్వలా ఉద్భవించి ప్రజ్వలనగా మారి సాధనా క్రియను ప్రకాశింపజేస్తుంది.
సాధకుడి సాధనకు పాశుపతాస్త్రం తపన. తపన ఉన్మాదం కాదు. తమో గుణానికి దారి తీయదు. అంతర్లీనంగా ఉంటూ ఆశయసిద్ధికి తోడ్పడుతుంది.
'తపన' అనగానే, అదేదో బరిలో దూసుకెళ్లిపోయేందుకు సిద్ధపాటుతో ఉండే వస్తువు లాంటిది కాదు. మోహంతో కూడిన శక్తీ కాదు.
పువ్వులకు వాయువు తోడైతే పరిసరాలు పరిమళ భరితమవుతాయి. తపన శక్తిపూరిత అంతర్వాయువు.
జడస్థితి పోగొట్టి చైతన్యస్థితి కలిగించే వాహకమది. భూగర్భ పొరల్లో నిక్షిప్తమై ఉండే విలువైన ఖనిజ సంపదను వెలికి తీసేందుకు ఉపకరించే పరికరంలా తపన అంతర్గత శక్తిని ప్రచోదనం గావిస్తుంది.
లౌకిక ప్రపంచంలో, అనుభూతికి మాత్రమే ద్యోతకమయ్యే భగవత్శక్తిని తెలుసుకునేందుకు ఏకైక సాధనం తపన.
ఆధ్యాత్మిక జగత్తులో తపనే- తపస్సు, ధ్యానం. మనం కుటుంబ సమాజ జీవనానికి, బంధాలకు కట్టుబడినవాళ్లం. ఏ సాధనైనా ఈ చట్రంలోనే అన్నట్టుగా భ్రమిస్తుంటాం. తపిస్తుంటాం.
యోగులు, సిద్ధులు, మహా పురుషులు ఈ తపనలో కట్టుబడరు. వారి తపనను ఆధ్యాత్మిక కోణం వైపు మరల్చుతారు. అందుకే వారికి సుఖదుఃఖాలు అంటవు. కోర్కెల వలయాల్లో చిక్కుకోరు. లౌకిక జగత్తులో ఉన్నా అలౌకిక ఆనందం పొందుతారు. సర్వ జీవుల్లోనూ భగవత్ రూపాన్నే దర్శిస్తారు! సమభావం, స్థితప్రజ్ఞత వారి సొత్తు. దూషణ భూషణలకు అతీతులుగా ఉంటారు.
అర్థవంతమైన, ఆరోగ్యవంతమైన, ఉన్నతమైన జీవితమే ఆధ్యాత్మికత. నారాయణ స్వరూపుడైన వేదవ్యాసుడు సాక్షాత్తు సరస్వతీ స్వరూపం. తండ్రి దగ్గరే విద్యను అభ్యసించిన శుకుడు ఎంతకీ సంతుష్టుడు కాలేదు. జ్ఞానతృష్ణతో తపించిపోయాడు. లోకసంచారిగా మారాడు. మహాజ్ఞానులను ఆశ్రయించి యోగీంద్రుడయ్యాడు. జితేంద్రియుడయ్యాడు. శుకబ్రహ్మగా గుర్తింపు పొందాడు.
గధాదరుడి ఆధ్యాత్మిక తపన పరమహంసగా చేసింది. ఏ తపనా వృథా పోదు. అది విద్యార్థిని విద్యావంతుడిగా, ఆచార్యుని జ్ఞానసిద్ధుడిగా, కళాకారుణ్ని కళాస్రష్టగా, వాణిజ్యవేత్తను కుబేరుడిగా, శ్రమజీవిని ఐశ్వర్యవంతుడిగా, ఆధ్యాత్మికవేత్తను అవతారమూర్తిగా చేస్తుంది.
అల్పులు మాత్రమే ఈ అంతర్వాయువును క్షణికానందాలకు ఉపయోగించుకుంటారు. విజ్ఞులు దీన్నొక శక్తిసాధనంగా పదిలంగా చూసుకుంటారు.
ఆధునిక శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు సృష్టికి ప్రతిసృష్టి చేయగలుగుతున్నారు. సృష్టి మూలాలను శోధిస్తున్నారు. గుండెకు బదులుగా గుండెను అమర్చి వూపిరులూదగలుగుతున్నారు. మరమనుషుల్లో సైతం ఆత్మీయ స్పందనలను కలిగిస్తున్నారు. మానవ జీవితం మొత్తం సాధన-శోధనలతో ముడివడి ఉంది. మృష్టాన్నం అందంగా అమర్చి పెట్టుకున్నంత మాత్రాన సరిపోదుకదా! భుజిస్తేనే ఆకలి తీరేది, తృప్తి పొందేది. సాధన-శోధనలను ఫలవంతం చేసేది తపనే. వేగంగా పరుగెత్తే గుర్రాలకు కళ్లేలు ఉన్నాయి. తపన ఉద్ధృత ప్రవాహమయ్యే వేళ- విస్తృతంగా విహరించే తత్వంగల మనసుకు, నిగ్రహశక్తిని కూడా కల్పించాడు భగవంతుడు.
అతిని మితం గావించుకునే వివేకం మనిషికి అవసరం. లక్ష్యాలు, ఆశయాలు ఈ చోదకశక్తితోనే సాకారమవుతాయని గుర్తెరగాలి. ఆధ్యాత్మిక ప్రపంచంలో భగవద్రూపాన్ని దర్శించాలంటే, భగవత్తత్వాన్ని గ్రహించాలి. ఆ తత్వాన్ని తెలుసుకునేందుకు ఉపకరిస్తుందీ చోదకశక్తి.
- దానం శివప్రసాదరావు
ᐅ సృష్టిలో తీయనిది
ᐅ సృష్టిలో తీయనిది
ఒక మంచి స్నేహితుణ్ని పొందడంకన్నా మించిన వరం జీవితంలో మరొకటి లేదు. అడుగడుగునా ప్రోత్సాహం ఇచ్చే మృదుభాషణుడైన స్నేహితుడు ఉంటే జీవితంలో నైరాశ్యం అంటూ ఉండదు. అటువంటి మిత్రుడు దొరకడం అత్యంత దుర్లభం.
స్నేహితులు చాలా అవసరం కాని, మంచి స్నేహితుల్ని సంపాదించడం ముఖ్యం. సూర్యుడు ఉదయించినప్పుడు మనిషి నీడ పొడవుగా ఉంటుంది. సూర్యుడు కదులుతున్నప్పుడు నీడ క్రమంగా చిన్నదవుతుంది. మిట్టమధ్యాహ్నం వేళకు నీడ అడుగు పొడవుకూడా ఉండదు. ఇదే విధంగా చెడు స్నేహితుడి స్నేహం సాగుతుంది. ముందు మంచి మాటలతో స్నేహం చేస్తారు. స్నేహం చాలాకాలం ఉంటుందన్న అభిప్రాయం కలుగుతుంది. చెడు మిత్రుల మాటలు పొగడ్తలు మాత్రమే. వారి మాటల్లో అర్థం కనిపించదు. ఒక వ్యక్తినుంచి ఏదో కావాలని కోరుకొని స్నేహం చేసేవారే ఎక్కువ. అవసరమైన క్షణంలో వారు కనిపించరు. ఆసరాగా నిలబడరు.
సూర్యుడి వల్ల పడిన నీడలాగానే వారి స్నేహం నెమ్మదిగా తగ్గిపోతుంది. మధ్యాహ్నం గడిచిన పిమ్మట పడే నీడలాగా మంచివారితో స్నేహం పెరుగుతుంది. సాయంత్రానికి మరింత పెద్దదవుతుంది. మంచివారు సులభంగా దొరకరు. కాని, ఒకసారి వారి విశ్వాసం పొందగలిగితే అది చివరిదాకా నిలిచి ఉంటుంది. తమ ప్రయోజనాలకోసం స్నేహితుల్ని వారు వాడుకోరు. చెడ్డవారు స్నేహితుల ప్రేమను, గౌరవాన్ని దుర్వినియోగం చేయడానికి వెనకాడరు. ఒక్కొక్కసారి మిత్రుడు మృతి చెందినా విచారించరు.
రావణుడితో స్నేహంవల్ల మారీచుడు ఎంత నష్టపోయాడో మనకు రామాయణం చెబుతుంది. శ్రీరాముడి బలం ఎటువంటిదో మారీచుడికి తెలుసు. ఒకసారి మారీచుణ్ని రాముడు సముద్రంలోకి నెట్టాడు. మారీచుడు ఈ సంఘటనతో ఎంత భయపడ్డాడంటే, 'రా' అనే అక్షరం పలకగానే భయంతో వణికిపోయేవాడు. సీతను అపహరించడం కోసం మారీచుణ్ని రావణుడు పావులాగా ఉపయోగించుకున్నాడు. మారీచుడు రాముణ్ని దూరంగా తీసుకొని వెళ్లడానికి ఇష్టపడడు. 'అలా చేయకపోతే నిన్ను చంపుతా'నని రావణుడు మారీచుణ్ని బెదిరించాడు.
రావణుడి చేతిలో మరణించడంకన్నా రాముడి చేతిలో మృతి చెందడమే మేలని మారీచుడు భావించాడు. దుష్టులతో మైత్రి అటువంటిది. దుష్టులతో మొదట స్నేహం తీయగా ఉన్నా చివరికి విషాదంగా మారుతుంది.
నిన్ను నిన్నుగా తెలుసుకున్నవాడు, జీవితంలో నువ్వు ఎక్కడవున్నావో అర్థం చేసుకున్నవాడు, నువ్వు ఎంతటివాడివైనా ఆమోదించేవాడు, నువ్వు ఇంకా, ఇంకా ఎదగడానికి అన్ని అవకాశాలూ ఇచ్చేవాడు... అతడే నిజమైన స్నేహితుడు. అతడే అసలు స్నేహితుడని బంగారు అక్షరాలతో గుండెల్లో రాసుకోవచ్చు.
సృష్టిలో కొన్ని నిర్వచనానికి అందవు. వాటిలో స్నేహం ఒకటి. స్నేహం- ప్రాణం, స్పందన, మంత్రం, ఆరాధన, అనుపమ బంధం, ఆత్మీయ సుగంధం, యుగాలు నిలిచే మాట, జన్మలు దాటే పాట, ఆత్మల పిలుపు, మనసు తెరపై నైరూప్య చిత్రం, నిశ్శబ్దం చెక్కిన శిల్పం, ఒక కర్పూర దీపం, ఒక నక్షత్ర ద్వీపం, ఒక చిరునవ్వు, ఒక ఆశ, ఒక వెన్నెల తీరం... ఒక్క మాటలో చెప్పాలంటే- స్నేహమంటే జీవితమే!.
- కె.యజ్ఞన్న
ఒక మంచి స్నేహితుణ్ని పొందడంకన్నా మించిన వరం జీవితంలో మరొకటి లేదు. అడుగడుగునా ప్రోత్సాహం ఇచ్చే మృదుభాషణుడైన స్నేహితుడు ఉంటే జీవితంలో నైరాశ్యం అంటూ ఉండదు. అటువంటి మిత్రుడు దొరకడం అత్యంత దుర్లభం.
స్నేహితులు చాలా అవసరం కాని, మంచి స్నేహితుల్ని సంపాదించడం ముఖ్యం. సూర్యుడు ఉదయించినప్పుడు మనిషి నీడ పొడవుగా ఉంటుంది. సూర్యుడు కదులుతున్నప్పుడు నీడ క్రమంగా చిన్నదవుతుంది. మిట్టమధ్యాహ్నం వేళకు నీడ అడుగు పొడవుకూడా ఉండదు. ఇదే విధంగా చెడు స్నేహితుడి స్నేహం సాగుతుంది. ముందు మంచి మాటలతో స్నేహం చేస్తారు. స్నేహం చాలాకాలం ఉంటుందన్న అభిప్రాయం కలుగుతుంది. చెడు మిత్రుల మాటలు పొగడ్తలు మాత్రమే. వారి మాటల్లో అర్థం కనిపించదు. ఒక వ్యక్తినుంచి ఏదో కావాలని కోరుకొని స్నేహం చేసేవారే ఎక్కువ. అవసరమైన క్షణంలో వారు కనిపించరు. ఆసరాగా నిలబడరు.
సూర్యుడి వల్ల పడిన నీడలాగానే వారి స్నేహం నెమ్మదిగా తగ్గిపోతుంది. మధ్యాహ్నం గడిచిన పిమ్మట పడే నీడలాగా మంచివారితో స్నేహం పెరుగుతుంది. సాయంత్రానికి మరింత పెద్దదవుతుంది. మంచివారు సులభంగా దొరకరు. కాని, ఒకసారి వారి విశ్వాసం పొందగలిగితే అది చివరిదాకా నిలిచి ఉంటుంది. తమ ప్రయోజనాలకోసం స్నేహితుల్ని వారు వాడుకోరు. చెడ్డవారు స్నేహితుల ప్రేమను, గౌరవాన్ని దుర్వినియోగం చేయడానికి వెనకాడరు. ఒక్కొక్కసారి మిత్రుడు మృతి చెందినా విచారించరు.
రావణుడితో స్నేహంవల్ల మారీచుడు ఎంత నష్టపోయాడో మనకు రామాయణం చెబుతుంది. శ్రీరాముడి బలం ఎటువంటిదో మారీచుడికి తెలుసు. ఒకసారి మారీచుణ్ని రాముడు సముద్రంలోకి నెట్టాడు. మారీచుడు ఈ సంఘటనతో ఎంత భయపడ్డాడంటే, 'రా' అనే అక్షరం పలకగానే భయంతో వణికిపోయేవాడు. సీతను అపహరించడం కోసం మారీచుణ్ని రావణుడు పావులాగా ఉపయోగించుకున్నాడు. మారీచుడు రాముణ్ని దూరంగా తీసుకొని వెళ్లడానికి ఇష్టపడడు. 'అలా చేయకపోతే నిన్ను చంపుతా'నని రావణుడు మారీచుణ్ని బెదిరించాడు.
రావణుడి చేతిలో మరణించడంకన్నా రాముడి చేతిలో మృతి చెందడమే మేలని మారీచుడు భావించాడు. దుష్టులతో మైత్రి అటువంటిది. దుష్టులతో మొదట స్నేహం తీయగా ఉన్నా చివరికి విషాదంగా మారుతుంది.
నిన్ను నిన్నుగా తెలుసుకున్నవాడు, జీవితంలో నువ్వు ఎక్కడవున్నావో అర్థం చేసుకున్నవాడు, నువ్వు ఎంతటివాడివైనా ఆమోదించేవాడు, నువ్వు ఇంకా, ఇంకా ఎదగడానికి అన్ని అవకాశాలూ ఇచ్చేవాడు... అతడే నిజమైన స్నేహితుడు. అతడే అసలు స్నేహితుడని బంగారు అక్షరాలతో గుండెల్లో రాసుకోవచ్చు.
సృష్టిలో కొన్ని నిర్వచనానికి అందవు. వాటిలో స్నేహం ఒకటి. స్నేహం- ప్రాణం, స్పందన, మంత్రం, ఆరాధన, అనుపమ బంధం, ఆత్మీయ సుగంధం, యుగాలు నిలిచే మాట, జన్మలు దాటే పాట, ఆత్మల పిలుపు, మనసు తెరపై నైరూప్య చిత్రం, నిశ్శబ్దం చెక్కిన శిల్పం, ఒక కర్పూర దీపం, ఒక నక్షత్ర ద్వీపం, ఒక చిరునవ్వు, ఒక ఆశ, ఒక వెన్నెల తీరం... ఒక్క మాటలో చెప్పాలంటే- స్నేహమంటే జీవితమే!.
- కె.యజ్ఞన్న
ᐅ మనిషిలో రుషి
ᐅ మనిషిలో రుషి
మనిషి అంటే మనందరం చూసే భౌతిక స్వరూపం మాత్రమే కాదు. మనిషిలో కంటికి అగుపించనివి చాలా ఉంటాయి. అందరూ మనిషి అందచందాలు, వేషభాషలు చూసి ఏదో ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటారు. మనసును మరుగునపరచుకుంటూ, ఎదుటివారు మెచ్చేలా మాట్లాడటం కొందరి ప్రత్యేకత. అందువల్ల మాటలనుబట్టి మనసును అంచనా వేయలేం. కొందరి మాటలు కఠినంగా ఉన్నా మనసు వెన్నలా ఉంటుంది. కొందరి మొహాలు ఎంతో సాత్వికంగా ఉంటాయి. అలాగని వారిని సజ్జనులుగా అనుకోలేం. సాదాసీదాగా ఉండేవారిలో కొందరు భయంకరమైన నేరాలుచేసి పట్టుబడుతుంటారు. మొహం మొరటుగా కర్కశంగా అనిపించేవాళ్లు సమాజానికి ఉపకారులు కావొచ్చు.
కాబట్టి, అన్నివేళలా మనసు మొహంలో ప్రతిబింబిస్తుందని కచ్చితంగా చెప్పలేం. ఒక్కటి మాత్రం నిజం. మనిషిలో మనిషి మాత్రమే కాదు. రాక్షసులు, పిశాచాలూ ఉంటారు. మనీషులు, సాధువులు, మునులు, రుషులూ ఉంటారు. చాలా చాలా అరుదుగా దేవతలుంటారు.
మనం ఆహ్వానించకపోయినా రాక్షసులు, పిశాచాలు అప్పుడప్పుడు నిద్రలేచి విజృంభిస్తుంటారు. ఎంతో క్రమశిక్షణ, నీతి నియమాలవల్ల మనలోని మనీషి కళ్లు తెరుస్తాడు. మనీషిని కాపాడుకుని, అదే పంథాలో కొనసాగితే, మనీషి సాధువుగా రూపాంతరం చెందుతాడు. సాధువునుంచి మునిగా మారటం సులభతరమే. సాధువుగా ఉండగానే ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మన వేషభాషలు సాధురూపాన్ని పోలి ఉండాల్సిన అవసరం లేదు. రూప సాధువు కాక హృదయ సాధువు అయినప్పుడే అది నిజమైన సాధుత్వం అవుతుంది. సాధువుగా జీవించేవారిని పుష్కలమైన ఆధ్యాత్మిక అనుభూతులు, ఆనందం వివశుణ్ని చేస్తుంటాయి. మౌనంలోనే వారికి ఆనంద పారవశ్యం కనిపిస్తుంది. ఎవరితో ఏమీ మాట్లాడాలనిపించదు. ఒక మృదుమధుర హాసం, ప్రసన్నవదనంతో వారి మౌనంతోనే ప్రపంచంతో మైత్రి నెరపుతుంటారు. మునులందరూ ఇంతే. లక్ష మాటలతో చెప్పలేని భావాలను వారు తమ మౌనంతో చెప్పగలరు. ఆపై అంచె రుషిత్వం. వేషభాషలనుబట్టి వారినీ గుర్తించలేం. వారికి జడలు, నారచీరలు ఉండవు. అందరిలాగానే, అందరి మధ్య ఉంటారు. కానీ, ఎంతో విభిన్నంగా నక్షత్రాల మధ్య చంద్రుడిలా తమచుట్టూ సంతోషకర వాతావరణాన్ని నెలకొల్పుకోగలుగుతారు. అది సహజంగానే ఏర్పడుతుంది. అలాంటివారే మదర్ థెరెసా, రామకృష్ణ పరమహంస, మహర్షి అరబిందో. ఇలా మనం చెప్పుకొంటూపోతే, రుషి సమానులుగా ఎంతోమంది కనిపిస్తారు.
మరి మన సంగతేమిటి? మనం ఏ స్థాయిలో ఉన్నాం? ఏ స్థాయిలో ఉన్నామో మనల్ని మనమే అంచనా వేసుకోవటం కష్టం కాదు. అంచనాలో మనస్థాయి తెలిశాక, మనం ఎక్కాల్సిన సోపానాలు కూడా కనిపిస్తూనే ఉంటాయి. ముందు మనిషిగా మనం మారాలి. ఆ తరవాతి సోపానాలే మనీషి, సాధువు, ముని, చివరగా రుషి. కొండలు ఎక్కినవాడు కాదు, ఎవరెస్టు శిఖరం ఎక్కినవాడే గొప్పవాడు. రుషి కావాలని కృషి చేసినవాడే ధన్యుడు.
- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్
మనిషి అంటే మనందరం చూసే భౌతిక స్వరూపం మాత్రమే కాదు. మనిషిలో కంటికి అగుపించనివి చాలా ఉంటాయి. అందరూ మనిషి అందచందాలు, వేషభాషలు చూసి ఏదో ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటారు. మనసును మరుగునపరచుకుంటూ, ఎదుటివారు మెచ్చేలా మాట్లాడటం కొందరి ప్రత్యేకత. అందువల్ల మాటలనుబట్టి మనసును అంచనా వేయలేం. కొందరి మాటలు కఠినంగా ఉన్నా మనసు వెన్నలా ఉంటుంది. కొందరి మొహాలు ఎంతో సాత్వికంగా ఉంటాయి. అలాగని వారిని సజ్జనులుగా అనుకోలేం. సాదాసీదాగా ఉండేవారిలో కొందరు భయంకరమైన నేరాలుచేసి పట్టుబడుతుంటారు. మొహం మొరటుగా కర్కశంగా అనిపించేవాళ్లు సమాజానికి ఉపకారులు కావొచ్చు.
కాబట్టి, అన్నివేళలా మనసు మొహంలో ప్రతిబింబిస్తుందని కచ్చితంగా చెప్పలేం. ఒక్కటి మాత్రం నిజం. మనిషిలో మనిషి మాత్రమే కాదు. రాక్షసులు, పిశాచాలూ ఉంటారు. మనీషులు, సాధువులు, మునులు, రుషులూ ఉంటారు. చాలా చాలా అరుదుగా దేవతలుంటారు.
మనం ఆహ్వానించకపోయినా రాక్షసులు, పిశాచాలు అప్పుడప్పుడు నిద్రలేచి విజృంభిస్తుంటారు. ఎంతో క్రమశిక్షణ, నీతి నియమాలవల్ల మనలోని మనీషి కళ్లు తెరుస్తాడు. మనీషిని కాపాడుకుని, అదే పంథాలో కొనసాగితే, మనీషి సాధువుగా రూపాంతరం చెందుతాడు. సాధువునుంచి మునిగా మారటం సులభతరమే. సాధువుగా ఉండగానే ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మన వేషభాషలు సాధురూపాన్ని పోలి ఉండాల్సిన అవసరం లేదు. రూప సాధువు కాక హృదయ సాధువు అయినప్పుడే అది నిజమైన సాధుత్వం అవుతుంది. సాధువుగా జీవించేవారిని పుష్కలమైన ఆధ్యాత్మిక అనుభూతులు, ఆనందం వివశుణ్ని చేస్తుంటాయి. మౌనంలోనే వారికి ఆనంద పారవశ్యం కనిపిస్తుంది. ఎవరితో ఏమీ మాట్లాడాలనిపించదు. ఒక మృదుమధుర హాసం, ప్రసన్నవదనంతో వారి మౌనంతోనే ప్రపంచంతో మైత్రి నెరపుతుంటారు. మునులందరూ ఇంతే. లక్ష మాటలతో చెప్పలేని భావాలను వారు తమ మౌనంతో చెప్పగలరు. ఆపై అంచె రుషిత్వం. వేషభాషలనుబట్టి వారినీ గుర్తించలేం. వారికి జడలు, నారచీరలు ఉండవు. అందరిలాగానే, అందరి మధ్య ఉంటారు. కానీ, ఎంతో విభిన్నంగా నక్షత్రాల మధ్య చంద్రుడిలా తమచుట్టూ సంతోషకర వాతావరణాన్ని నెలకొల్పుకోగలుగుతారు. అది సహజంగానే ఏర్పడుతుంది. అలాంటివారే మదర్ థెరెసా, రామకృష్ణ పరమహంస, మహర్షి అరబిందో. ఇలా మనం చెప్పుకొంటూపోతే, రుషి సమానులుగా ఎంతోమంది కనిపిస్తారు.
మరి మన సంగతేమిటి? మనం ఏ స్థాయిలో ఉన్నాం? ఏ స్థాయిలో ఉన్నామో మనల్ని మనమే అంచనా వేసుకోవటం కష్టం కాదు. అంచనాలో మనస్థాయి తెలిశాక, మనం ఎక్కాల్సిన సోపానాలు కూడా కనిపిస్తూనే ఉంటాయి. ముందు మనిషిగా మనం మారాలి. ఆ తరవాతి సోపానాలే మనీషి, సాధువు, ముని, చివరగా రుషి. కొండలు ఎక్కినవాడు కాదు, ఎవరెస్టు శిఖరం ఎక్కినవాడే గొప్పవాడు. రుషి కావాలని కృషి చేసినవాడే ధన్యుడు.
- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్
ᐅ మహా మాఘి
ᐅ మహా మాఘి
చంద్రుడు మఘ నక్షత్రాన ఉండే మాసం మాఘం. యజ్ఞ యాగాది క్రతువులకు శ్రేష్ఠమైన మాసం. యజ్ఞాలకు అధిష్ఠాన దైవం ఇంద్రుడు. అందుకే ఇంద్రుణ్ని మఘవుడు అంటారు. ఇది శిశిర రుతుమాసం. చెట్లు ఆకులు రాల్చే కాలం. శూన్యమైన పుష్యమాసం తరవాత వచ్చే కల్యాణ కారక మాసం.
వైశాఖ, కార్తీక మాసాలకు మాదిరిగా మాఘమాస స్నానాలకు విలక్షణత ఉంది. మాఘస్నానం అతి పవిత్రమైనదని చెబుతారు. పాపరాహిత్యం కోసం నదీస్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం. ఈ మాసంలో సూర్యుడు ఉన్న రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్య కిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరతాయి. ఆ సమయంలో సూర్యకిరణాల్లో ఉండే అతినీలలోహిత, పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులు గోచరిస్తాయి. మాఘస్నాన విధులను మాఘ పురాణం పేర్కొనగా, మాఘ స్నానం మాహాత్మ్యాన్ని బ్రహ్మాండ పురాణం వివరిస్తోంది. మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం గృహస్నానంతో ఆరు సంవత్సరాల యజ్ఞ స్నానఫలం లభిస్తుందంటారు. బావినీటి స్నానం 12 ఏళ్ల పుణ్యఫలాన్ని, తటాక స్నానం ద్విగుణం, నదీస్నానం శతగుణం, త్రివేణీ సంగమస్నానం నదీ శత గుణఫలం ఇస్తాయని పురాణ వచనం.
మాఘపూర్ణిమను 'మహా మాఘి' అంటారు. ఇది పూర్ణిమల్లోకెల్లా ఉత్కృష్టమైనదిగా భావిస్తారు. స్నాన, దాన, జపాలకు ప్రశస్తమైన రోజు. మాఘస్నానాలన్నీ ఒక ఎత్త్తెతే, మాఘ పౌర్ణమి స్నానం ఒక ఎత్తు. ఈ పౌర్ణమి రోజున సింధుస్నానం ఆచరించాలని శాస్త్రవిధి. సింధువు అంటే సముద్రం. ఈ రోజున సముద్ర స్నానం కలుషహరమని, మహామహిమాన్వితమని విశ్వసిస్తారు. మాఘమాసంలో దివ్య తీర్థాలను స్మరించి, పౌర్ణమినాడు స్నానం చేయడం సనాతన సంప్రదాయం. స్నాన సమయంలో ప్రయాగను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుందని విశ్వాసం. మృకండ మహర్షి, మనస్వినిల మాఘస్నాన ఫలం వల్లనే వారి కుమారుడు మార్కండేయుడి అపమృత్యు దోషం తొలగిందని పురాణ వచనం. విష్ణ్వంశ సంభూతుడు. దేవహూతి, కర్దమ మునిల పుత్రుడు కపిల మహర్షి, అవతార మెహర్బాబా జయంతి మహామాఘి రోజున .
-డాక్టర్ దామెర
చంద్రుడు మఘ నక్షత్రాన ఉండే మాసం మాఘం. యజ్ఞ యాగాది క్రతువులకు శ్రేష్ఠమైన మాసం. యజ్ఞాలకు అధిష్ఠాన దైవం ఇంద్రుడు. అందుకే ఇంద్రుణ్ని మఘవుడు అంటారు. ఇది శిశిర రుతుమాసం. చెట్లు ఆకులు రాల్చే కాలం. శూన్యమైన పుష్యమాసం తరవాత వచ్చే కల్యాణ కారక మాసం.
వైశాఖ, కార్తీక మాసాలకు మాదిరిగా మాఘమాస స్నానాలకు విలక్షణత ఉంది. మాఘస్నానం అతి పవిత్రమైనదని చెబుతారు. పాపరాహిత్యం కోసం నదీస్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం. ఈ మాసంలో సూర్యుడు ఉన్న రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్య కిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరతాయి. ఆ సమయంలో సూర్యకిరణాల్లో ఉండే అతినీలలోహిత, పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులు గోచరిస్తాయి. మాఘస్నాన విధులను మాఘ పురాణం పేర్కొనగా, మాఘ స్నానం మాహాత్మ్యాన్ని బ్రహ్మాండ పురాణం వివరిస్తోంది. మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం గృహస్నానంతో ఆరు సంవత్సరాల యజ్ఞ స్నానఫలం లభిస్తుందంటారు. బావినీటి స్నానం 12 ఏళ్ల పుణ్యఫలాన్ని, తటాక స్నానం ద్విగుణం, నదీస్నానం శతగుణం, త్రివేణీ సంగమస్నానం నదీ శత గుణఫలం ఇస్తాయని పురాణ వచనం.
మాఘపూర్ణిమను 'మహా మాఘి' అంటారు. ఇది పూర్ణిమల్లోకెల్లా ఉత్కృష్టమైనదిగా భావిస్తారు. స్నాన, దాన, జపాలకు ప్రశస్తమైన రోజు. మాఘస్నానాలన్నీ ఒక ఎత్త్తెతే, మాఘ పౌర్ణమి స్నానం ఒక ఎత్తు. ఈ పౌర్ణమి రోజున సింధుస్నానం ఆచరించాలని శాస్త్రవిధి. సింధువు అంటే సముద్రం. ఈ రోజున సముద్ర స్నానం కలుషహరమని, మహామహిమాన్వితమని విశ్వసిస్తారు. మాఘమాసంలో దివ్య తీర్థాలను స్మరించి, పౌర్ణమినాడు స్నానం చేయడం సనాతన సంప్రదాయం. స్నాన సమయంలో ప్రయాగను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుందని విశ్వాసం. మృకండ మహర్షి, మనస్వినిల మాఘస్నాన ఫలం వల్లనే వారి కుమారుడు మార్కండేయుడి అపమృత్యు దోషం తొలగిందని పురాణ వచనం. విష్ణ్వంశ సంభూతుడు. దేవహూతి, కర్దమ మునిల పుత్రుడు కపిల మహర్షి, అవతార మెహర్బాబా జయంతి మహామాఘి రోజున .
-డాక్టర్ దామెర
ᐅ క్షమ... శిక్ష... శిక్షణ
ᐅ క్షమ... శిక్ష... శిక్షణ
భారతీయతత్వంలోని వివిధ సుగుణాల్లో క్షమ ఒక గుణరాజం. వ్యక్తిత్వాన్ని ఉన్నతం చేసి చూపే తత్వతేజం. ప్రతీకారేచ్ఛ లేని ఈ సత్వగుణ విశేషం మనసులను, వాతావరణాన్ని తేలికపరుస్తుంది. అమలినం చేస్తుంది... క్షమించేవారిదీ ఎదుటివారిదీ కూడా. ఓ వైపు అశాంతితో లావాలా ఉడికిపోతున్న ప్రపంచ దేశాల మధ్య భారతదేశంలో, శాంతియుత వాతావరణంలో ప్రశాంత కాసారంలా శాంతిపవనాలు వీస్తున్నాయంటే దానికి కారణం భారతీయ రక్తంలో ప్రసరించే సహజ క్షమాగుణమే. క్షమాగుణమంటే? ఎవరేం చేసినా చూసీ చూడనట్లుండిపోవడమేనా? ఒక చెంపమీద కొడితే మరో చెంప చూపించడమేనా? కాదేమో. క్షమ చాలా ఉదాత్తమైన అర్థంలో స్వీకరించాలి. అవగాహన లేని క్షమా గుణాచరణ దానికి కళంకాన్ని ఆపాదించటమే అవుతుంది. దాని అసలు ఉద్దేశాన్ని దెబ్బతీయడమే అవుతుంది.
క్షమ వల్ల దాన్ని ప్రదర్శించిన వ్యక్తికి ఆత్మతృప్తి కలగవచ్చు. ఆ వ్యక్తి వ్యక్తిత్వానికి వన్నె ఆపాదించవచ్చు. కానీ ఎలాంటి క్షమ? క్షమవల్ల మనం తృప్తిపడుతున్నామా అనేదానికంటే అది అవతలి వ్యక్తిమీద ఎలాంటి ప్రభావాన్ని చూపిందన్నదే ముఖ్యం. ఇతరుల్ని బాధించే ఆ శిలలాంటి హృదయంలో మన క్షమ కొంచెమైనా ఆర్ద్రత కలిగించిందా, పశ్చాత్తాపం అంకురించిందా, భవిష్యత్ పొరపాట్లకు అడ్డుకట్ట వేయగలిగిందా అన్నది ముఖ్యం. క్షమ చాలాసార్లు అవతలి వ్యక్తిలో మరింత హింసకు, మరింత నేరతత్వానికి ప్రేరణ కావచ్చు. ఇలాంటి క్షమవల్ల ఎవరికి ప్రయోజనం? క్షమ మన సహనానికి, ఔదార్యానికి రుజువు అయితే కావచ్చు గాక. నిజమైన ఉదారగుణం అవతలి వ్యక్తి శ్రేయమే ఆశిస్తుంది. ఆశించాలి. కేవలం క్షమవల్ల శ్రేయం ఒనగూరదు. మన క్షమ మన వ్యక్తిత్వ స్థాయిని పెంచుకునేదిగా భావించడం కంటే అవతలి వారి హింసాతత్వాన్ని తగ్గించేందుకు ఉపకరించే సాధనంగా మనం మలచే కోణంలో స్వీకరించాలి. 'క్షమ' ఉద్దేశం అదే. మన క్షమ అవతలివారిలో ఆర్ద్రత కలిగించేదిగా ఉండాలి గానీ ఆటవికతను ప్రేరేపించేదిగా కాదు. ప్రతి తప్పునూ క్షమించేవారుంటే తప్పులు చేయని వారుంటారా? మరింత ఉత్సాహంతో మరెన్నో తప్పులకు ఆయత్తం కాకపోతారా? మరి క్షమకు సరైన అర్థమేది? ఒక వ్యక్తి తప్పుల్ని ఎంతవరకు క్షమించవచ్చు? శిక్షిస్తే ఇక క్షమకు అర్థమేముంది?
నిజమే. లోకంలో క్షమార్హం కాని తప్పే లేదు. ఏసుక్రీస్తు తనను సిలువ వేసినవారినీ క్షమించమని ఆ ప్రభువును వేడుకున్నాడు. 'వారేం చేస్తున్నారో వారికి తెలియదు' అని కూడా అన్నాడు. అంటే తెలియక చేసే తప్పులకు కొంతవరకు క్షమ ఉంది. తెలిసి చేస్తే, అదీ పదేపదే చేస్తే క్షమ అవసరమా? అది క్షమను దుర్వినియోగం చేసినట్లే. క్షమలోని మరో ధర్మసూక్ష్మం ఏమిటంటే మన ఓర్పుతో తప్పుచేసినవారి అంతరంగాన్ని నిర్మాల్యం చేయటమే. మానవత్వాన్ని నిద్ర లేపటమే. బాధను ఓర్చుకుని క్షమించిన మనలోని ఔదార్యాన్ని గుర్తించి పశ్చాత్తాపం చెంది అగ్నితప్తం అవుతారనే శ్రేయోకామనే. అది గుర్తించక బోరవిరుచుకుని మరోసారి, మరోసారి తప్పులకు సిద్ధమైపోయే మూర్ఖులకు క్షమ అవసరం లేకపోవటమేగాక అది వారికి మరింత హాని చేస్తుంది.
భగవంతుణ్ని మించిన క్షమాహృదయులున్నారా? కానీ ఆయన అందర్నీ, అన్ని సందర్భాల్లో క్షమించలేదే? శ్రీకృష్ణుడు శిశుపాలుడి వంద తప్పులదాకా అవకాశమిచ్చి ఆ తరవాత సంహరించాడు. ఆయనకు పాండవులతోపాటు కౌరవులూ బంధువులూ ఆత్మీయులే. అయినా వారిని క్షమించలేదు. స్వయంగా సంధి రాయబారం నడిపి, అది విఫలమయ్యేదాకా క్షమిస్తూనే వచ్చి ఆ తరవాత కురుక్షేత్ర యుద్ధాన్ని స్వయంగా దగ్గరుండి నడిపించాడు. ధర్మాన్ని గెలిపించాడు. శ్రీరాముడు దయార్ద్ర హృదయుడు. అయినా మితిమీరిన, శ్రుతిమించిన నేరాలకుగాను స్త్రీ అయినా తాటకిని, పరమ శివభక్తుడే అయినా రావణుణ్ని నిర్జించాడు. పరమాత్ముడైనా పొరపాట్లను క్షమిస్తాడు. నేరాలను కొంతవరకు క్షమిస్తాడు. ఆ తరవాత కాదు. రుషులు శాంతులు. సహనమూర్తులు. మరి వాళ్లూ శాపరూపంలో శిక్షిస్తూ ఉంటారు. శాప విమోచనమైనా శాపానుభవం తరవాతే. మరి ఏమైపోతుంది వారి శాంతం, క్షమాహృదయం? కొన్ని సందర్భాల్లో క్షమకంటే శిక్షే దోషుల్ని నిర్మలం కావిస్తుందని భావించినప్పుడు దేవతలైనా, రుషులైనా శిక్షవైపే మొగ్గుచూపుతారు. కొన్నిసార్లు శిక్షే దోషుల్ని విశుద్ధం చేస్తుంది. విమలం గావిస్తుంది. న్యాయస్థానాలైనా శిక్ష విధిస్తున్నాయంటే నేరానికి ప్రతీకారం కంటే ప్రక్షాళనమే ముఖ్య ఉద్దేశమై ఉంటుంది. తగిన శిక్ష ప్రక్షాళన కారకమవుతుంది. మలినంతో మమేకమైన స్వర్ణానిక్కూడా శుద్ధీకరణ దెబ్బలు తప్పవు. స్నేహితుణ్ని కొట్టిన మన బిడ్డనైనా మనం క్షమ పేరిట వదిలేయం. మందలిస్తాం. అవసరమైతే ఓ దెబ్బ వేస్తాం. గురువులైనా అంతే. క్షమపేరిట శిష్యుల్ని చూసీచూడనట్లు వదిలేస్తే గురువుకు పంగనామాలు తప్పవు. అవసరమైనప్పుడు దండించాల్సిందే! (ప్రస్తుత ఆధునిక చట్టం అందుకు ఒప్పుకోదనుకోండి. అది వేరే సంగతి.)
ఎదిరించవలసిన సందర్భంలో ఎదిరించకపోతే, శిక్షించవలసిన సమయంలో శిక్షించకపోతే మనం నేరస్తులమవుతాం. చాలాసార్లు శిక్షే శిక్షణ అవుతుంది. అదే సమయంలో క్షమించాల్సిన సందర్భాల్లో నేరము-శిక్ష అంటూ భీష్మించుక్కూచుంటే మనకంటే నేరస్తులు మరొకరుండరు. ధర్మం చాలా సూక్ష్మమైంది. విచక్షణతో దాన్ని ఆచరించాలి
- చక్కిలం విజయలక్ష్మి
భారతీయతత్వంలోని వివిధ సుగుణాల్లో క్షమ ఒక గుణరాజం. వ్యక్తిత్వాన్ని ఉన్నతం చేసి చూపే తత్వతేజం. ప్రతీకారేచ్ఛ లేని ఈ సత్వగుణ విశేషం మనసులను, వాతావరణాన్ని తేలికపరుస్తుంది. అమలినం చేస్తుంది... క్షమించేవారిదీ ఎదుటివారిదీ కూడా. ఓ వైపు అశాంతితో లావాలా ఉడికిపోతున్న ప్రపంచ దేశాల మధ్య భారతదేశంలో, శాంతియుత వాతావరణంలో ప్రశాంత కాసారంలా శాంతిపవనాలు వీస్తున్నాయంటే దానికి కారణం భారతీయ రక్తంలో ప్రసరించే సహజ క్షమాగుణమే. క్షమాగుణమంటే? ఎవరేం చేసినా చూసీ చూడనట్లుండిపోవడమేనా? ఒక చెంపమీద కొడితే మరో చెంప చూపించడమేనా? కాదేమో. క్షమ చాలా ఉదాత్తమైన అర్థంలో స్వీకరించాలి. అవగాహన లేని క్షమా గుణాచరణ దానికి కళంకాన్ని ఆపాదించటమే అవుతుంది. దాని అసలు ఉద్దేశాన్ని దెబ్బతీయడమే అవుతుంది.
క్షమ వల్ల దాన్ని ప్రదర్శించిన వ్యక్తికి ఆత్మతృప్తి కలగవచ్చు. ఆ వ్యక్తి వ్యక్తిత్వానికి వన్నె ఆపాదించవచ్చు. కానీ ఎలాంటి క్షమ? క్షమవల్ల మనం తృప్తిపడుతున్నామా అనేదానికంటే అది అవతలి వ్యక్తిమీద ఎలాంటి ప్రభావాన్ని చూపిందన్నదే ముఖ్యం. ఇతరుల్ని బాధించే ఆ శిలలాంటి హృదయంలో మన క్షమ కొంచెమైనా ఆర్ద్రత కలిగించిందా, పశ్చాత్తాపం అంకురించిందా, భవిష్యత్ పొరపాట్లకు అడ్డుకట్ట వేయగలిగిందా అన్నది ముఖ్యం. క్షమ చాలాసార్లు అవతలి వ్యక్తిలో మరింత హింసకు, మరింత నేరతత్వానికి ప్రేరణ కావచ్చు. ఇలాంటి క్షమవల్ల ఎవరికి ప్రయోజనం? క్షమ మన సహనానికి, ఔదార్యానికి రుజువు అయితే కావచ్చు గాక. నిజమైన ఉదారగుణం అవతలి వ్యక్తి శ్రేయమే ఆశిస్తుంది. ఆశించాలి. కేవలం క్షమవల్ల శ్రేయం ఒనగూరదు. మన క్షమ మన వ్యక్తిత్వ స్థాయిని పెంచుకునేదిగా భావించడం కంటే అవతలి వారి హింసాతత్వాన్ని తగ్గించేందుకు ఉపకరించే సాధనంగా మనం మలచే కోణంలో స్వీకరించాలి. 'క్షమ' ఉద్దేశం అదే. మన క్షమ అవతలివారిలో ఆర్ద్రత కలిగించేదిగా ఉండాలి గానీ ఆటవికతను ప్రేరేపించేదిగా కాదు. ప్రతి తప్పునూ క్షమించేవారుంటే తప్పులు చేయని వారుంటారా? మరింత ఉత్సాహంతో మరెన్నో తప్పులకు ఆయత్తం కాకపోతారా? మరి క్షమకు సరైన అర్థమేది? ఒక వ్యక్తి తప్పుల్ని ఎంతవరకు క్షమించవచ్చు? శిక్షిస్తే ఇక క్షమకు అర్థమేముంది?
నిజమే. లోకంలో క్షమార్హం కాని తప్పే లేదు. ఏసుక్రీస్తు తనను సిలువ వేసినవారినీ క్షమించమని ఆ ప్రభువును వేడుకున్నాడు. 'వారేం చేస్తున్నారో వారికి తెలియదు' అని కూడా అన్నాడు. అంటే తెలియక చేసే తప్పులకు కొంతవరకు క్షమ ఉంది. తెలిసి చేస్తే, అదీ పదేపదే చేస్తే క్షమ అవసరమా? అది క్షమను దుర్వినియోగం చేసినట్లే. క్షమలోని మరో ధర్మసూక్ష్మం ఏమిటంటే మన ఓర్పుతో తప్పుచేసినవారి అంతరంగాన్ని నిర్మాల్యం చేయటమే. మానవత్వాన్ని నిద్ర లేపటమే. బాధను ఓర్చుకుని క్షమించిన మనలోని ఔదార్యాన్ని గుర్తించి పశ్చాత్తాపం చెంది అగ్నితప్తం అవుతారనే శ్రేయోకామనే. అది గుర్తించక బోరవిరుచుకుని మరోసారి, మరోసారి తప్పులకు సిద్ధమైపోయే మూర్ఖులకు క్షమ అవసరం లేకపోవటమేగాక అది వారికి మరింత హాని చేస్తుంది.
భగవంతుణ్ని మించిన క్షమాహృదయులున్నారా? కానీ ఆయన అందర్నీ, అన్ని సందర్భాల్లో క్షమించలేదే? శ్రీకృష్ణుడు శిశుపాలుడి వంద తప్పులదాకా అవకాశమిచ్చి ఆ తరవాత సంహరించాడు. ఆయనకు పాండవులతోపాటు కౌరవులూ బంధువులూ ఆత్మీయులే. అయినా వారిని క్షమించలేదు. స్వయంగా సంధి రాయబారం నడిపి, అది విఫలమయ్యేదాకా క్షమిస్తూనే వచ్చి ఆ తరవాత కురుక్షేత్ర యుద్ధాన్ని స్వయంగా దగ్గరుండి నడిపించాడు. ధర్మాన్ని గెలిపించాడు. శ్రీరాముడు దయార్ద్ర హృదయుడు. అయినా మితిమీరిన, శ్రుతిమించిన నేరాలకుగాను స్త్రీ అయినా తాటకిని, పరమ శివభక్తుడే అయినా రావణుణ్ని నిర్జించాడు. పరమాత్ముడైనా పొరపాట్లను క్షమిస్తాడు. నేరాలను కొంతవరకు క్షమిస్తాడు. ఆ తరవాత కాదు. రుషులు శాంతులు. సహనమూర్తులు. మరి వాళ్లూ శాపరూపంలో శిక్షిస్తూ ఉంటారు. శాప విమోచనమైనా శాపానుభవం తరవాతే. మరి ఏమైపోతుంది వారి శాంతం, క్షమాహృదయం? కొన్ని సందర్భాల్లో క్షమకంటే శిక్షే దోషుల్ని నిర్మలం కావిస్తుందని భావించినప్పుడు దేవతలైనా, రుషులైనా శిక్షవైపే మొగ్గుచూపుతారు. కొన్నిసార్లు శిక్షే దోషుల్ని విశుద్ధం చేస్తుంది. విమలం గావిస్తుంది. న్యాయస్థానాలైనా శిక్ష విధిస్తున్నాయంటే నేరానికి ప్రతీకారం కంటే ప్రక్షాళనమే ముఖ్య ఉద్దేశమై ఉంటుంది. తగిన శిక్ష ప్రక్షాళన కారకమవుతుంది. మలినంతో మమేకమైన స్వర్ణానిక్కూడా శుద్ధీకరణ దెబ్బలు తప్పవు. స్నేహితుణ్ని కొట్టిన మన బిడ్డనైనా మనం క్షమ పేరిట వదిలేయం. మందలిస్తాం. అవసరమైతే ఓ దెబ్బ వేస్తాం. గురువులైనా అంతే. క్షమపేరిట శిష్యుల్ని చూసీచూడనట్లు వదిలేస్తే గురువుకు పంగనామాలు తప్పవు. అవసరమైనప్పుడు దండించాల్సిందే! (ప్రస్తుత ఆధునిక చట్టం అందుకు ఒప్పుకోదనుకోండి. అది వేరే సంగతి.)
ఎదిరించవలసిన సందర్భంలో ఎదిరించకపోతే, శిక్షించవలసిన సమయంలో శిక్షించకపోతే మనం నేరస్తులమవుతాం. చాలాసార్లు శిక్షే శిక్షణ అవుతుంది. అదే సమయంలో క్షమించాల్సిన సందర్భాల్లో నేరము-శిక్ష అంటూ భీష్మించుక్కూచుంటే మనకంటే నేరస్తులు మరొకరుండరు. ధర్మం చాలా సూక్ష్మమైంది. విచక్షణతో దాన్ని ఆచరించాలి
- చక్కిలం విజయలక్ష్మి
ᐅ మానవతా పరిమళం
ᐅ మానవతా పరిమళం
ఈ భూమ్మీద కోటానుకోట్ల మంది మనుషులున్నారు. వీరిలో నిజమైన మనుషులెందరో కనుక్కోవడం కష్టం. మానవత ఉన్నవాడే మనిషి కాగలడు. అది లోపిస్తే, మనిషికీ మృగానికీ తేడా లేదు. మానవత్వం గురించి చాలామంది మాట్లాడతారు. ఆచరణలో అది దాదాపు మృగ్యమే. అది ఓ వూతపదంగానే మిగిలింది. మనిషిని మనిషి హింసించడం మానవత కాదు. తన స్వార్థం కోసం ఇతరులను హింసించడం, వంచించడం మానవత కాదు. హిట్లర్, ముసోలినీ లాంటివాళ్లు దీనికి తార్కాణం. అలాంటివాళ్లు మానవరూపంలో ఉన్న రాక్షసులు.
మానవ చరిత్ర చూస్తే ఆదిమకాలం నుంచి నేటివరకు వంచన, హింస, ద్వేషం, కామం, క్రోధం- వీటితో నిండిపోయినట్లు తెలుస్తుంది. మనిషి మనిషిగా బతికిన సందర్భాలు తక్కువ. మనిషి సాటిమనిషిని ప్రేమించడం, గౌరవించడం చాలా అరుదైపోతోంది. జీసస్ క్రీస్తు ప్రేమను, గౌరవాన్ని చాటినందుకు సిలువ వేశారు. సోక్రటీస్ లాంటి మానవతా వాదులను అనేక బాధలకు, చిత్రహింసలకు గురిచేశారు.
జీవులను తినకుండా మనిషి మనజాలడు కనుక జీవులను చంపడం ధర్మమే అని చెప్పడంలో అర్థంలేదని ఖండిస్తాడు కన్నడ ప్రజాకవి సర్వజ్ఞుడు. వేమన దృష్టిలో యాగపశువును బలి ఇచ్చి దాని రక్తపుటేళ్లతో, దాని ఆక్రందనల హోరులో మనం ప్రయోజనం పొందాలనుకోవడం, స్వర్గాన్ని చేరుకోవాలని కాంక్షించడం అమానుషం. ఒక్క జంతువునే కాదు, శత్రువును హింసించడం కూడా అన్యాయమంటాడు. 'చంపదగినయట్టి శత్రువు తనచేత జిక్కెనేని కీడు చేయరాదు. పొసగ మేలుచేసి పొమ్మనుటె చాలు' అని అపకారికి సైతం ఉపకారం చేయడం అత్యుత్తమ ధర్మమని మానవతా విలువను ఎలుగెత్తి చాటాడు వేమన.
జీవితంలో మానవత విశిష్టత గ్రహించి దయాదాక్షిణ్యాలతో మెలగినప్పుడే మానవ జీవితానికి సార్థకత చేకూరుతుంది. పోనుపోను జనాభా పెరిగి జాతి, మత, వర్గ వైషమ్యాలు పెరిగి మనుషులు అహంకారంతో, స్వార్థంతో గుర్తింపుకోసం ఎవరికివారే సంఘర్షణ దిశగా పయనిస్తున్నారు. మనిషి మట్టిలో కలిసినా మానవత బతికే ఉంటుంది, ఉండాలి. బుద్ధుడు మానవతకు హిమాలయంలా కనిపిస్తాడు. మదర్ థెరెసా మానవతకు నిలువెత్తు నిదర్శనం. ఇటువంటి మహనీయుల అడుగుజాడల్లో నడవడమే జీవిత ధ్యేయం కావాలి. సృష్టిలో సకల ప్రాణుల యందు ప్రేమానురాగాలు పురిగొల్పేదే నిజమైన మానవత.
స్నేహంతో మెలగుతూ మమతానురాగాలను పంచుతూ నిర్మలమైన మనసుతో జీవించిననాడు సంతోషం, ఆరోగ్యం పెరిగి హృదయ కవాటాలు తెరచుకొని మానవత్వం వికసిస్తుంది. ఆ మానవత్వమే మాధవరూపమై విరాజిల్లుతుంది. మానవత్వం కలిగినవారిలో ఉత్సాహం, సహకారం, సహజీవనం వంటి సద్గుణాలుంటాయి. సాటివారి కష్టనష్టాలకు బాధపడటం, చేతనైన సహాయం చేయడం, వారి ఉన్నతిని కోరడం మానవత్వం. తనకోసం బాధపడకుండా పరులకు సహాయపడేవాడు, కనీసం హాని తలపెట్టనివాడు మనిషి. ఇంద్రియాలను వశపరచుకొనేవారు, సకల భూతాల హితం కోరేవారు, అన్ని ప్రాణులను సమభావంతో చూసేవారు యోగులవుతారు. సర్వభూత హితాన్ని కాంక్షించేవారే తనకు ఇష్టులన్నది గీతాచార్యుడి మాట.
పశువులు పాపభృక్కులు కావు. వాటివల్ల మనిషికి కష్టనష్టాలు కలగవచ్చు. వాటికది తెలియదు. వాటికి ఆలోచన, జ్ఞానం లేవు. పాపపుణ్యాలు తెలియని మూగజీవులు. మనిషికి ఆలోచనాశక్తి, పాపపుణ్యాల విచక్షణాజ్ఞానం ఉన్నాయి. అన్నీ తెలిసిన మనిషి తన సుఖసంతోషాలకోసం, లాభం కోసం ఇతరులకు హాని కలిగించడం తగదు. మానవజన్మ ఓ వరం. దాన్ని సత్ప్రవర్తనతో, సత్కర్మలతో సాఫల్యం చేసుకోవాలి. మానవతావాదులు సున్నితమనస్కులై ఉండాలి. సాటిమనిషి పడుతున్న కష్టానికి, బాధకు అతడిలో ఆర్ద్రత పొంగిపొరలాలి. కరుణ, మమతలు హృదయంలో నిండిఉండాలి. ఎదుటివారి ముఖంలో ఆనందం చూడటం ధ్యేయంగా పెట్టుకున్ననాడు మానవతా పరిమళం భువినిండా వ్యాపిస్తుంది.
- వి.ఎస్.ఆర్. మౌళి
ఈ భూమ్మీద కోటానుకోట్ల మంది మనుషులున్నారు. వీరిలో నిజమైన మనుషులెందరో కనుక్కోవడం కష్టం. మానవత ఉన్నవాడే మనిషి కాగలడు. అది లోపిస్తే, మనిషికీ మృగానికీ తేడా లేదు. మానవత్వం గురించి చాలామంది మాట్లాడతారు. ఆచరణలో అది దాదాపు మృగ్యమే. అది ఓ వూతపదంగానే మిగిలింది. మనిషిని మనిషి హింసించడం మానవత కాదు. తన స్వార్థం కోసం ఇతరులను హింసించడం, వంచించడం మానవత కాదు. హిట్లర్, ముసోలినీ లాంటివాళ్లు దీనికి తార్కాణం. అలాంటివాళ్లు మానవరూపంలో ఉన్న రాక్షసులు.
మానవ చరిత్ర చూస్తే ఆదిమకాలం నుంచి నేటివరకు వంచన, హింస, ద్వేషం, కామం, క్రోధం- వీటితో నిండిపోయినట్లు తెలుస్తుంది. మనిషి మనిషిగా బతికిన సందర్భాలు తక్కువ. మనిషి సాటిమనిషిని ప్రేమించడం, గౌరవించడం చాలా అరుదైపోతోంది. జీసస్ క్రీస్తు ప్రేమను, గౌరవాన్ని చాటినందుకు సిలువ వేశారు. సోక్రటీస్ లాంటి మానవతా వాదులను అనేక బాధలకు, చిత్రహింసలకు గురిచేశారు.
జీవులను తినకుండా మనిషి మనజాలడు కనుక జీవులను చంపడం ధర్మమే అని చెప్పడంలో అర్థంలేదని ఖండిస్తాడు కన్నడ ప్రజాకవి సర్వజ్ఞుడు. వేమన దృష్టిలో యాగపశువును బలి ఇచ్చి దాని రక్తపుటేళ్లతో, దాని ఆక్రందనల హోరులో మనం ప్రయోజనం పొందాలనుకోవడం, స్వర్గాన్ని చేరుకోవాలని కాంక్షించడం అమానుషం. ఒక్క జంతువునే కాదు, శత్రువును హింసించడం కూడా అన్యాయమంటాడు. 'చంపదగినయట్టి శత్రువు తనచేత జిక్కెనేని కీడు చేయరాదు. పొసగ మేలుచేసి పొమ్మనుటె చాలు' అని అపకారికి సైతం ఉపకారం చేయడం అత్యుత్తమ ధర్మమని మానవతా విలువను ఎలుగెత్తి చాటాడు వేమన.
జీవితంలో మానవత విశిష్టత గ్రహించి దయాదాక్షిణ్యాలతో మెలగినప్పుడే మానవ జీవితానికి సార్థకత చేకూరుతుంది. పోనుపోను జనాభా పెరిగి జాతి, మత, వర్గ వైషమ్యాలు పెరిగి మనుషులు అహంకారంతో, స్వార్థంతో గుర్తింపుకోసం ఎవరికివారే సంఘర్షణ దిశగా పయనిస్తున్నారు. మనిషి మట్టిలో కలిసినా మానవత బతికే ఉంటుంది, ఉండాలి. బుద్ధుడు మానవతకు హిమాలయంలా కనిపిస్తాడు. మదర్ థెరెసా మానవతకు నిలువెత్తు నిదర్శనం. ఇటువంటి మహనీయుల అడుగుజాడల్లో నడవడమే జీవిత ధ్యేయం కావాలి. సృష్టిలో సకల ప్రాణుల యందు ప్రేమానురాగాలు పురిగొల్పేదే నిజమైన మానవత.
స్నేహంతో మెలగుతూ మమతానురాగాలను పంచుతూ నిర్మలమైన మనసుతో జీవించిననాడు సంతోషం, ఆరోగ్యం పెరిగి హృదయ కవాటాలు తెరచుకొని మానవత్వం వికసిస్తుంది. ఆ మానవత్వమే మాధవరూపమై విరాజిల్లుతుంది. మానవత్వం కలిగినవారిలో ఉత్సాహం, సహకారం, సహజీవనం వంటి సద్గుణాలుంటాయి. సాటివారి కష్టనష్టాలకు బాధపడటం, చేతనైన సహాయం చేయడం, వారి ఉన్నతిని కోరడం మానవత్వం. తనకోసం బాధపడకుండా పరులకు సహాయపడేవాడు, కనీసం హాని తలపెట్టనివాడు మనిషి. ఇంద్రియాలను వశపరచుకొనేవారు, సకల భూతాల హితం కోరేవారు, అన్ని ప్రాణులను సమభావంతో చూసేవారు యోగులవుతారు. సర్వభూత హితాన్ని కాంక్షించేవారే తనకు ఇష్టులన్నది గీతాచార్యుడి మాట.
పశువులు పాపభృక్కులు కావు. వాటివల్ల మనిషికి కష్టనష్టాలు కలగవచ్చు. వాటికది తెలియదు. వాటికి ఆలోచన, జ్ఞానం లేవు. పాపపుణ్యాలు తెలియని మూగజీవులు. మనిషికి ఆలోచనాశక్తి, పాపపుణ్యాల విచక్షణాజ్ఞానం ఉన్నాయి. అన్నీ తెలిసిన మనిషి తన సుఖసంతోషాలకోసం, లాభం కోసం ఇతరులకు హాని కలిగించడం తగదు. మానవజన్మ ఓ వరం. దాన్ని సత్ప్రవర్తనతో, సత్కర్మలతో సాఫల్యం చేసుకోవాలి. మానవతావాదులు సున్నితమనస్కులై ఉండాలి. సాటిమనిషి పడుతున్న కష్టానికి, బాధకు అతడిలో ఆర్ద్రత పొంగిపొరలాలి. కరుణ, మమతలు హృదయంలో నిండిఉండాలి. ఎదుటివారి ముఖంలో ఆనందం చూడటం ధ్యేయంగా పెట్టుకున్ననాడు మానవతా పరిమళం భువినిండా వ్యాపిస్తుంది.
- వి.ఎస్.ఆర్. మౌళి
ᐅ సహాయమే దైవం
ᐅ సహాయమే దైవం
కాలవకు కుళ్లు అడ్డుపడి, వూళ్లో ఉన్న చెత్త అంతా ఆ క్షణంలో అక్కడ పేరుకుపోయినట్లు- కూడబెట్టడం, కుప్పపోయడమే జీవిత పరమావధి అనుకుంటారు కొందరు. కౌటిల్యుడి అర్థశాస్త్రంలో ఉటంకించినట్లు- తమకు మరణమే లేదన్నట్లు జీవితాంతం సంపాదిస్తూనే ఉంటారు. చట్టాన్ని తమ చుట్టం చేసుకొని టక్కుటమార గారడి విద్యలు ప్రదర్శిస్తూ, అడ్డగోలు తర్కాలతో అందినంత దోచుకోవడమే తమ జీవిత లక్ష్యం అనుకుంటారు.
అగ్రరాజ్యం అయిన అమెరికా సైతం శాండీ తుపాను దెబ్బకు గజగజ వణకక తప్పలేదు. ప్రకృతి విలయతాండవం చేస్తే ఎవరు ఎదిరించి నిలవగలరు? గ్రహగతులు బాగు లేకపోతే పాండవులైనా అడవులు పట్టాల్సిందే. దైవం చిన్నచూపు చూస్తే చిరునామా కూడా దొరకదు.
'అశాశ్వతం' అనే పదం తమ నిఘంటువులో లేనట్లు ప్రవర్తిస్తుంటారు కొందరు. మొలమీద నూలు లేకుండా వచ్చినవాడిని, మోసుకొని వెళ్లేటప్పుడు ఆ పోగు కూడా లేకుండా చేస్తారు. కళ్లముందు జరుగుతున్నది చూస్తూ కూడా తాము అమరులం అనుకుంటారు.
గొప్ప బతుకు అంటే ప్రపంచమంతా మన ఆస్తులు విస్తరింపజేసుకొని, గ్రహమండలాల్లోకి కూడా వెళ్లి సూర్యుణ్ని, చంద్రుణ్ని వేలంపాటల్లో కొనుక్కొని ఇంటికి తెచ్చుకోవడం కాదు.
గొప్ప బతుకు అంటే గొప్పగా బతకడం. మరణంలో కూడా ఎవరికైనా సహాయం చేసే అవకాశం దొరుకుతుందా అని వెయ్యి కళ్లతో ఎదురుచూడటం, సహాయం చెయ్యడంద్వారా లభించే నిర్మలమైన యశస్సు- కూడబెట్టడం, కుప్పపోయడంలో ఆవగింజంతైనా దొరుకుతుందా? కాలం మారిపోతోంది. అర్థాలు మారిపోతున్నాయి. కొత్త నిర్వచనాలు పుట్టుకొస్తున్నాయి. ధనం సంపాదిస్తూనే భగవంతుణ్ని సంపాదించుకోండి అంటున్నారు. మాయలో మునిగిపోండి, సత్యం దానికదే దొరుకుతుంది అంటున్నారు. మిడిమిడి జ్ఞానంతో శాస్త్రాలకు వక్రభాష్యాలు చెబుతున్నారు.
సత్యం రామబాణం. అది సూటిగా వెళ్లి అజ్ఞానాన్ని, మాయను, మోహాన్ని ఛేదిస్తుంది. దాన్ని ధరించాలనుకునేవాడు దైవ లక్షణాలు కలిగి ఉండాలి. వాటిని నిత్యం అభ్యసిస్తూ ఉండాలి. కనికరం లేకుండా కఠోరసాధన చేస్తూ ఉండాలి.
ప్రేమ, దయ, శాంతి, క్షమ లేనివాడు ఆశ, వ్యామోహాల్లో పడి తిరుగుతున్నవాడు కోట్లాధిపతి అయినా లోకానికి ఏం ఒరుగుతుంది? దుర్యోధనుడు ముందుగా వచ్చినా, అర్జునుడినే ఎప్పుడూ ముందుగా చూస్తాడు శ్రీకృష్ణుడు!
దైవ సహాయం ఎవరికి లభిస్తుంది? అహర్నిశలు పరోపకారం చేసేవాడివెంట భగవంతుడు నడుస్తాడు. ప్రతి మంచిపనికి అవరోధాలు ఉంటాయి. ప్రతి గొప్ప పనికి తీవ్రమైన వ్యతిరేకత ఉంటుంది. పని మానుకుంటే ప్రతికూల శక్తులకు లొంగిపోయినట్లే కదా.
మారీచ సుబాహుల రాక్షస చర్యలకు అడ్డుకట్ట వెయ్యడం తనకు సాధ్యం కాకపోవచ్చు. రామలక్ష్మణుల సహాయం తీసుకుంటే నిమిషాలమీద వాళ్లను తుత్తునియలు చేసి గగనంలోకి ఎగురకొట్టవచ్చు. విశ్వామిత్రుడి ఆలోచన గొప్పది. ఆచరణలో పెట్టాడు.
సముద్రాన్ని రెండు చెయ్యాలి. లంకకు వారధి కట్టాలి. వెనకడుగు వెయ్యలేదు శ్రీరాముడు. ప్రతి వానరుణ్నీ దీవించి, ఆశీర్వదించి కార్యోన్ముఖులను చేశాడు. చివరికి చిన్న ఉడుత కూడా తనవంతు సాయం చేసింది.
మంచివాళ్లకు, మంచి పనులకు సాయం చెయ్యాలంటే భగవంతుడు ముందుకు వస్తాడు. ముందే వస్తాడు. 'పాండవ పక్షపాతి' అని నిందించినా పాండవులను వదల్లేదు శ్రీకృష్ణుడు. చివరిదాకా ఉండి విజయం సాధించిపెట్టాడు.
మొత్తం సమయమంతా మన అభివృద్ధికోసం మనం ఉపయోగించుకోవచ్చు. ఎంతైనా పాటుపడవచ్చు. మన వ్యర్థమైన పనుల్లోంచి ఒక గంట బయటకు తీసి ఇతరుల మంచికోసం ఉపయోగిస్తే, కనీసం అలా ఆలోచిస్తే- కొంతకాలానికి ఆచరణలోకి వచ్చి... మన జీవన విధానం మారిపోతుంది. ముఖ్యంగా ఇటువంటి పనుల్లో దైవం ఎలా పనిచేస్తాడో చక్కగా అవగాహన చేసుకోవచ్చు.
'దేవుడిని చూస్తాం. దేవుడిని చూస్తాం. చూపించండి' అంటుంటారు కొందరు. కూడబెట్టడం, కుప్పవేయటం మానేసి, లోకక్షేమం కోసం పాటుపడే వాళ్లలో భగవంతుడు కనిపించడా? ప్రకృతితో మమేకమై లోక సౌఖ్యంకోసం జీవిస్తున్న ప్రతి పురుగు, పక్షి, జంతువు, మొక్క, రాయిలో భగవంతుడు కానరాడా? నేను, నాది అనేది వదిలిపెట్టి ధర్మాచరణ కోసం పృథ్విపై అవతరించినవాళ్లను ఏమనాలి?
- ఆనంద సాయి స్వామి
కాలవకు కుళ్లు అడ్డుపడి, వూళ్లో ఉన్న చెత్త అంతా ఆ క్షణంలో అక్కడ పేరుకుపోయినట్లు- కూడబెట్టడం, కుప్పపోయడమే జీవిత పరమావధి అనుకుంటారు కొందరు. కౌటిల్యుడి అర్థశాస్త్రంలో ఉటంకించినట్లు- తమకు మరణమే లేదన్నట్లు జీవితాంతం సంపాదిస్తూనే ఉంటారు. చట్టాన్ని తమ చుట్టం చేసుకొని టక్కుటమార గారడి విద్యలు ప్రదర్శిస్తూ, అడ్డగోలు తర్కాలతో అందినంత దోచుకోవడమే తమ జీవిత లక్ష్యం అనుకుంటారు.
అగ్రరాజ్యం అయిన అమెరికా సైతం శాండీ తుపాను దెబ్బకు గజగజ వణకక తప్పలేదు. ప్రకృతి విలయతాండవం చేస్తే ఎవరు ఎదిరించి నిలవగలరు? గ్రహగతులు బాగు లేకపోతే పాండవులైనా అడవులు పట్టాల్సిందే. దైవం చిన్నచూపు చూస్తే చిరునామా కూడా దొరకదు.
'అశాశ్వతం' అనే పదం తమ నిఘంటువులో లేనట్లు ప్రవర్తిస్తుంటారు కొందరు. మొలమీద నూలు లేకుండా వచ్చినవాడిని, మోసుకొని వెళ్లేటప్పుడు ఆ పోగు కూడా లేకుండా చేస్తారు. కళ్లముందు జరుగుతున్నది చూస్తూ కూడా తాము అమరులం అనుకుంటారు.
గొప్ప బతుకు అంటే ప్రపంచమంతా మన ఆస్తులు విస్తరింపజేసుకొని, గ్రహమండలాల్లోకి కూడా వెళ్లి సూర్యుణ్ని, చంద్రుణ్ని వేలంపాటల్లో కొనుక్కొని ఇంటికి తెచ్చుకోవడం కాదు.
గొప్ప బతుకు అంటే గొప్పగా బతకడం. మరణంలో కూడా ఎవరికైనా సహాయం చేసే అవకాశం దొరుకుతుందా అని వెయ్యి కళ్లతో ఎదురుచూడటం, సహాయం చెయ్యడంద్వారా లభించే నిర్మలమైన యశస్సు- కూడబెట్టడం, కుప్పపోయడంలో ఆవగింజంతైనా దొరుకుతుందా? కాలం మారిపోతోంది. అర్థాలు మారిపోతున్నాయి. కొత్త నిర్వచనాలు పుట్టుకొస్తున్నాయి. ధనం సంపాదిస్తూనే భగవంతుణ్ని సంపాదించుకోండి అంటున్నారు. మాయలో మునిగిపోండి, సత్యం దానికదే దొరుకుతుంది అంటున్నారు. మిడిమిడి జ్ఞానంతో శాస్త్రాలకు వక్రభాష్యాలు చెబుతున్నారు.
సత్యం రామబాణం. అది సూటిగా వెళ్లి అజ్ఞానాన్ని, మాయను, మోహాన్ని ఛేదిస్తుంది. దాన్ని ధరించాలనుకునేవాడు దైవ లక్షణాలు కలిగి ఉండాలి. వాటిని నిత్యం అభ్యసిస్తూ ఉండాలి. కనికరం లేకుండా కఠోరసాధన చేస్తూ ఉండాలి.
ప్రేమ, దయ, శాంతి, క్షమ లేనివాడు ఆశ, వ్యామోహాల్లో పడి తిరుగుతున్నవాడు కోట్లాధిపతి అయినా లోకానికి ఏం ఒరుగుతుంది? దుర్యోధనుడు ముందుగా వచ్చినా, అర్జునుడినే ఎప్పుడూ ముందుగా చూస్తాడు శ్రీకృష్ణుడు!
దైవ సహాయం ఎవరికి లభిస్తుంది? అహర్నిశలు పరోపకారం చేసేవాడివెంట భగవంతుడు నడుస్తాడు. ప్రతి మంచిపనికి అవరోధాలు ఉంటాయి. ప్రతి గొప్ప పనికి తీవ్రమైన వ్యతిరేకత ఉంటుంది. పని మానుకుంటే ప్రతికూల శక్తులకు లొంగిపోయినట్లే కదా.
మారీచ సుబాహుల రాక్షస చర్యలకు అడ్డుకట్ట వెయ్యడం తనకు సాధ్యం కాకపోవచ్చు. రామలక్ష్మణుల సహాయం తీసుకుంటే నిమిషాలమీద వాళ్లను తుత్తునియలు చేసి గగనంలోకి ఎగురకొట్టవచ్చు. విశ్వామిత్రుడి ఆలోచన గొప్పది. ఆచరణలో పెట్టాడు.
సముద్రాన్ని రెండు చెయ్యాలి. లంకకు వారధి కట్టాలి. వెనకడుగు వెయ్యలేదు శ్రీరాముడు. ప్రతి వానరుణ్నీ దీవించి, ఆశీర్వదించి కార్యోన్ముఖులను చేశాడు. చివరికి చిన్న ఉడుత కూడా తనవంతు సాయం చేసింది.
మంచివాళ్లకు, మంచి పనులకు సాయం చెయ్యాలంటే భగవంతుడు ముందుకు వస్తాడు. ముందే వస్తాడు. 'పాండవ పక్షపాతి' అని నిందించినా పాండవులను వదల్లేదు శ్రీకృష్ణుడు. చివరిదాకా ఉండి విజయం సాధించిపెట్టాడు.
మొత్తం సమయమంతా మన అభివృద్ధికోసం మనం ఉపయోగించుకోవచ్చు. ఎంతైనా పాటుపడవచ్చు. మన వ్యర్థమైన పనుల్లోంచి ఒక గంట బయటకు తీసి ఇతరుల మంచికోసం ఉపయోగిస్తే, కనీసం అలా ఆలోచిస్తే- కొంతకాలానికి ఆచరణలోకి వచ్చి... మన జీవన విధానం మారిపోతుంది. ముఖ్యంగా ఇటువంటి పనుల్లో దైవం ఎలా పనిచేస్తాడో చక్కగా అవగాహన చేసుకోవచ్చు.
'దేవుడిని చూస్తాం. దేవుడిని చూస్తాం. చూపించండి' అంటుంటారు కొందరు. కూడబెట్టడం, కుప్పవేయటం మానేసి, లోకక్షేమం కోసం పాటుపడే వాళ్లలో భగవంతుడు కనిపించడా? ప్రకృతితో మమేకమై లోక సౌఖ్యంకోసం జీవిస్తున్న ప్రతి పురుగు, పక్షి, జంతువు, మొక్క, రాయిలో భగవంతుడు కానరాడా? నేను, నాది అనేది వదిలిపెట్టి ధర్మాచరణ కోసం పృథ్విపై అవతరించినవాళ్లను ఏమనాలి?
- ఆనంద సాయి స్వామి
ᐅ భీష్మ గీత
ᐅ భీష్మ గీత
మహాభారత యుద్ధానంతరం ధర్మరాజు రాజ్యాభిషిక్తుడైనా అశాంత చిత్తుడయ్యాడు. సింహాసనం కోసం తానుగావించిన రక్తపాతం అతడి హృదయాన్ని కలచివేసింది. కృష్ణభగవానుడు ఎన్ని విధాలుగా చెప్పిచూసినా ధర్మజుడికి మనశ్శాంతి చేకూరలేదు. అప్పుడు కృష్ణుడు శరతల్పగతుడైన భీష్ముడి వద్దకు తీసుకువెళ్లి హితోపదేశం చేయవలసిందిగా కోరాడు. ధర్మరాజు వ్యక్తపరచిన పలు సందేహాలకు భీష్ముడు విసుగు లేకుండా సమాధానాలు చెప్పాడు. ఈ సందర్భంలో చివరగా ధర్మరాజు ఆరు ప్రశ్నలు అడిగాడు.
ఈ విశ్వంలో గొప్ప దైవమెవరు? సకలజీవులకూ శరణునిచ్చేవాడెవరు? ఎవరి నామాన్ని కీర్తిస్తే శాంతిసౌభాగ్యాలు చేకూరతాయి? ఎవరిని అర్చిస్తే శుభాలు సమకూరతాయి? సకల ధర్మాలకూ ధర్మం ఎవరు? దేన్ని జపిస్తే సంసారచక్రం నుంచి సకల జీవులు విముక్తి పొందగలరు?
ఈ ప్రశ్నలకు సమాధానంగా భీష్ముడు- ఎవరైతే పవిత్రతకు మారుపేరో, ఎవరివల్ల సకల వస్తువులు పవిత్రమవుతాయో, ఎవరు అత్యంత శుభప్రదుడో ఆ దైవమే శ్రీమహావిష్ణువు. అతడు సకల జీవులకు తండ్రి అంటూ వివరించి విష్ణు సహస్రనామాన్ని ఉపదేశిస్తాడు.
మనకు శ్రుతి స్మృతి పురాణాలున్నాయి. వాటిలో భగవంతుడికి ఎన్నో నిర్వచనాలున్నాయి. భగవంతుణ్ని నిర్వికారుడు, నిర్గుణుడు అని కూడా అంటాం. అయినా అనిర్వచనీయమైన భగవంతుడి లక్షణాలను తెలుసుకుని మరలమరల అవిద్య నుంచి మనసు, బుద్ధి, అహంకారాదులను ఏకాగ్రతకు లోనుచెయ్యడానికే స్తోత్రాలు పుట్టాయి.
వ్యాసభారతంలో మూడు మహత్వపూర్ణ రత్నాలు ఉన్నాయి. ఉద్యోగపర్వంలోని సనత్సుజాతీయం. ఇక్కడ వక్త సనత్సుజాతుడు, శ్రోత ధృతరాష్ట్రుడు. రెండోది భీష్మపర్వంలోని భగవద్గీత- వక్త శ్రీకృష్ణ పరమాత్ముడు, శ్రోత మమత బద్ధుడైన అర్జునుడు. విష్ణు నామ సహస్రంలో వివరించినవాడు భీష్మ పితామహుడైతే విన్నవాడు యుధిష్ఠిరుడు. ఇది అనుశాసనిక పర్వంలో ఉంది. సనత్సుజాతీయం యుద్ధ ప్రయత్నాల దశనాటిదైతే, గీత సమర రంగంలో జరిగింది. సహస్రనామం యుద్ధానంతర ప్రశాంత వాతావరణంలో చెప్పినది.
కలియుగంలో నామస్మరణం అత్యంత ఫలదాయకంగా విజ్ఞులు భావిస్తారు. భీష్ముడు ఉపనిషత్తుల్లో ప్రతిపాదించిన పరబ్రహ్మతత్వం సాక్షాత్తూ శ్రీకృష్ణుడే అని గ్రహించి. ఆ భగవానుడి సమక్షంలోనే వ్యాసుడి ఎదుట ధర్మరాజును నిమిత్తంగా చేసుకొని లోకానికి ప్రసాదించిన మహిమాన్విత స్తోత్రరాజం ఇది.
సహస్రనామాల్లో ప్రతి అక్షరమూ దేవతా స్వరూపమే. ప్రతినామమూ ఒక మంత్రమే. పురుషోత్తముడికి వర్తించని నామాలు లేవు. దేవతలు, మానవులు, గుణాలు, వృక్షాలు, జంతువులు, పర్వతాలు, పంచభూతాలూ... వీటన్నింటి పేర్లు భగవన్నామాలే. విష్ణువంటే వ్యాపించేవాడు. ఆయన సహస్ర శీర్షుడు. సహస్రాక్షుడు. సహస్రపాదుడు. ఆయన విభూతి అంతటా నిండి ఉంది. త్రికరణ శుద్ధిగా సాత్వికభావంతో, నిర్మలమైన పరిశుద్ధమైన వాక్కుతో దివ్యసహస్ర నామాన్ని సంకీర్తనం చేస్తే ఆ విభూతిని దర్శించగలమని చెబుతారు.
ప్రణవ శబ్దంతో ప్రారంభమైన సహస్రనామంలో మొదటి నామం విశ్వం. విశ్వమంటే సర్వస్వం. సర్వస్వమైన విశ్వమే విష్ణువు. విష్ణు సహస్రనామం విశ్వ సహస్రనామం. విష్ణు సహస్రనామం ఉత్తరపీఠికలో పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించిన శ్రీరామ తారక మంత్రం ఉంది.
ఆదిశంకరులు మొట్టమొదటి విష్ణు సహస్రనామంపై భాష్యం రాశారు. భగవద్రామానుజులు విష్ణు సహస్రనామ భాష్యాన్ని తన శిష్యుడైన పరాశర భట్టరు వారిచే రాయించారు. ఆదిశంకరుల భజగోవిందంలో గేయం గీతానామ సహస్రం అనే సందేశం ఉంది. గీత గానానికి, నామ సహస్రం ధ్యానానికి ప్రధానంగా భావించవచ్చు. నామ స్మరణమే ఒక యజ్ఞం. ఈ కలియుగంలో అది సులభమైన తరుణోపాయం.
- డాక్టర్ డి.వి.సూర్యారావు
మహాభారత యుద్ధానంతరం ధర్మరాజు రాజ్యాభిషిక్తుడైనా అశాంత చిత్తుడయ్యాడు. సింహాసనం కోసం తానుగావించిన రక్తపాతం అతడి హృదయాన్ని కలచివేసింది. కృష్ణభగవానుడు ఎన్ని విధాలుగా చెప్పిచూసినా ధర్మజుడికి మనశ్శాంతి చేకూరలేదు. అప్పుడు కృష్ణుడు శరతల్పగతుడైన భీష్ముడి వద్దకు తీసుకువెళ్లి హితోపదేశం చేయవలసిందిగా కోరాడు. ధర్మరాజు వ్యక్తపరచిన పలు సందేహాలకు భీష్ముడు విసుగు లేకుండా సమాధానాలు చెప్పాడు. ఈ సందర్భంలో చివరగా ధర్మరాజు ఆరు ప్రశ్నలు అడిగాడు.
ఈ విశ్వంలో గొప్ప దైవమెవరు? సకలజీవులకూ శరణునిచ్చేవాడెవరు? ఎవరి నామాన్ని కీర్తిస్తే శాంతిసౌభాగ్యాలు చేకూరతాయి? ఎవరిని అర్చిస్తే శుభాలు సమకూరతాయి? సకల ధర్మాలకూ ధర్మం ఎవరు? దేన్ని జపిస్తే సంసారచక్రం నుంచి సకల జీవులు విముక్తి పొందగలరు?
ఈ ప్రశ్నలకు సమాధానంగా భీష్ముడు- ఎవరైతే పవిత్రతకు మారుపేరో, ఎవరివల్ల సకల వస్తువులు పవిత్రమవుతాయో, ఎవరు అత్యంత శుభప్రదుడో ఆ దైవమే శ్రీమహావిష్ణువు. అతడు సకల జీవులకు తండ్రి అంటూ వివరించి విష్ణు సహస్రనామాన్ని ఉపదేశిస్తాడు.
మనకు శ్రుతి స్మృతి పురాణాలున్నాయి. వాటిలో భగవంతుడికి ఎన్నో నిర్వచనాలున్నాయి. భగవంతుణ్ని నిర్వికారుడు, నిర్గుణుడు అని కూడా అంటాం. అయినా అనిర్వచనీయమైన భగవంతుడి లక్షణాలను తెలుసుకుని మరలమరల అవిద్య నుంచి మనసు, బుద్ధి, అహంకారాదులను ఏకాగ్రతకు లోనుచెయ్యడానికే స్తోత్రాలు పుట్టాయి.
వ్యాసభారతంలో మూడు మహత్వపూర్ణ రత్నాలు ఉన్నాయి. ఉద్యోగపర్వంలోని సనత్సుజాతీయం. ఇక్కడ వక్త సనత్సుజాతుడు, శ్రోత ధృతరాష్ట్రుడు. రెండోది భీష్మపర్వంలోని భగవద్గీత- వక్త శ్రీకృష్ణ పరమాత్ముడు, శ్రోత మమత బద్ధుడైన అర్జునుడు. విష్ణు నామ సహస్రంలో వివరించినవాడు భీష్మ పితామహుడైతే విన్నవాడు యుధిష్ఠిరుడు. ఇది అనుశాసనిక పర్వంలో ఉంది. సనత్సుజాతీయం యుద్ధ ప్రయత్నాల దశనాటిదైతే, గీత సమర రంగంలో జరిగింది. సహస్రనామం యుద్ధానంతర ప్రశాంత వాతావరణంలో చెప్పినది.
కలియుగంలో నామస్మరణం అత్యంత ఫలదాయకంగా విజ్ఞులు భావిస్తారు. భీష్ముడు ఉపనిషత్తుల్లో ప్రతిపాదించిన పరబ్రహ్మతత్వం సాక్షాత్తూ శ్రీకృష్ణుడే అని గ్రహించి. ఆ భగవానుడి సమక్షంలోనే వ్యాసుడి ఎదుట ధర్మరాజును నిమిత్తంగా చేసుకొని లోకానికి ప్రసాదించిన మహిమాన్విత స్తోత్రరాజం ఇది.
సహస్రనామాల్లో ప్రతి అక్షరమూ దేవతా స్వరూపమే. ప్రతినామమూ ఒక మంత్రమే. పురుషోత్తముడికి వర్తించని నామాలు లేవు. దేవతలు, మానవులు, గుణాలు, వృక్షాలు, జంతువులు, పర్వతాలు, పంచభూతాలూ... వీటన్నింటి పేర్లు భగవన్నామాలే. విష్ణువంటే వ్యాపించేవాడు. ఆయన సహస్ర శీర్షుడు. సహస్రాక్షుడు. సహస్రపాదుడు. ఆయన విభూతి అంతటా నిండి ఉంది. త్రికరణ శుద్ధిగా సాత్వికభావంతో, నిర్మలమైన పరిశుద్ధమైన వాక్కుతో దివ్యసహస్ర నామాన్ని సంకీర్తనం చేస్తే ఆ విభూతిని దర్శించగలమని చెబుతారు.
ప్రణవ శబ్దంతో ప్రారంభమైన సహస్రనామంలో మొదటి నామం విశ్వం. విశ్వమంటే సర్వస్వం. సర్వస్వమైన విశ్వమే విష్ణువు. విష్ణు సహస్రనామం విశ్వ సహస్రనామం. విష్ణు సహస్రనామం ఉత్తరపీఠికలో పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించిన శ్రీరామ తారక మంత్రం ఉంది.
ఆదిశంకరులు మొట్టమొదటి విష్ణు సహస్రనామంపై భాష్యం రాశారు. భగవద్రామానుజులు విష్ణు సహస్రనామ భాష్యాన్ని తన శిష్యుడైన పరాశర భట్టరు వారిచే రాయించారు. ఆదిశంకరుల భజగోవిందంలో గేయం గీతానామ సహస్రం అనే సందేశం ఉంది. గీత గానానికి, నామ సహస్రం ధ్యానానికి ప్రధానంగా భావించవచ్చు. నామ స్మరణమే ఒక యజ్ఞం. ఈ కలియుగంలో అది సులభమైన తరుణోపాయం.
- డాక్టర్ డి.వి.సూర్యారావు
ᐅ మానవుడి దశలు
ᐅ మానవుడి దశలు
మానవుడు తన నూరేళ్ల జీవితంలో తప్పక అనుభవించవలసిన దశలు నాలుగు. అవి- బాల్య, కౌమార, యౌవన, వార్ధక్యాలు. అయిదేళ్ల వరకు బాల్యం, పదిహేను సంవత్సరాల వరకు కౌమారం, నాలుగు పదుల వరకు యౌవనం, ఆ తరవాత వృద్ధాప్యం... క్రమంగా సంప్రాప్తించే దశలు. మనిషి అవునన్నా, కాదన్నా ఇవి జరిగిపోతూనే ఉంటాయి. ఈ నాలుగు దశలు ఉన్నవాళ్లు మానవులైతే, మూడు దశలు ఉన్నవాళ్లు దేవతలు. దేవతలకు బాల్య, కౌమార, యౌవనాలే ఉంటాయి కానీ, వృద్ధాప్యం ఉండనే ఉండదు. అందువల్ల దేవతలకు 'త్రిదశులు' అనే పేరు వచ్చింది. దేవతలకు లేని నాలుగో దశ 'వృద్ధాప్యం' ఉన్నందుకు మనిషి గర్వించాలా? లేక వృద్ధాప్యంలో వచ్చే బాధలను తలచుకొని దుఃఖించాలా? అంటే రెండూ చేయవలసిందే అనేవాళ్లు కనిపిస్తారు.
బాల్యం మానవుడి జీవితంలో తొలిదశ. ఆటపాటలతో ఆసక్తుడై ఉండే మనిషికి ఈ దశ వేగంగా గడిచిపోతుంది. ముద్దుముచ్చట్లతోనే పొద్దు గడచిపోతుంది. తెలిసీ తెలియనితనం ఈ దశలోని ప్రత్యేకత. భగవంతుడిలో ఉండే రుజువర్తనం బాల్యంలో ఉంటుందని పెద్దలు అంటారు. అందుకే పిల్లలు ఏది మాట్లాడినా 'బాలవాక్కు బ్రహ్మవాక్కు' అని ప్రశంసిస్తారు. బాల్యం లేత మొక్కలాంటిదనీ, దాన్ని ఎటువైపు వంచితే ఆ దిశవైపే పాకిపోతుందని నీతివేత్తల అభిప్రాయం. అందుకే బాల్యంలోనే మంచి అలవాట్లను నేర్పాలని ఉపదేశించే సూక్తులు విరివిగా కనబడతాయి. పసితనంలో పడిన ఏ ముద్ర అయినా శాశ్వతంగా ఉండిపోతుంది కనుక, పసివాళ్లను మంచిదారిలో నడపాలని పూజ్యులు చెబుతారు.
కౌమార దశ విద్యార్జనకు, జ్ఞానసముపార్జనకు ఆలవాలం. పాఠశాలలనూ, గురువులనూ ఆశ్రయించి నేర్చుకొన్న విద్యలు భావి జీవితాన్ని సుఖవంతం చేస్తాయి. కనుక కౌమారదశ కీలకమైంది. ఈ దశలో అశ్రద్ధ చేస్తే ఏం జరుగుతుందో కాలక్రమంలోగానీ తెలియదు. విద్యాసాధనకు కాకుండా వ్యర్థంగా గడిపిన పక్షంలో మనిషి జీవితాంతం కుమిలిపోవలసిన దుస్థితిని ఈ దశ కలగజేస్తుందని అందరికీ తెలుసు. ఈ దశ విలువ తెలిసినవాళ్లెవరూ ఈ కాలాన్ని దుర్వినియోగం చేయరు.
మూడోదశ యౌవనం. ఇది మనిషి బతుకులో అత్యంత ప్రాధాన్యాన్ని కలిగి ఉంటుందనడంలో సందేహం లేదు. యౌవనం సుఖాభిలాషకు మూలం. యౌవనం చిగురులు వేస్తున్న సమయంలోనే కోరికలు మొగ్గలు తొడుగుతాయి. ఆశలు కాయలు కాస్తాయి. అనుభవాలు ఫలిస్తాయి. మధురమైన ఫలాన్ని మనసారా ఆస్వాదించినట్లు యౌవనం సుఖాలను జుర్రుకొంటుంది. కామనలు సర్పాలై బుసలు కొడుతుంటాయి. అడ్డూ అదుపూ ఏదీ ఉండదు. అనుకున్న దాన్ని అవశ్యం ఆచరించాలని మనసు ఉవ్విళ్లూరుతూ ఉంటుంది. కాలు జారడం సహజమవుతుంది. అనుభూతుల్లో తేలడం స్వభావమవుతుంది. ఈ దశను అదుపు చేయడం ఎంతో కష్టం. పగ్గాలు లేని గుర్రాలు పరుగెత్తుతుంటే వాటిని అదుపు చేయడం ఎంత కష్టమో యౌవనదశను కట్టడి చేయడం అంతకన్నా కష్టం. లోకంలోని ఆకర్షణలన్నీ ఏకంగా ఈ దశనే ఆవహిస్తాయి. భూతాలై పట్టి పీడిస్తాయి. పీల్చి పిప్పి చేసిన తరవాతగానీ వదలిపెట్టవు. కనుక యౌవనం ప్రమాదాలకు నెలవు. అపాయాలకు కొలువు.
చివరి దశ వార్ధక్యం. అంటే, వృద్ధాప్యం. యౌవనంలో తన అందాన్ని చూసుకొని తానే మురిసిపోయిన మనిషి వృద్ధాప్యంలో అద్దంలో తన ముఖం చూసుకొని ఏడుస్తాడు. అది తన ముఖమేనా అని సంశయిస్తాడు. ముగ్గుబుట్ట వంటి తల, ముడతలు దేరిన శరీరం, వంగిపోతున్న నడుము, వూడిపోయే దంతాలు, వాలిపోతున్న ఆయువు ఇవన్నీ రోతను కలిగిస్తుంటే మనిషికి మనశ్శాంతి కరవే. యౌవనంలో చేసిన పాపాలన్నీ గుర్తుకు వస్తుంటాయి. వాటిని అలా చేయకపోయి ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. కానీ ఏం లాభం? కాలమంతా కర్పూరంలా హరించుకొని పోయింది. ఇప్పుడు జ్ఞానోదయమైనా ఏమీ చేయలేని పరిస్థితి. కాలు కదపలేని దుస్థితి. ఇలాంటి దశలోనే మనిషి ధైర్యంగా ఉండాలి. బాల్య, కౌమార, యౌవనాల్లో ఉడుకురక్తం ప్రవహిస్తుంటే శరీరంలో, మనసులో ఎక్కడలేని ధైర్యం ఉంటుంది. కానీ వృద్ధాప్యంలో ధైర్యంగా నిలవగలగడమే మనిషికి పరీక్ష. ఈ దశలో మనిషి తృప్తిగా బతకాలి. అసంతృప్తిని దరిజేరనీయరాదు. 'గత జలసేతుబంధనం' (నీళ్లు ఇంకిపోయిన తరవాత ఆనకట్ట కట్టడం) ఎందుకని ఆలోచించుకోవాలి. జరిగిందేదో జరిగిపోయింది. శేషజీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ఆత్మోన్నతికై తపించాలి. ప్రశాంతతను జపించాలి. చేతనైనంతలో ఇతరులకు సాయం చేయడానికి పూనుకోవాలి.
భగవంతుడు దేవతలకు కూడా ఇవ్వని నాలుగు దశలను మనిషికి ఇచ్చాడంటే మనిషిని దేవుడు ఎంత విశిష్టంగా సృష్టించాడో అర్థం చేసుకోవచ్చు. కనుక నాలుగు దశలనూ, నాలుగు కాలాల పాటు అనుభవించి, జీవన మధురిమలను ఆస్వాదించి చరితార్థుడు కావడం మనిషి ముందున్న కర్తవ్యం.
- డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ
మానవుడు తన నూరేళ్ల జీవితంలో తప్పక అనుభవించవలసిన దశలు నాలుగు. అవి- బాల్య, కౌమార, యౌవన, వార్ధక్యాలు. అయిదేళ్ల వరకు బాల్యం, పదిహేను సంవత్సరాల వరకు కౌమారం, నాలుగు పదుల వరకు యౌవనం, ఆ తరవాత వృద్ధాప్యం... క్రమంగా సంప్రాప్తించే దశలు. మనిషి అవునన్నా, కాదన్నా ఇవి జరిగిపోతూనే ఉంటాయి. ఈ నాలుగు దశలు ఉన్నవాళ్లు మానవులైతే, మూడు దశలు ఉన్నవాళ్లు దేవతలు. దేవతలకు బాల్య, కౌమార, యౌవనాలే ఉంటాయి కానీ, వృద్ధాప్యం ఉండనే ఉండదు. అందువల్ల దేవతలకు 'త్రిదశులు' అనే పేరు వచ్చింది. దేవతలకు లేని నాలుగో దశ 'వృద్ధాప్యం' ఉన్నందుకు మనిషి గర్వించాలా? లేక వృద్ధాప్యంలో వచ్చే బాధలను తలచుకొని దుఃఖించాలా? అంటే రెండూ చేయవలసిందే అనేవాళ్లు కనిపిస్తారు.
బాల్యం మానవుడి జీవితంలో తొలిదశ. ఆటపాటలతో ఆసక్తుడై ఉండే మనిషికి ఈ దశ వేగంగా గడిచిపోతుంది. ముద్దుముచ్చట్లతోనే పొద్దు గడచిపోతుంది. తెలిసీ తెలియనితనం ఈ దశలోని ప్రత్యేకత. భగవంతుడిలో ఉండే రుజువర్తనం బాల్యంలో ఉంటుందని పెద్దలు అంటారు. అందుకే పిల్లలు ఏది మాట్లాడినా 'బాలవాక్కు బ్రహ్మవాక్కు' అని ప్రశంసిస్తారు. బాల్యం లేత మొక్కలాంటిదనీ, దాన్ని ఎటువైపు వంచితే ఆ దిశవైపే పాకిపోతుందని నీతివేత్తల అభిప్రాయం. అందుకే బాల్యంలోనే మంచి అలవాట్లను నేర్పాలని ఉపదేశించే సూక్తులు విరివిగా కనబడతాయి. పసితనంలో పడిన ఏ ముద్ర అయినా శాశ్వతంగా ఉండిపోతుంది కనుక, పసివాళ్లను మంచిదారిలో నడపాలని పూజ్యులు చెబుతారు.
కౌమార దశ విద్యార్జనకు, జ్ఞానసముపార్జనకు ఆలవాలం. పాఠశాలలనూ, గురువులనూ ఆశ్రయించి నేర్చుకొన్న విద్యలు భావి జీవితాన్ని సుఖవంతం చేస్తాయి. కనుక కౌమారదశ కీలకమైంది. ఈ దశలో అశ్రద్ధ చేస్తే ఏం జరుగుతుందో కాలక్రమంలోగానీ తెలియదు. విద్యాసాధనకు కాకుండా వ్యర్థంగా గడిపిన పక్షంలో మనిషి జీవితాంతం కుమిలిపోవలసిన దుస్థితిని ఈ దశ కలగజేస్తుందని అందరికీ తెలుసు. ఈ దశ విలువ తెలిసినవాళ్లెవరూ ఈ కాలాన్ని దుర్వినియోగం చేయరు.
మూడోదశ యౌవనం. ఇది మనిషి బతుకులో అత్యంత ప్రాధాన్యాన్ని కలిగి ఉంటుందనడంలో సందేహం లేదు. యౌవనం సుఖాభిలాషకు మూలం. యౌవనం చిగురులు వేస్తున్న సమయంలోనే కోరికలు మొగ్గలు తొడుగుతాయి. ఆశలు కాయలు కాస్తాయి. అనుభవాలు ఫలిస్తాయి. మధురమైన ఫలాన్ని మనసారా ఆస్వాదించినట్లు యౌవనం సుఖాలను జుర్రుకొంటుంది. కామనలు సర్పాలై బుసలు కొడుతుంటాయి. అడ్డూ అదుపూ ఏదీ ఉండదు. అనుకున్న దాన్ని అవశ్యం ఆచరించాలని మనసు ఉవ్విళ్లూరుతూ ఉంటుంది. కాలు జారడం సహజమవుతుంది. అనుభూతుల్లో తేలడం స్వభావమవుతుంది. ఈ దశను అదుపు చేయడం ఎంతో కష్టం. పగ్గాలు లేని గుర్రాలు పరుగెత్తుతుంటే వాటిని అదుపు చేయడం ఎంత కష్టమో యౌవనదశను కట్టడి చేయడం అంతకన్నా కష్టం. లోకంలోని ఆకర్షణలన్నీ ఏకంగా ఈ దశనే ఆవహిస్తాయి. భూతాలై పట్టి పీడిస్తాయి. పీల్చి పిప్పి చేసిన తరవాతగానీ వదలిపెట్టవు. కనుక యౌవనం ప్రమాదాలకు నెలవు. అపాయాలకు కొలువు.
చివరి దశ వార్ధక్యం. అంటే, వృద్ధాప్యం. యౌవనంలో తన అందాన్ని చూసుకొని తానే మురిసిపోయిన మనిషి వృద్ధాప్యంలో అద్దంలో తన ముఖం చూసుకొని ఏడుస్తాడు. అది తన ముఖమేనా అని సంశయిస్తాడు. ముగ్గుబుట్ట వంటి తల, ముడతలు దేరిన శరీరం, వంగిపోతున్న నడుము, వూడిపోయే దంతాలు, వాలిపోతున్న ఆయువు ఇవన్నీ రోతను కలిగిస్తుంటే మనిషికి మనశ్శాంతి కరవే. యౌవనంలో చేసిన పాపాలన్నీ గుర్తుకు వస్తుంటాయి. వాటిని అలా చేయకపోయి ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. కానీ ఏం లాభం? కాలమంతా కర్పూరంలా హరించుకొని పోయింది. ఇప్పుడు జ్ఞానోదయమైనా ఏమీ చేయలేని పరిస్థితి. కాలు కదపలేని దుస్థితి. ఇలాంటి దశలోనే మనిషి ధైర్యంగా ఉండాలి. బాల్య, కౌమార, యౌవనాల్లో ఉడుకురక్తం ప్రవహిస్తుంటే శరీరంలో, మనసులో ఎక్కడలేని ధైర్యం ఉంటుంది. కానీ వృద్ధాప్యంలో ధైర్యంగా నిలవగలగడమే మనిషికి పరీక్ష. ఈ దశలో మనిషి తృప్తిగా బతకాలి. అసంతృప్తిని దరిజేరనీయరాదు. 'గత జలసేతుబంధనం' (నీళ్లు ఇంకిపోయిన తరవాత ఆనకట్ట కట్టడం) ఎందుకని ఆలోచించుకోవాలి. జరిగిందేదో జరిగిపోయింది. శేషజీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ఆత్మోన్నతికై తపించాలి. ప్రశాంతతను జపించాలి. చేతనైనంతలో ఇతరులకు సాయం చేయడానికి పూనుకోవాలి.
భగవంతుడు దేవతలకు కూడా ఇవ్వని నాలుగు దశలను మనిషికి ఇచ్చాడంటే మనిషిని దేవుడు ఎంత విశిష్టంగా సృష్టించాడో అర్థం చేసుకోవచ్చు. కనుక నాలుగు దశలనూ, నాలుగు కాలాల పాటు అనుభవించి, జీవన మధురిమలను ఆస్వాదించి చరితార్థుడు కావడం మనిషి ముందున్న కర్తవ్యం.
- డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ
ᐅ సర్వం నీవే
ᐅ సర్వం నీవే!
ధ్యానం, సంయమం, సాధనల ద్వారా జగత్కారణుడైన ఆ భగవానుడి దర్శనం పొంది, ఆ పరమాత్మునిలో ఐక్యం చెందడమే జన్మ పరమార్థమన్న దివ్య ప్రబోధాలు ఈ నేల నలుచెరగులా నినదిస్తుంటాయి. కర్మబంధనంలో చిక్కుకోని అవతార పురుషులు జన్మించి, పరుల శ్రేయంకోసం ప్రజాబాహుళ్యానికి సుమార్గ బోధకులుగా, ఆధ్యాత్మిక గురువులుగా విలసిల్లారు.
గడచిన యుగాల్లో సనాతన ధర్మ ప్రతిష్ఠాపనకు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అవతరించారు. దాదాపు నాలుగు శతాబ్దాల క్రితం భగవానుడే శ్రీ చైతన్యులుగా జన్మించారని భక్తులు విశ్వసిస్తారు. తరవాతి కాలంలో విదేశీయుల కబంధహస్తాలో నలిగిపోతున్న భారత జాతిని మేల్కొలిపేందుకు, ఆధ్యాత్మిక వెలుగులతో సముద్ధరించేందుకు ఆవిర్భవించిన భగవత్ స్వరూపమే శ్రీరామకృష్ణులు.
పరమ ధార్మికులైన క్షుదీరామ్, చంద్రాదేవి గర్భవాసాన జన్మించారు శ్రీ రామకృష్ణులు.
సాధనతో తాదాత్మ్య స్థితికి చేరడం, ఆత్మానందంతో దివ్యానుభూతి పొందడమే భక్తితత్వం పరమావధి అని తెలియజెప్పారు శ్రీరామకృష్ణులు. ఏ విషయం మీదనైతే ఇంద్రియాలు, మనోబుద్ధి చిత్త అహంకారాలు కేంద్రీకృతమై రమిస్తాయో అదే బ్రహ్మానందస్థితి. కాళీమాత దర్శన భాగ్యానికై ప్రగాఢ వాంఛ, దక్షిణేశ్వర కాళికాలయం, గంగాతీరం పంచవటీ ప్రాంతాలే కాదు- మరుభూములు సైతం ఆయన తపోవాటికలే. మనోవాక్కాయకర్మలు ఒక్కటిగా సాధకుడు దేన్ని అనుష్ఠించాలో గ్రహించి దాన్నే అనుష్ఠిస్తే లక్ష్యం చేతికందుతుందనడానికి శ్రీరామకృష్ణుల జీవితమే దృష్టాంతం.
భక్తిలో మూఢత్వం, మూర్ఖత్వం ఉండరాదని, పుణ్యక్షేత్రాల్లో అపవిత్రతకు తావుండరాదని ప్రబోధించేవారు. వైరాగ్యం, తపస్సు, ప్రేమలతో జీవితం గడిపేవారిలో తేజోవైభవం, సాధికారత ఉంటాయని శిష్యులకు చెబుతుండేవారు. గురువు తన ప్రతిబింబాన్ని శిష్యుడిలో చూసుకొని మురిసిపోతాడు. తన ఆశయాలను నిలిపే ఉన్నత వ్యక్తిత్వం శిష్యుడిలో ద్యోతకం కావాలని ఆశిస్తాడు. శ్రీరామకృష్ణుల పావన సాంగత్యభాగ్యం నరేంద్రనాథ్కు అయిదు సంవత్సరాల పాటు దక్కింది. ఎటువంటి స్వార్థప్రయోజనం లేకుండా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని అభిమానించడమనేది గురుశిష్య బంధంలోనే ఉంటుంది.
నరేంద్రుడిలో విశిష్టార్హతలున్నాయని రామకృష్ణులు, తనలోని సందేహాలను పోగొట్టి మార్గ నిర్దేశనం చేయగల సమర్థ గురువు రామకృష్ణులేనని నరేంద్రుడు- ఒకరినొకరు విశ్వసించిన వైనం... భారతజాతి సంస్కృతీ వికాసానికి, ఆధ్యాత్మిక పురోగామిత్వానికి అద్దం పట్టింది. సనాతన ధర్మ పరిరక్షణకు, చైతన్య శంఖారావానికి నరేంద్రుడే తన వారసుడన్నది రామకృష్ణుల విశ్వాసం. జనసామాన్యం దృష్టిలో నరేంద్రుడు అహంకారి. ఆయన బాహ్యవర్తన అలా ఉండేది. అది నరేంద్రుడిలోని అద్భుతమైన ఆత్మస్త్థెర్యానికి, మనోశక్తికి నిదర్శనమని రామకృష్ణులు అనేవారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే చైతన్య స్వరూపమే అది. తన యోగ దృష్టితో నరేంద్రుడి అంతరంగాన్ని చదవగలిగిన గురువాయన.
నరేంద్రుడికి పాశ్చాత్యశాస్త్రాల పరిజ్ఞానం ఎక్కువ. మిల్ సిద్ధాంతాన్ని ఔపోసన పట్టాడు. డికార్ట్ అహంవాదాన్ని, హ్యూం, బెన్థామ్ల నిరీశ్వరవాదాన్ని, స్పినోజ్ సర్వేశ్వరవాదాన్ని, డార్విన్ పరిణామవాదాన్ని, కోమ్టే రూఢివాదాన్ని, స్పెన్సర్ అజ్ఞేయవాదాన్ని, జర్మన్ దార్శనికుల తాత్విక ధోరణులను అధ్యయనం చేశాడు. ఈ వాదాల ప్రభావంతోనే కావచ్చు- విగ్రహారాధన పట్ల, ప్రతిమల పట్ల ఆయనకు చులకన భావం ఉండేది. ఒకానొక దశలో రామకృష్ణులు ఈ భావాన్ని పోగొట్టారు. నరేంద్రుడి దుర్భర కుటుంబ దారిద్య్ర నిర్మూలనకు కాళీమాతనే శరణు కోరమన్నారు. నరేంద్రుడు మందిరంలోకి అడుగిడగానే, జాజ్జ్వలమానంగా వెలుగొందే మాతను చూడగానే తాను అడగాల్సినదానికి బదులు- వైరాగ్యాన్ని, దివ్యజ్ఞాన భిక్షను అర్థిస్తాడు. రెండోసారి కూడా ఇదే అనుభవం. ఇది గురుదేవుల లీలగా తెలుసుకుంటాడు. అప్పటినుంచి విగ్రహారాధనను విశ్వసిస్తాడు నరేంద్రుడు.
నరేంద్రుడి(స్వామి వివేకానందుడి) సిద్ధాంతాలకు మూలమైన ప్రబోధవాక్యం- 'సర్వం నీవే'నన్న సత్యాన్ని శిష్యుడికి వివరించారాయన. పరిపూర్ణ విశ్వాసానికి ఆత్మశక్తిని ప్రతీకగా తెలుపుతారు. ముందడుగుకు వెన్నుదన్ను ఆత్మవిశ్వాసం, అదే భగవత్శక్తిగా గుర్తెరగాలంటారు. నాణేనికి రెండో పార్శ్వంగా- జీవులందరిలోనూ భగవంతుని చూసి, మానవీయ లక్షణాలతో స్పందించడమే ఆధ్యాత్మిక పురోగామిత్వానికి దోహదపడుతుంది.
- దానం శివప్రసాదరావు
ధ్యానం, సంయమం, సాధనల ద్వారా జగత్కారణుడైన ఆ భగవానుడి దర్శనం పొంది, ఆ పరమాత్మునిలో ఐక్యం చెందడమే జన్మ పరమార్థమన్న దివ్య ప్రబోధాలు ఈ నేల నలుచెరగులా నినదిస్తుంటాయి. కర్మబంధనంలో చిక్కుకోని అవతార పురుషులు జన్మించి, పరుల శ్రేయంకోసం ప్రజాబాహుళ్యానికి సుమార్గ బోధకులుగా, ఆధ్యాత్మిక గురువులుగా విలసిల్లారు.
గడచిన యుగాల్లో సనాతన ధర్మ ప్రతిష్ఠాపనకు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అవతరించారు. దాదాపు నాలుగు శతాబ్దాల క్రితం భగవానుడే శ్రీ చైతన్యులుగా జన్మించారని భక్తులు విశ్వసిస్తారు. తరవాతి కాలంలో విదేశీయుల కబంధహస్తాలో నలిగిపోతున్న భారత జాతిని మేల్కొలిపేందుకు, ఆధ్యాత్మిక వెలుగులతో సముద్ధరించేందుకు ఆవిర్భవించిన భగవత్ స్వరూపమే శ్రీరామకృష్ణులు.
పరమ ధార్మికులైన క్షుదీరామ్, చంద్రాదేవి గర్భవాసాన జన్మించారు శ్రీ రామకృష్ణులు.
సాధనతో తాదాత్మ్య స్థితికి చేరడం, ఆత్మానందంతో దివ్యానుభూతి పొందడమే భక్తితత్వం పరమావధి అని తెలియజెప్పారు శ్రీరామకృష్ణులు. ఏ విషయం మీదనైతే ఇంద్రియాలు, మనోబుద్ధి చిత్త అహంకారాలు కేంద్రీకృతమై రమిస్తాయో అదే బ్రహ్మానందస్థితి. కాళీమాత దర్శన భాగ్యానికై ప్రగాఢ వాంఛ, దక్షిణేశ్వర కాళికాలయం, గంగాతీరం పంచవటీ ప్రాంతాలే కాదు- మరుభూములు సైతం ఆయన తపోవాటికలే. మనోవాక్కాయకర్మలు ఒక్కటిగా సాధకుడు దేన్ని అనుష్ఠించాలో గ్రహించి దాన్నే అనుష్ఠిస్తే లక్ష్యం చేతికందుతుందనడానికి శ్రీరామకృష్ణుల జీవితమే దృష్టాంతం.
భక్తిలో మూఢత్వం, మూర్ఖత్వం ఉండరాదని, పుణ్యక్షేత్రాల్లో అపవిత్రతకు తావుండరాదని ప్రబోధించేవారు. వైరాగ్యం, తపస్సు, ప్రేమలతో జీవితం గడిపేవారిలో తేజోవైభవం, సాధికారత ఉంటాయని శిష్యులకు చెబుతుండేవారు. గురువు తన ప్రతిబింబాన్ని శిష్యుడిలో చూసుకొని మురిసిపోతాడు. తన ఆశయాలను నిలిపే ఉన్నత వ్యక్తిత్వం శిష్యుడిలో ద్యోతకం కావాలని ఆశిస్తాడు. శ్రీరామకృష్ణుల పావన సాంగత్యభాగ్యం నరేంద్రనాథ్కు అయిదు సంవత్సరాల పాటు దక్కింది. ఎటువంటి స్వార్థప్రయోజనం లేకుండా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని అభిమానించడమనేది గురుశిష్య బంధంలోనే ఉంటుంది.
నరేంద్రుడిలో విశిష్టార్హతలున్నాయని రామకృష్ణులు, తనలోని సందేహాలను పోగొట్టి మార్గ నిర్దేశనం చేయగల సమర్థ గురువు రామకృష్ణులేనని నరేంద్రుడు- ఒకరినొకరు విశ్వసించిన వైనం... భారతజాతి సంస్కృతీ వికాసానికి, ఆధ్యాత్మిక పురోగామిత్వానికి అద్దం పట్టింది. సనాతన ధర్మ పరిరక్షణకు, చైతన్య శంఖారావానికి నరేంద్రుడే తన వారసుడన్నది రామకృష్ణుల విశ్వాసం. జనసామాన్యం దృష్టిలో నరేంద్రుడు అహంకారి. ఆయన బాహ్యవర్తన అలా ఉండేది. అది నరేంద్రుడిలోని అద్భుతమైన ఆత్మస్త్థెర్యానికి, మనోశక్తికి నిదర్శనమని రామకృష్ణులు అనేవారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే చైతన్య స్వరూపమే అది. తన యోగ దృష్టితో నరేంద్రుడి అంతరంగాన్ని చదవగలిగిన గురువాయన.
నరేంద్రుడికి పాశ్చాత్యశాస్త్రాల పరిజ్ఞానం ఎక్కువ. మిల్ సిద్ధాంతాన్ని ఔపోసన పట్టాడు. డికార్ట్ అహంవాదాన్ని, హ్యూం, బెన్థామ్ల నిరీశ్వరవాదాన్ని, స్పినోజ్ సర్వేశ్వరవాదాన్ని, డార్విన్ పరిణామవాదాన్ని, కోమ్టే రూఢివాదాన్ని, స్పెన్సర్ అజ్ఞేయవాదాన్ని, జర్మన్ దార్శనికుల తాత్విక ధోరణులను అధ్యయనం చేశాడు. ఈ వాదాల ప్రభావంతోనే కావచ్చు- విగ్రహారాధన పట్ల, ప్రతిమల పట్ల ఆయనకు చులకన భావం ఉండేది. ఒకానొక దశలో రామకృష్ణులు ఈ భావాన్ని పోగొట్టారు. నరేంద్రుడి దుర్భర కుటుంబ దారిద్య్ర నిర్మూలనకు కాళీమాతనే శరణు కోరమన్నారు. నరేంద్రుడు మందిరంలోకి అడుగిడగానే, జాజ్జ్వలమానంగా వెలుగొందే మాతను చూడగానే తాను అడగాల్సినదానికి బదులు- వైరాగ్యాన్ని, దివ్యజ్ఞాన భిక్షను అర్థిస్తాడు. రెండోసారి కూడా ఇదే అనుభవం. ఇది గురుదేవుల లీలగా తెలుసుకుంటాడు. అప్పటినుంచి విగ్రహారాధనను విశ్వసిస్తాడు నరేంద్రుడు.
నరేంద్రుడి(స్వామి వివేకానందుడి) సిద్ధాంతాలకు మూలమైన ప్రబోధవాక్యం- 'సర్వం నీవే'నన్న సత్యాన్ని శిష్యుడికి వివరించారాయన. పరిపూర్ణ విశ్వాసానికి ఆత్మశక్తిని ప్రతీకగా తెలుపుతారు. ముందడుగుకు వెన్నుదన్ను ఆత్మవిశ్వాసం, అదే భగవత్శక్తిగా గుర్తెరగాలంటారు. నాణేనికి రెండో పార్శ్వంగా- జీవులందరిలోనూ భగవంతుని చూసి, మానవీయ లక్షణాలతో స్పందించడమే ఆధ్యాత్మిక పురోగామిత్వానికి దోహదపడుతుంది.
- దానం శివప్రసాదరావు
ᐅ మతం- వెలుగు, నీడ
ᐅ మతం- వెలుగు, నీడ
లోకంలో జ్ఞానాన్ని అన్వేషించేవారున్నారు. జ్ఞానం ఆర్జించడంవల్ల ఉపయోగంలేదు అని భావించిన లౌకిక వాదులు అపార సంపదలు, అనంత సుఖాలు అన్వేషిస్తారు. జ్ఞానాన్ని ఆశించే ద్రష్టల చరమ లక్ష్యం ఆనందం... నిత్య ఆనంద స్వరూపమైన భగవంతుడు. భగవంతుడి సాన్నిధ్యంలో, ఆ కాంతిమయ నిశ్శబ్దంలో గడిపేవారికి అంతరంగమే జీవన గీతమవుతుంది. అదే విశ్వజీవన 'గీత'మవుతుంది. మానవాళికి వెలుగు చూపే మంత్ర ధ్యానంగా అది చిరకాలం వినిపిస్తుంటుంది.
హేతువు భౌతికలోక పరిధిలోనే తన అన్వేషణ సాగిస్తుంది. తనకు కనిపించిన సత్యం- భౌతిక జీవనం, భౌతికలోకం మించివుండదు. మతం, దేవుడు, శాశ్వతత్వం, ఆత్మ- ఇవేమీ హేతువుకు అవసరంలేదు. వాటివల్ల ధనం రాదు, భౌతిక సుఖం అసలు దొరకదు. తన ఇంద్రియ దాహాన్ని తీర్చలేనివి, తన ఆకలిని తృప్తిపరచ లేనివి ఏవైనా సరే- నిరుపయోగమైనవి. తినడం, తాగడం, పిల్లల్ని కనడం, మరణించడం- ఈ దశలను దాటి ఉన్నత శిఖరాలు చేరే ప్రసక్తిలేదు. నేలబారు జీవితం కన్నా ఉన్నతమైనది ఏదైనా ఉందా అని కనుగొనడానికి సుదీర్ఘ అన్వేషణ తప్పదు.
జన్మల ఉప్పు సముద్రాలు దాటినవారికి దివ్య జీవన అమృతభాండం లభిస్తుంది. మానవ జీవితానికి అత్యున్నత ఉపయోగం ఉంది. అదే దైవప్రేమ, దైవ సాయుజ్యం, దైవంలోకి విముక్తి. భూమి మీదనే దివ్య జీవన సాఫల్యం. అంతకు మించిన పూర్ణత్వం ఎక్కడ? అటువంటి జీవితం గడిపేవారు ఇప్పటికీ ఉన్నారు. అది మానవాళి అదృష్టం.
మతం అనే కల్పవృక్షంపై విరిసిన పంచరంగుల పుష్పాలే ఇతిహాస, పురాణాదులు. మతం అనే హోమగుండంలో మెరిసిన అగ్ని శకలాలే యజ్ఞయాగాదులు. ఈ దారిలో మహానీయ ద్రష్టలు ప్రభవించారు. వాటిలోని సంకేతాలు జీర్ణించుకుని, సందేశాల కాంతి పతాకాలను ఎగరవేశారు.
అదే మతంలో ఛాందసవాద విషసర్పాలూ సంచరిస్తుంటాయి. జీవితంలోని సౌందర్యమయ, కవితాత్మక, మహోత్కృష్ట సృజన, వైభవ ప్రాభవాలను అవి కాటు వేస్తాయి. అవి హేతువుకన్నా ప్రమాదకరమైనవి. ఆధ్యాత్మక వృక్షానికి అందే సారాన్ని అవి నాశనం చేస్తుంటాయి.
చిరంతనత్వపు శ్వేత కాంతిధారను కాల మరుభూమిగా మార్చేవి అవే. మతం రక్షణ ఛత్రం కింద దాగినవారు నిర్ణీత భౌతికవాదులు. వారికి కావలసింది భౌతిక సుఖ సామ్రాజ్యం. వారు తమ అజ్ఞాన, ఛాందసవాద నమ్మకాలనుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. మతం చాటున విశృంఖల జీవనం సాగించే కపట ఛాందసుల వ్యర్థ ప్రేలాపనలకన్నా నిజమైన ఆత్మసిద్ధి కోసం నిర్మల జీవనం సాగించేవారి మౌనం గొప్పది. అటువంటివారే నవజీవన నిర్ణేతలు, నవప్రపంచ నిర్మాతలు. వారి వ్యక్తిగత సిద్ధి అందరికీ ముక్తిప్రదం, ముక్తిపథం. వారి ప్రవచనాలు మన జీవితాలను ముంచెత్తే సత్యసుధా ప్రవాహాలు. వారి దివ్య సాన్నిధ్యం ఈ మట్టిలో స్వర్గావతరణకు మౌన భరోసా.
- కె.యజ్ఞన్న
లోకంలో జ్ఞానాన్ని అన్వేషించేవారున్నారు. జ్ఞానం ఆర్జించడంవల్ల ఉపయోగంలేదు అని భావించిన లౌకిక వాదులు అపార సంపదలు, అనంత సుఖాలు అన్వేషిస్తారు. జ్ఞానాన్ని ఆశించే ద్రష్టల చరమ లక్ష్యం ఆనందం... నిత్య ఆనంద స్వరూపమైన భగవంతుడు. భగవంతుడి సాన్నిధ్యంలో, ఆ కాంతిమయ నిశ్శబ్దంలో గడిపేవారికి అంతరంగమే జీవన గీతమవుతుంది. అదే విశ్వజీవన 'గీత'మవుతుంది. మానవాళికి వెలుగు చూపే మంత్ర ధ్యానంగా అది చిరకాలం వినిపిస్తుంటుంది.
హేతువు భౌతికలోక పరిధిలోనే తన అన్వేషణ సాగిస్తుంది. తనకు కనిపించిన సత్యం- భౌతిక జీవనం, భౌతికలోకం మించివుండదు. మతం, దేవుడు, శాశ్వతత్వం, ఆత్మ- ఇవేమీ హేతువుకు అవసరంలేదు. వాటివల్ల ధనం రాదు, భౌతిక సుఖం అసలు దొరకదు. తన ఇంద్రియ దాహాన్ని తీర్చలేనివి, తన ఆకలిని తృప్తిపరచ లేనివి ఏవైనా సరే- నిరుపయోగమైనవి. తినడం, తాగడం, పిల్లల్ని కనడం, మరణించడం- ఈ దశలను దాటి ఉన్నత శిఖరాలు చేరే ప్రసక్తిలేదు. నేలబారు జీవితం కన్నా ఉన్నతమైనది ఏదైనా ఉందా అని కనుగొనడానికి సుదీర్ఘ అన్వేషణ తప్పదు.
జన్మల ఉప్పు సముద్రాలు దాటినవారికి దివ్య జీవన అమృతభాండం లభిస్తుంది. మానవ జీవితానికి అత్యున్నత ఉపయోగం ఉంది. అదే దైవప్రేమ, దైవ సాయుజ్యం, దైవంలోకి విముక్తి. భూమి మీదనే దివ్య జీవన సాఫల్యం. అంతకు మించిన పూర్ణత్వం ఎక్కడ? అటువంటి జీవితం గడిపేవారు ఇప్పటికీ ఉన్నారు. అది మానవాళి అదృష్టం.
మతం అనే కల్పవృక్షంపై విరిసిన పంచరంగుల పుష్పాలే ఇతిహాస, పురాణాదులు. మతం అనే హోమగుండంలో మెరిసిన అగ్ని శకలాలే యజ్ఞయాగాదులు. ఈ దారిలో మహానీయ ద్రష్టలు ప్రభవించారు. వాటిలోని సంకేతాలు జీర్ణించుకుని, సందేశాల కాంతి పతాకాలను ఎగరవేశారు.
అదే మతంలో ఛాందసవాద విషసర్పాలూ సంచరిస్తుంటాయి. జీవితంలోని సౌందర్యమయ, కవితాత్మక, మహోత్కృష్ట సృజన, వైభవ ప్రాభవాలను అవి కాటు వేస్తాయి. అవి హేతువుకన్నా ప్రమాదకరమైనవి. ఆధ్యాత్మక వృక్షానికి అందే సారాన్ని అవి నాశనం చేస్తుంటాయి.
చిరంతనత్వపు శ్వేత కాంతిధారను కాల మరుభూమిగా మార్చేవి అవే. మతం రక్షణ ఛత్రం కింద దాగినవారు నిర్ణీత భౌతికవాదులు. వారికి కావలసింది భౌతిక సుఖ సామ్రాజ్యం. వారు తమ అజ్ఞాన, ఛాందసవాద నమ్మకాలనుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. మతం చాటున విశృంఖల జీవనం సాగించే కపట ఛాందసుల వ్యర్థ ప్రేలాపనలకన్నా నిజమైన ఆత్మసిద్ధి కోసం నిర్మల జీవనం సాగించేవారి మౌనం గొప్పది. అటువంటివారే నవజీవన నిర్ణేతలు, నవప్రపంచ నిర్మాతలు. వారి వ్యక్తిగత సిద్ధి అందరికీ ముక్తిప్రదం, ముక్తిపథం. వారి ప్రవచనాలు మన జీవితాలను ముంచెత్తే సత్యసుధా ప్రవాహాలు. వారి దివ్య సాన్నిధ్యం ఈ మట్టిలో స్వర్గావతరణకు మౌన భరోసా.
- కె.యజ్ఞన్న
ᐅ రథసప్తమి
ᐅ రథసప్తమి
తాను ఉదయించి జగతిని చైతన్యపరచేవాడు, తన స్పర్శతో, ఆరోగ్యాన్నిచ్చేవాడు, గతి తప్పని నిరంతర గమనశీలి, సమయపాలనకు చక్కని నిర్వచనంగా చెప్పదగినవాడు సూర్యభగవానుడు. 'సూర్య' అనే పదానికి 'ప్రేరేపించువాడు' అని అర్థం. చరాచర జగత్తంతా ప్రేరణ పొందేది, తమ తమ కర్తవ్యాలను నిరాటంకంగా నిర్వహించే శక్తిని గ్రహించేదీ సూర్యుడి ఉనికి ప్రత్యక్షంగా ఉన్నప్పుడే. అందుకే సూర్యుణ్ని 'కర్మసాక్షి' అని పిలుస్తారు. ఇతడి జన్మతిథి మాఘశుక్ల సప్తమి. ఈ రోజు ఆకాశంలో నక్షత్రాలు రథాకారం దాల్చుతాయి కాబట్టి దీనికి 'రథసప్తమి' అనే పేరు వచ్చిందని రుగ్వేదంలోని మహాశౌరం చెబుతోంది.
సూర్యుడికీ సప్త(ఏడు) సంఖ్యకూ అవినాభావ సంబంధం ఉంది. అతడి జన్మ తిథి సప్తమి. రథానికి గుర్రాలు ఏడు. పయనించేది సప్తద్వీప పర్యంతం. కిరణాల్లోని కాంతి ఏడు రంగుల సమాహారం. వెలుగులు ప్రసరించేది సప్త సముద్ర పర్యంతం. కాబట్టే సూర్యుణ్ని సప్తలోక ప్రదీపుడిగా వేదాలు, ఉపనిషత్తులు స్తుతిస్తున్నాయి.
'సౌర కుటుంబంలోని అన్ని గ్రహాలకూ సూర్యుడే ఆధారం. స్వయంప్రకాశ శక్తిలేని చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు మొదలైనవన్నీ సూర్యకాంతి వల్లనే ప్రకాశిస్తాయి' అని కృష్ణ యజుర్వేదంలోని ఆరణ్యకాలు చెబుతున్నాయి. జీవుల సృష్టి, స్థితి లయలకు ఆధారం సూర్యుడేనని సూర్యోపనిషత్ చెబుతోంది. విజ్ఞాన శాస్త్రదృష్టితో చూసినా ఈ మాట నిజమేనని రుజువవుతుంది. సూర్యుడి చుట్టూ నిరంతరం అనేక గ్రహాలు పరిభ్రమిస్తూంటాయి. వాటిలో ప్రాణి పుట్టుకకు, ఉనికికి ఆధారమైన నీరు ఉన్నది భూగ్రహం మీదే. ఆ నీటినుంచే ప్రాణికోటి ఆవిర్భావం జరిగిందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల సృష్టికి ఆధారం సూర్యడేనని తెలుస్తోంది.
కాలగణనలో ఒక్కొక్క మనువు పేరుతో, ఒక్కొక్క మన్వంతరం ఉంది. వాటిలో ముఖ్యమైనది, ప్రస్తుతం జరుగుతున్నది- వైవస్వత మన్వంతరం. ఈ పేరుకు మూలాధారుడైన వైవస్వతమనువు, వివస్వంతు (సూర్యు)ని కుమారుడే. తండ్రి జన్మదినమైన రథసప్తమినాడే ఈ మన్వంతరం మొదలై అమలులోకి వచ్చిందని శాస్త్రాలు చెబుతున్నాయి.
ప్రత్యక్షంగాగాని, పరోక్షంగాగాని సూర్యుడి వల్లనే జీవజాలమంతా ఆరోగ్యం పొందుతోంది. సూర్యుడి లేత ఎండ కిరణాలు శరీరాన్ని తాకితే తేజస్సు పెరుగుతుందని ఆయుర్వేదం చెబుతోంది. అందుకోసమే ప్రతిరోజు ఆదిత్య హృదయం పఠించడం, సంధ్యావందనం ఆచరించడం, సూర్యనమస్కారాలు చేయడం, అర్ఘ్య ప్రదానం ఇవ్వడం లాంటివి సూర్యుడి ఎదురుగా నిలబడి చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఏదో మిషతో నీరెండలో నిలబడటం ఆరోగ్యప్రదమంటున్న విజ్ఞాన శాస్త్రం ఈ విషయాన్నే బలపరుస్తోంది. విదేశీయులు సైతం సూర్య స్నానం పేరుతో నీరెండలో నిలబడటంలోని ఆంతర్యం ఇదే.
రథసప్తమినాడు ఆచరించే అనేక కర్మల్లోని మర్మం ఆరోగ్యాన్ని ఇసుమడింపజేయడమే. వాటిలో మొదటిది- రేగు (పండుగాని, ఆకుగాని), జిల్లేడు ఆకులు కలిపి తలమీద పెట్టుకుని స్నానం చేయడం. ఈ రెండింటికీ సూర్యుడి కిరణాల్లోని ఆరోగ్య కారక లక్షణాలను, శక్తిని గ్రహించి శరీరానికి అందించే గుణం ఉందని ఆయుర్వేదం చెబుతోంది. ప్రతిరోజూ అలా స్నానం చేయడం మంచిదే. అది అందరికీ సాధ్యంకాదు కాబట్టి అర్క (సూర్యుని) జయంతి నాడు అర్క (జిల్లేడు) పత్రం శిరస్సు మీద ధరిస్తే శుభ ఫలితాలుంటాయని వైదిక వచనం. రెండో కర్మ- పాయసాన్న నివేదన. ఈ రోజు కొత్త బియ్యం, కొత్త బెల్లం కలిపి సూర్య కిరణాలు ప్రసరించే ప్రదేశంలో ఆవుపాలతో పాయసం వండుతారు. దాన్ని చిక్కుడు ఆకుల మీద ఉంచి సూర్యుడికి నివేదన చేస్తారు. ఆపై ప్రసాదంగా స్వీకరిస్తారు. రథసప్తమి నాటి సూర్య కిరణాల్లో ఉన్నశక్తి ఆ పాయసంలో చేరి, ఔషధగుణాలు కలిగిన చిక్కుడాకులతో జరిగిన రసాయనిక చర్యవల్ల ఆ ప్రసాదం స్వీకరించినవారి ఆరోగ్యం బాగుంటుందని చెబుతారు. మూడోది- సూర్యుణ్ని స్తుతించే 'అరుణం' మహాశౌరం పఠించడం వంటివి చేయడంవల్ల ఆ ధ్వనితరంగాలు పరిసరాల్లో వ్యాప్తిచెంది ఆ ప్రదేశమంతా ఆరోగ్య వాతావరణం కలిగి ఉంటుందనేది పూర్వాచారపరాయణుల భావన.
వేద విహితమైన గాయత్రీ మంత్రం, రుగ్వేదంలోని మహాశౌరం పేరిట రుక్కులు, వాల్మీకి రామాయణంలో ఆదిత్య హృదయం, భారత భాగవతాల్లోని సూర్యస్తుతులు... ఇవన్నీ సూర్యుడి గొప్పతనాన్ని, మహిమలను చాటుతున్నాయి.
నవగ్రహాల్లో అగ్రస్థానం సూర్యుడిదే. దేశాలు, ప్రాంతాలు, ఆచారాలు, ఆరాధన విధానాలు... వేరుగా ఉన్నా- చాలా దేశాలవారు దేవుడని నమ్మేది, ఒప్పుకొనేది, ఆరాధించేది సూర్యుణ్నే. దేవుడనే పేరుతో కాకున్నా అతి ప్రాచీన కాలంనుంచి ప్రపంచంలో అనేక తెగలు, జాతులు, సూర్యుణ్ని ఆరాధిస్తున్నట్లు, ఉపాసిస్తున్నట్లు చారిత్రక ఆధారాలున్నాయి.
- అయ్యగారి శ్రీనివాసరావు
తాను ఉదయించి జగతిని చైతన్యపరచేవాడు, తన స్పర్శతో, ఆరోగ్యాన్నిచ్చేవాడు, గతి తప్పని నిరంతర గమనశీలి, సమయపాలనకు చక్కని నిర్వచనంగా చెప్పదగినవాడు సూర్యభగవానుడు. 'సూర్య' అనే పదానికి 'ప్రేరేపించువాడు' అని అర్థం. చరాచర జగత్తంతా ప్రేరణ పొందేది, తమ తమ కర్తవ్యాలను నిరాటంకంగా నిర్వహించే శక్తిని గ్రహించేదీ సూర్యుడి ఉనికి ప్రత్యక్షంగా ఉన్నప్పుడే. అందుకే సూర్యుణ్ని 'కర్మసాక్షి' అని పిలుస్తారు. ఇతడి జన్మతిథి మాఘశుక్ల సప్తమి. ఈ రోజు ఆకాశంలో నక్షత్రాలు రథాకారం దాల్చుతాయి కాబట్టి దీనికి 'రథసప్తమి' అనే పేరు వచ్చిందని రుగ్వేదంలోని మహాశౌరం చెబుతోంది.
సూర్యుడికీ సప్త(ఏడు) సంఖ్యకూ అవినాభావ సంబంధం ఉంది. అతడి జన్మ తిథి సప్తమి. రథానికి గుర్రాలు ఏడు. పయనించేది సప్తద్వీప పర్యంతం. కిరణాల్లోని కాంతి ఏడు రంగుల సమాహారం. వెలుగులు ప్రసరించేది సప్త సముద్ర పర్యంతం. కాబట్టే సూర్యుణ్ని సప్తలోక ప్రదీపుడిగా వేదాలు, ఉపనిషత్తులు స్తుతిస్తున్నాయి.
'సౌర కుటుంబంలోని అన్ని గ్రహాలకూ సూర్యుడే ఆధారం. స్వయంప్రకాశ శక్తిలేని చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు మొదలైనవన్నీ సూర్యకాంతి వల్లనే ప్రకాశిస్తాయి' అని కృష్ణ యజుర్వేదంలోని ఆరణ్యకాలు చెబుతున్నాయి. జీవుల సృష్టి, స్థితి లయలకు ఆధారం సూర్యుడేనని సూర్యోపనిషత్ చెబుతోంది. విజ్ఞాన శాస్త్రదృష్టితో చూసినా ఈ మాట నిజమేనని రుజువవుతుంది. సూర్యుడి చుట్టూ నిరంతరం అనేక గ్రహాలు పరిభ్రమిస్తూంటాయి. వాటిలో ప్రాణి పుట్టుకకు, ఉనికికి ఆధారమైన నీరు ఉన్నది భూగ్రహం మీదే. ఆ నీటినుంచే ప్రాణికోటి ఆవిర్భావం జరిగిందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల సృష్టికి ఆధారం సూర్యడేనని తెలుస్తోంది.
కాలగణనలో ఒక్కొక్క మనువు పేరుతో, ఒక్కొక్క మన్వంతరం ఉంది. వాటిలో ముఖ్యమైనది, ప్రస్తుతం జరుగుతున్నది- వైవస్వత మన్వంతరం. ఈ పేరుకు మూలాధారుడైన వైవస్వతమనువు, వివస్వంతు (సూర్యు)ని కుమారుడే. తండ్రి జన్మదినమైన రథసప్తమినాడే ఈ మన్వంతరం మొదలై అమలులోకి వచ్చిందని శాస్త్రాలు చెబుతున్నాయి.
ప్రత్యక్షంగాగాని, పరోక్షంగాగాని సూర్యుడి వల్లనే జీవజాలమంతా ఆరోగ్యం పొందుతోంది. సూర్యుడి లేత ఎండ కిరణాలు శరీరాన్ని తాకితే తేజస్సు పెరుగుతుందని ఆయుర్వేదం చెబుతోంది. అందుకోసమే ప్రతిరోజు ఆదిత్య హృదయం పఠించడం, సంధ్యావందనం ఆచరించడం, సూర్యనమస్కారాలు చేయడం, అర్ఘ్య ప్రదానం ఇవ్వడం లాంటివి సూర్యుడి ఎదురుగా నిలబడి చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఏదో మిషతో నీరెండలో నిలబడటం ఆరోగ్యప్రదమంటున్న విజ్ఞాన శాస్త్రం ఈ విషయాన్నే బలపరుస్తోంది. విదేశీయులు సైతం సూర్య స్నానం పేరుతో నీరెండలో నిలబడటంలోని ఆంతర్యం ఇదే.
రథసప్తమినాడు ఆచరించే అనేక కర్మల్లోని మర్మం ఆరోగ్యాన్ని ఇసుమడింపజేయడమే. వాటిలో మొదటిది- రేగు (పండుగాని, ఆకుగాని), జిల్లేడు ఆకులు కలిపి తలమీద పెట్టుకుని స్నానం చేయడం. ఈ రెండింటికీ సూర్యుడి కిరణాల్లోని ఆరోగ్య కారక లక్షణాలను, శక్తిని గ్రహించి శరీరానికి అందించే గుణం ఉందని ఆయుర్వేదం చెబుతోంది. ప్రతిరోజూ అలా స్నానం చేయడం మంచిదే. అది అందరికీ సాధ్యంకాదు కాబట్టి అర్క (సూర్యుని) జయంతి నాడు అర్క (జిల్లేడు) పత్రం శిరస్సు మీద ధరిస్తే శుభ ఫలితాలుంటాయని వైదిక వచనం. రెండో కర్మ- పాయసాన్న నివేదన. ఈ రోజు కొత్త బియ్యం, కొత్త బెల్లం కలిపి సూర్య కిరణాలు ప్రసరించే ప్రదేశంలో ఆవుపాలతో పాయసం వండుతారు. దాన్ని చిక్కుడు ఆకుల మీద ఉంచి సూర్యుడికి నివేదన చేస్తారు. ఆపై ప్రసాదంగా స్వీకరిస్తారు. రథసప్తమి నాటి సూర్య కిరణాల్లో ఉన్నశక్తి ఆ పాయసంలో చేరి, ఔషధగుణాలు కలిగిన చిక్కుడాకులతో జరిగిన రసాయనిక చర్యవల్ల ఆ ప్రసాదం స్వీకరించినవారి ఆరోగ్యం బాగుంటుందని చెబుతారు. మూడోది- సూర్యుణ్ని స్తుతించే 'అరుణం' మహాశౌరం పఠించడం వంటివి చేయడంవల్ల ఆ ధ్వనితరంగాలు పరిసరాల్లో వ్యాప్తిచెంది ఆ ప్రదేశమంతా ఆరోగ్య వాతావరణం కలిగి ఉంటుందనేది పూర్వాచారపరాయణుల భావన.
వేద విహితమైన గాయత్రీ మంత్రం, రుగ్వేదంలోని మహాశౌరం పేరిట రుక్కులు, వాల్మీకి రామాయణంలో ఆదిత్య హృదయం, భారత భాగవతాల్లోని సూర్యస్తుతులు... ఇవన్నీ సూర్యుడి గొప్పతనాన్ని, మహిమలను చాటుతున్నాయి.
నవగ్రహాల్లో అగ్రస్థానం సూర్యుడిదే. దేశాలు, ప్రాంతాలు, ఆచారాలు, ఆరాధన విధానాలు... వేరుగా ఉన్నా- చాలా దేశాలవారు దేవుడని నమ్మేది, ఒప్పుకొనేది, ఆరాధించేది సూర్యుణ్నే. దేవుడనే పేరుతో కాకున్నా అతి ప్రాచీన కాలంనుంచి ప్రపంచంలో అనేక తెగలు, జాతులు, సూర్యుణ్ని ఆరాధిస్తున్నట్లు, ఉపాసిస్తున్నట్లు చారిత్రక ఆధారాలున్నాయి.
- అయ్యగారి శ్రీనివాసరావు
ᐅ సమదృష్టి
ᐅ సమదృష్టి
సమస్త జీవులు సుఖంగా బతకాలన్నది ఉపనిషత్ వాక్యం. భగవంతుడి దృష్టిలో జీవులందరూ సమానమే. ఆయన జీవులందరి పట్ల సమభావనతో వ్యవహరించి పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశాన్ని ఈ చరాచర సృష్టికి అందజేశాడు. అంటే సమదృష్టి భగవంతునికెంతో ప్రీతికరమైనదని అర్థమవుతోంది.
పురాణ పురుషులందరూ కులమతాలతో సంబంధం లేకుండా, పేద, గొప్ప భేదం పాటించకుండా తోటివారితో చెలిమిచేసి వారికి సహాయపడుతూ ముల్లోకాలకు ఆదర్శంగా నిలిచారు.
ఆటవిక జాతికి చెందిన శబరి భక్తితో, ప్రేమతో ఇచ్చిన ఎంగిలిపండ్లను శ్రీరాముడు నిండుమనసుతో స్వీకరించాడు. పేదరికంలో మగ్గుతున్న స్నేహితుడు కుచేలుణ్ని ఆదరించి, అభిమానించి సకల సంపదలు ప్రసాదించి శ్రీకృష్ణుడు తన గొప్పతనాన్ని లోకానికి చాటాడు.
ఈ సృష్టిలో అంతటా ఈశ్వరుడు ఉన్నాడు. అన్ని ప్రాణుల్లో ఉన్న ఆత్మ ఒక్కటే అని వేదాంతం ఘోషిస్తోంది.
సమదృష్టికి ప్రత్యక్ష నిదర్శనం ప్రకృతి.
ఎలాంటి తారతమ్య భావం చూపించకుండా ఫలసంపదతో ఉన్న పచ్చని వృక్షాలు అన్ని జీవులకు ఫలాలను అందిస్తున్నాయి. నదులు ప్రాణికోటికి జలధారలు సమకూర్చి దాహార్తి తీరుస్తున్నాయి.
ఆలోచనా పరిజ్ఞానం, మేధ కలిగిన మనిషి మాత్రం సమదృష్టితో వ్యవహరించక సమాజాన్ని అల్లకల్లోలం చేస్తున్నాడు. స్వలాభం కోసం ప్రాంతాలను, మతాలను, కులాలను అపహాస్యం చేస్తూ అలజడి సృష్టిస్తున్నాడు. ఇది కాదు సంస్కృతి!
భారతీయ వేద వాఞ్మయం జీవులందరూ సర్వసమభావనతో మెలగాలని ఉపదేశిస్తోంది. మనిషిని మనిషిగా గౌరవించే సంప్రదాయాన్ని ప్రతి ఒక్కరూ అలవరచుకోవాలి. అప్పుడే మనిషి విశ్వమానవుడుగా అందరి హృదయాల్లో నిలిచిపోతాడు.
మనలో కొంతమంది అంగవైకల్యం కలిగినవారిని హేళనచేస్తూ వాళ్ళ వైకల్యాన్ని వేలెత్తి చూపిస్తుంటారు.
ఈ రకమైన మనోవైకల్యం ఉన్నవాళ్ళు సంఘంలో మంచి మనుషులుగా ఎదగలేరు. వీళ్ళు సమదృష్టితో అందరినీ ఆదరించడం నేర్చుకోవాలి. ఈ ప్రపంచంలో అందరూ ఆ భగవంతుడి ప్రతిరూపాలే. అలాంటప్పుడు తోటి మనిషిని వేలెత్తి చూపించడమెందుకు?
బిథోవెన్ బధిరుడైనా మంచి సంగీత విద్వాంసుడు కాగలిగాడు. హెలెన్ కెల్లర్ చెవిటితనం, గుడ్డితనం తదనంతరం మూగతనం కూడా ఏర్పడినా జీవితాంతం బధిరులకు, అంధులకు సేవచేసి చరిత్ర సృష్టించింది. లూయీ బ్రెయిలీకి తన మూడో ఏటే అంధత్వం ఏర్పడింది. అయితేనేం- పదో పాఠశాలకు వెళ్ళి అంధులకొక లిపిని కనిపెట్టాడు. వీరందరూ ఆ భగవంతుని బిడ్డలే.
లోకకల్యాణంకోసం పాటుపడే ఎవరైనా ఏ ఒక్కరినీ వేలెత్తి చూపించి, హింసించరు. అందర్నీ ప్రేమిస్తారు. ప్రజల మనిషిగా ఎదిగి నవసమాజ నిర్మాణంలో పాలుపంచుకుంటారు.
ద్వేషం ద్వేషాన్ని పెంచుతుంది. ప్రేమ ప్రేమను జయిస్తుంది. సాటి మనిషిలో అందరూ భగవంతుణ్నే చూడాలి. సర్వభూతాల్లోనూ తనను చూసేవాడు తనకు అత్యంత ప్రీతిపాత్రుడని గీతాకారుడు చెప్పాడు.
ఏ మనిషి గొప్పతనమైనా అతడి సమదృష్టిలోను, స్వభావంలోను తెలుస్తుంది. అంతేతప్ప- అతడి సంపదలో కాదు. వివేకానందుడు సాటిమనిషిని నారాయణుడిగా భావించాలని సందేశమిచ్చాడు.
సేవే లక్ష్యంగా చేసుకుని సర్వసమభావనతో రామకృష్ణులవారు మఠాన్ని స్థాపించారు. మదర్థెరెసా కులమత విచక్షణ లేకుండా మమత, మానవత, సేవాధర్మాలను మేళవించి అందరికీ మాతృమూర్తిగా మారింది.
- విశ్వనాధ రమ
సమస్త జీవులు సుఖంగా బతకాలన్నది ఉపనిషత్ వాక్యం. భగవంతుడి దృష్టిలో జీవులందరూ సమానమే. ఆయన జీవులందరి పట్ల సమభావనతో వ్యవహరించి పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశాన్ని ఈ చరాచర సృష్టికి అందజేశాడు. అంటే సమదృష్టి భగవంతునికెంతో ప్రీతికరమైనదని అర్థమవుతోంది.
పురాణ పురుషులందరూ కులమతాలతో సంబంధం లేకుండా, పేద, గొప్ప భేదం పాటించకుండా తోటివారితో చెలిమిచేసి వారికి సహాయపడుతూ ముల్లోకాలకు ఆదర్శంగా నిలిచారు.
ఆటవిక జాతికి చెందిన శబరి భక్తితో, ప్రేమతో ఇచ్చిన ఎంగిలిపండ్లను శ్రీరాముడు నిండుమనసుతో స్వీకరించాడు. పేదరికంలో మగ్గుతున్న స్నేహితుడు కుచేలుణ్ని ఆదరించి, అభిమానించి సకల సంపదలు ప్రసాదించి శ్రీకృష్ణుడు తన గొప్పతనాన్ని లోకానికి చాటాడు.
ఈ సృష్టిలో అంతటా ఈశ్వరుడు ఉన్నాడు. అన్ని ప్రాణుల్లో ఉన్న ఆత్మ ఒక్కటే అని వేదాంతం ఘోషిస్తోంది.
సమదృష్టికి ప్రత్యక్ష నిదర్శనం ప్రకృతి.
ఎలాంటి తారతమ్య భావం చూపించకుండా ఫలసంపదతో ఉన్న పచ్చని వృక్షాలు అన్ని జీవులకు ఫలాలను అందిస్తున్నాయి. నదులు ప్రాణికోటికి జలధారలు సమకూర్చి దాహార్తి తీరుస్తున్నాయి.
ఆలోచనా పరిజ్ఞానం, మేధ కలిగిన మనిషి మాత్రం సమదృష్టితో వ్యవహరించక సమాజాన్ని అల్లకల్లోలం చేస్తున్నాడు. స్వలాభం కోసం ప్రాంతాలను, మతాలను, కులాలను అపహాస్యం చేస్తూ అలజడి సృష్టిస్తున్నాడు. ఇది కాదు సంస్కృతి!
భారతీయ వేద వాఞ్మయం జీవులందరూ సర్వసమభావనతో మెలగాలని ఉపదేశిస్తోంది. మనిషిని మనిషిగా గౌరవించే సంప్రదాయాన్ని ప్రతి ఒక్కరూ అలవరచుకోవాలి. అప్పుడే మనిషి విశ్వమానవుడుగా అందరి హృదయాల్లో నిలిచిపోతాడు.
మనలో కొంతమంది అంగవైకల్యం కలిగినవారిని హేళనచేస్తూ వాళ్ళ వైకల్యాన్ని వేలెత్తి చూపిస్తుంటారు.
ఈ రకమైన మనోవైకల్యం ఉన్నవాళ్ళు సంఘంలో మంచి మనుషులుగా ఎదగలేరు. వీళ్ళు సమదృష్టితో అందరినీ ఆదరించడం నేర్చుకోవాలి. ఈ ప్రపంచంలో అందరూ ఆ భగవంతుడి ప్రతిరూపాలే. అలాంటప్పుడు తోటి మనిషిని వేలెత్తి చూపించడమెందుకు?
బిథోవెన్ బధిరుడైనా మంచి సంగీత విద్వాంసుడు కాగలిగాడు. హెలెన్ కెల్లర్ చెవిటితనం, గుడ్డితనం తదనంతరం మూగతనం కూడా ఏర్పడినా జీవితాంతం బధిరులకు, అంధులకు సేవచేసి చరిత్ర సృష్టించింది. లూయీ బ్రెయిలీకి తన మూడో ఏటే అంధత్వం ఏర్పడింది. అయితేనేం- పదో పాఠశాలకు వెళ్ళి అంధులకొక లిపిని కనిపెట్టాడు. వీరందరూ ఆ భగవంతుని బిడ్డలే.
లోకకల్యాణంకోసం పాటుపడే ఎవరైనా ఏ ఒక్కరినీ వేలెత్తి చూపించి, హింసించరు. అందర్నీ ప్రేమిస్తారు. ప్రజల మనిషిగా ఎదిగి నవసమాజ నిర్మాణంలో పాలుపంచుకుంటారు.
ద్వేషం ద్వేషాన్ని పెంచుతుంది. ప్రేమ ప్రేమను జయిస్తుంది. సాటి మనిషిలో అందరూ భగవంతుణ్నే చూడాలి. సర్వభూతాల్లోనూ తనను చూసేవాడు తనకు అత్యంత ప్రీతిపాత్రుడని గీతాకారుడు చెప్పాడు.
ఏ మనిషి గొప్పతనమైనా అతడి సమదృష్టిలోను, స్వభావంలోను తెలుస్తుంది. అంతేతప్ప- అతడి సంపదలో కాదు. వివేకానందుడు సాటిమనిషిని నారాయణుడిగా భావించాలని సందేశమిచ్చాడు.
సేవే లక్ష్యంగా చేసుకుని సర్వసమభావనతో రామకృష్ణులవారు మఠాన్ని స్థాపించారు. మదర్థెరెసా కులమత విచక్షణ లేకుండా మమత, మానవత, సేవాధర్మాలను మేళవించి అందరికీ మాతృమూర్తిగా మారింది.
- విశ్వనాధ రమ
ᐅ నాగోబా జాతర
ᐅ నాగోబా జాతర
ప్రకృతిలో దైవత్వాన్ని దర్శించడం మన సంప్రదాయం. ఈ విధానం శిష్ట సంస్కృతిలోనే కాదు, జానపదుల్లో, గిరిజనుల్లో కూడా అనాదిగా కొనసాగుతోంది. వైదిక ఆచారాల్లో సర్పారాధనకు విశేష ప్రాముఖ్యం ఉంది. గిరిజనులు సర్పాన్ని సస్యరక్షణ దేవతగా ఆరాధిస్తారు. ఆరోగ్యం, శాంతి సౌఖ్యాలు, సిరిసంపదలు ప్రసాదించే దైవంగా సర్పాన్ని గిరిజనులు పూజిస్తారు. నాగదేవత తమను కాపాడుతున్నందుకు కృతజ్ఞతగా గిరిజనులు ఏటా నాగోబా జాతరను నిర్వహించుకుంటారు. గోండు తెగకు చెందిన గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబా. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో పుష్య బహుళ అమావాస్యనుంచి అయిదు రోజులపాటు జాతర జరుగుతుంది. సమ్మక్క-సారలమ్మ జాతర తరవాత గిరిజనులు భారీసంఖ్యలో పాల్గొనే జాతర ఇది.
జాతరలో 'మెస్రం' అనే గోండు తెగ వంశీయులకు ప్రముఖ పాత్ర ఉంటుంది. ఈ జాతర నిర్వహణకు నేపథ్యంగా ఓ కథ ప్రచారంలో ఉంది- మెస్రం వంశానికి చెందిన నాగాయిమోతి అనే రాణికి నాగేంద్రుడు సర్పరూపంలో కుమారుడిగా జన్మించాడని చెబుతారు. తన మేనకోడలైన గౌరితో నాగేంద్రుడికి రాణి వివాహం జరిపిస్తుంది. సర్పాకృతిలో ఉన్న తన భర్తను ఓ బుట్టలో పెట్టుకుని, గౌరి గోదావరి స్నానానికి వెళ్తుంది. పవిత్ర గోదావరి జలప్రభావంవల్ల నాగేంద్రుడు మనిషి రూపంలోకి మారాడని చెబుతారు. గౌరి ఆశ్చర్యంతో తన భర్తను తాకగానే తిరిగి నాగేంద్రుడు సర్పరూపంలోకి మారిపోయాడంటారు. దాంతో గౌరి ఆవేదనతో గోదావరిలోని సత్యవతి గుండంలో కలిసిపోయిందంటారు. గిరిజనుల వంశాన జన్మించిన తాను, వారిని సదా సంరక్షిస్తానని నాగేంద్రుడు అభయమిచ్చాడని చెబుతారు. వివాహం అయిన ప్రతి జంటా తన సమక్షంలో భేటీ అయి దీవెనలు పొందాలని నాగేంద్రుడు ఆదేశించి, కేస్లాపూర్ గుట్టల్లోకి వెళ్లి అదృశ్యమయ్యాడంటారు. ఆ ప్రదేశంలోనే నాగేంద్రుణ్ని నాగోబాగా భక్తులు ఇప్పటికీ ఆరాధించుకుంటున్నారు. జాతర ప్రారంభానికి ముందు కేస్లాపూర్ గ్రామానికి 80కిలోమీటర్ల దూరంలో ఉన్న కలమడుగు గోదావరి రేవు నుంచి మెస్రం వంశీయులు కొత్త కుండలతో నీళ్లు సేకరిస్తారు. ఇంద్రవెల్లిలోని ఇంద్రాయి దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. నాగోబా ఆలయానికి చేరుకున్నాక, ప్రాంగణంలోని మర్రిచెట్టు కొమ్మలకు నీటికుండల్ని కట్టి ఉంచుతారు. పుష్య బహుళ అమావాస్య నుంచి అయిదు రోజులపాటు ప్రతి నిత్యం ఆ జలాలతో నాగోబాను అభిషేకిస్తారు. సిరికొండ నుంచి తీసుకొచ్చిన 116 మట్టికుండల్ని వరసగా పేర్చి, పసుపు కుంకుమలతో వాటిని శుద్ధి చేస్తారు. గిరిజన స్త్రీలు ఆలయ ప్రాంగణంలో పడమర దిక్కున ఉన్న పాతాళగంగను ఆ కుండలతో నింపుతారు. గత సంవత్సరం నిర్మించిన మట్టిపుట్టల్ని ఆ నీటితో తొలగించి వాటి స్థానంలో కొత్తగా ఏడు మట్టిపుట్టల్ని నిర్మిస్తారు. వాటిపై సర్పాకృతుల్ని ఉంచుతారు. ఆవుపాలు, నవధాన్యాల్ని పుట్టలకు నివేదన చేస్తారు. ఆలయంలో అయిదు పడగలతో ఉన్న నాగోబా విగ్రహాన్ని గిరిజన సంప్రదాయాల ప్రకారం అలంకరిస్తారు. జొన్నలు, మొక్కజొన్నలతో తయారుచేసిన గటక, అంబలిని నాగోబాకు నైవేద్యంగా సమర్పిస్తారు. నాగోబా సమక్షంలో కొత్త దంపతులకు భేటింగ్ (భేటీ) నిర్వహిస్తారు. 'తూమ్' పేరిట పితృదేవతలకు ఆరాధన చేసి, వారి ఆత్మశాంతి కోసం దీపాల్ని వెలిగిస్తారు.
మెస్రం వంశీయుల్లో 22 విభాగాలు ఉన్నాయి. ఎంతమంది మెస్రం వంశీయులు జాతరకు హాజరైనా గోవడ (వర్తులాకారంలో గోడకట్టిన ప్రాంతం)లోని 22 పొయ్యిలపైనే వంట చేసుకుంటారు. నవధాన్యాలతో కలిపి వండిన పదార్థాన్ని నాగోబాకు సమర్పించి, అనంతరం దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. డోలు, కిక్రీ వంటి వాయిద్యాలతో గిరిజనులు భక్తిపారవశ్యంతో నృత్యాలు చేస్తారు. జాతర చివరి రోజున దర్బార్ నిర్వహిస్తారు. 1946లో ప్రముఖ మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ ఈ ఆనవాయితీని ప్రారంభించారు. నాగోబా చెంత గిరిజనులు తాము ఎదుర్కొనే సమస్యల్ని పాలకుల దృష్టికి తీసుకు వెళ్లడానికి ఈ దర్బార్ ఉపకరిస్తుంది. గిరిజనుల జీవనశైలికీ, ఆచార వ్యవహారాలకు, సమష్టి తత్వానికి నాగోబా జాతర అద్దం పడుతుంది.
- డాక్టర్ కావూరి రాజేశ్ పటేల్
ప్రకృతిలో దైవత్వాన్ని దర్శించడం మన సంప్రదాయం. ఈ విధానం శిష్ట సంస్కృతిలోనే కాదు, జానపదుల్లో, గిరిజనుల్లో కూడా అనాదిగా కొనసాగుతోంది. వైదిక ఆచారాల్లో సర్పారాధనకు విశేష ప్రాముఖ్యం ఉంది. గిరిజనులు సర్పాన్ని సస్యరక్షణ దేవతగా ఆరాధిస్తారు. ఆరోగ్యం, శాంతి సౌఖ్యాలు, సిరిసంపదలు ప్రసాదించే దైవంగా సర్పాన్ని గిరిజనులు పూజిస్తారు. నాగదేవత తమను కాపాడుతున్నందుకు కృతజ్ఞతగా గిరిజనులు ఏటా నాగోబా జాతరను నిర్వహించుకుంటారు. గోండు తెగకు చెందిన గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబా. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో పుష్య బహుళ అమావాస్యనుంచి అయిదు రోజులపాటు జాతర జరుగుతుంది. సమ్మక్క-సారలమ్మ జాతర తరవాత గిరిజనులు భారీసంఖ్యలో పాల్గొనే జాతర ఇది.
జాతరలో 'మెస్రం' అనే గోండు తెగ వంశీయులకు ప్రముఖ పాత్ర ఉంటుంది. ఈ జాతర నిర్వహణకు నేపథ్యంగా ఓ కథ ప్రచారంలో ఉంది- మెస్రం వంశానికి చెందిన నాగాయిమోతి అనే రాణికి నాగేంద్రుడు సర్పరూపంలో కుమారుడిగా జన్మించాడని చెబుతారు. తన మేనకోడలైన గౌరితో నాగేంద్రుడికి రాణి వివాహం జరిపిస్తుంది. సర్పాకృతిలో ఉన్న తన భర్తను ఓ బుట్టలో పెట్టుకుని, గౌరి గోదావరి స్నానానికి వెళ్తుంది. పవిత్ర గోదావరి జలప్రభావంవల్ల నాగేంద్రుడు మనిషి రూపంలోకి మారాడని చెబుతారు. గౌరి ఆశ్చర్యంతో తన భర్తను తాకగానే తిరిగి నాగేంద్రుడు సర్పరూపంలోకి మారిపోయాడంటారు. దాంతో గౌరి ఆవేదనతో గోదావరిలోని సత్యవతి గుండంలో కలిసిపోయిందంటారు. గిరిజనుల వంశాన జన్మించిన తాను, వారిని సదా సంరక్షిస్తానని నాగేంద్రుడు అభయమిచ్చాడని చెబుతారు. వివాహం అయిన ప్రతి జంటా తన సమక్షంలో భేటీ అయి దీవెనలు పొందాలని నాగేంద్రుడు ఆదేశించి, కేస్లాపూర్ గుట్టల్లోకి వెళ్లి అదృశ్యమయ్యాడంటారు. ఆ ప్రదేశంలోనే నాగేంద్రుణ్ని నాగోబాగా భక్తులు ఇప్పటికీ ఆరాధించుకుంటున్నారు. జాతర ప్రారంభానికి ముందు కేస్లాపూర్ గ్రామానికి 80కిలోమీటర్ల దూరంలో ఉన్న కలమడుగు గోదావరి రేవు నుంచి మెస్రం వంశీయులు కొత్త కుండలతో నీళ్లు సేకరిస్తారు. ఇంద్రవెల్లిలోని ఇంద్రాయి దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. నాగోబా ఆలయానికి చేరుకున్నాక, ప్రాంగణంలోని మర్రిచెట్టు కొమ్మలకు నీటికుండల్ని కట్టి ఉంచుతారు. పుష్య బహుళ అమావాస్య నుంచి అయిదు రోజులపాటు ప్రతి నిత్యం ఆ జలాలతో నాగోబాను అభిషేకిస్తారు. సిరికొండ నుంచి తీసుకొచ్చిన 116 మట్టికుండల్ని వరసగా పేర్చి, పసుపు కుంకుమలతో వాటిని శుద్ధి చేస్తారు. గిరిజన స్త్రీలు ఆలయ ప్రాంగణంలో పడమర దిక్కున ఉన్న పాతాళగంగను ఆ కుండలతో నింపుతారు. గత సంవత్సరం నిర్మించిన మట్టిపుట్టల్ని ఆ నీటితో తొలగించి వాటి స్థానంలో కొత్తగా ఏడు మట్టిపుట్టల్ని నిర్మిస్తారు. వాటిపై సర్పాకృతుల్ని ఉంచుతారు. ఆవుపాలు, నవధాన్యాల్ని పుట్టలకు నివేదన చేస్తారు. ఆలయంలో అయిదు పడగలతో ఉన్న నాగోబా విగ్రహాన్ని గిరిజన సంప్రదాయాల ప్రకారం అలంకరిస్తారు. జొన్నలు, మొక్కజొన్నలతో తయారుచేసిన గటక, అంబలిని నాగోబాకు నైవేద్యంగా సమర్పిస్తారు. నాగోబా సమక్షంలో కొత్త దంపతులకు భేటింగ్ (భేటీ) నిర్వహిస్తారు. 'తూమ్' పేరిట పితృదేవతలకు ఆరాధన చేసి, వారి ఆత్మశాంతి కోసం దీపాల్ని వెలిగిస్తారు.
మెస్రం వంశీయుల్లో 22 విభాగాలు ఉన్నాయి. ఎంతమంది మెస్రం వంశీయులు జాతరకు హాజరైనా గోవడ (వర్తులాకారంలో గోడకట్టిన ప్రాంతం)లోని 22 పొయ్యిలపైనే వంట చేసుకుంటారు. నవధాన్యాలతో కలిపి వండిన పదార్థాన్ని నాగోబాకు సమర్పించి, అనంతరం దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. డోలు, కిక్రీ వంటి వాయిద్యాలతో గిరిజనులు భక్తిపారవశ్యంతో నృత్యాలు చేస్తారు. జాతర చివరి రోజున దర్బార్ నిర్వహిస్తారు. 1946లో ప్రముఖ మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ ఈ ఆనవాయితీని ప్రారంభించారు. నాగోబా చెంత గిరిజనులు తాము ఎదుర్కొనే సమస్యల్ని పాలకుల దృష్టికి తీసుకు వెళ్లడానికి ఈ దర్బార్ ఉపకరిస్తుంది. గిరిజనుల జీవనశైలికీ, ఆచార వ్యవహారాలకు, సమష్టి తత్వానికి నాగోబా జాతర అద్దం పడుతుంది.
- డాక్టర్ కావూరి రాజేశ్ పటేల్
ᐅ ప్రేమే దైవం
ᐅ ప్రేమే దైవం
'ప్రేమ కన్నను ఎక్కువేముందిరా ఎల్లకామ్య పదవుల కన్న ప్రేమ ఎక్కువరా' అన్నాడు భావకవి. 'ప్రేమ కలుగక బ్రతుకు చీకటి' అన్నాడు గురజాడ. 'మనం ఆశించాల్సింది, అనుభవించేది, ఆనందించేది ప్రేమ మాత్రమే. పరితపించేది ప్రేమ కోసమే' అనేవారు సత్యసాయి. ప్రేమ నిత్యమైనది, సత్యమైనది అంటారు తత్వజ్ఞులు.
ప్రేమ అనే రెండక్షరాలు మహిమాన్వితమైనవి. మధురమైనవి. ప్రేమను వర్ణించడానికి భాష లేదు. మాటలు చాలవు. మనసు కన్నా, మాటల కన్నా, అతీతమైనది ప్రేమ. ప్రేమ చాలా సహజమైనది. పువ్వులు పరిమళాన్ని వెదజల్లడం, చంద్రుడు వెన్నెల కురిపించడం, నీరు ప్రవహించడం, గాలి వీచడం ఎంత సహజంగా జరుగుతాయో మనిషి హృదయంలో ప్రేమ కూడా అంతే సహజంగా పుడుతుంది.
మానవాళిని కలిపి ఉంచేది ప్రేమసూత్రం. ఆత్మను ఆత్మను కలిపి కట్టే దారమే ప్రేమ అంటారు భవభూతి మహాకవి. దేహసౌందర్యం నుంచి ఆత్మసౌందర్యం వైపు, ఆత్మసౌందర్యం నుంచి ఆధ్యాత్మిక సౌందర్యం వైపు నడిపించే మహత్తర శక్తే ప్రేమ అన్నది ప్లేటో మహాశయుడి వివరణ.
ప్రేమ ఆకాశం నుంచే వూడిపడదు. పాతాళంనుంచి ఉద్భవించదు. అది మనలోనే ఉంది. ప్రేమను మించిన అమృతత్వం మరొకటి లేదు.
ప్రేమ అనే మాటను భిన్నరీతుల్లో వింటుంటాం. ప్రేమకు ఎన్నో రూపాలు. ప్రేయసీప్రియులది ఆకర్షణ, వ్యామోహం. అది ప్రేమగా భ్రమిస్తారు. భార్యాభర్తలది వలపు. అది కూడా శాశ్వతం కాదు. అందుకే 'మరులు ప్రేమని మది దలంచకు, మరులు మరలును వయసు తోడనే' అన్నారు గురజాడ. పిల్లలపై తల్లిదండ్రులకు ఉండే ప్రేమ- వాత్సల్యం. మిత్రుల మధ్య ప్రేమ- స్నేహం! ఇవన్నీ లౌకికమైన ప్రేమలు. ఈ లౌకికమైన ప్రేమలో కామం, మోహం, స్వార్థం, ప్రతిఫలాపేక్ష చోటు చేసుకుంటాయి. స్వార్థప్రేమ విద్యుత్ కాంతి వంటిది. కృత్రిమమైనది. అన్యోన్య ప్రేమ పరస్పర క్షేమాన్ని ఆశించినా పరిమితమైనదే. అది చంద్రుడి వెలుగులాంటిది. స్పష్టత తక్కువ. పదార్థప్రేమ సూర్యకాంతి వంటిది. సర్వత్రా వ్యాపిస్తుంది. మనం ద్వేషాన్ని పెంచుకొంటున్నాం. కానీ, లోకానికి ప్రేమను పంచాలి. మనుషుల్లో ప్రేమను పెంచాలి. అందుకు మన హృదయం ప్రేమమయం కావాలి. మన దృష్టి ప్రేమమయమైనప్పుడే ఈ సృష్టి బ్రహ్మమయంగా భాసిస్తుంది. పరమేశ్వరుడిపై చూపించే భక్తే ప్రేమ అన్నాడు నారద మహర్షి. ఆర్ద్ర హృదయుడైన మానవుడు తన ప్రేమను ఈశ్వరాభిముఖంగా మరల్చినపుడు చిత్తం ద్రవిస్తుంది. భగవంతుడిపై ప్రేమ జనిస్తుంది. ఇదే పరమప్రేమ. ధర్మార్థ కామ మోక్షాలు కాక మానవుడు సాధించాల్సిన అయిదో పురుషార్థం ఈ పరమప్రేమ అంటారు తాత్వికులు.
పరమాత్మ- ప్రేమ స్వరూపుడు. పరహిత బుద్ధితో జీవనం గడుపుతూ, ప్రపంచాన్ని భగవన్మయంగా భావించేవారికి ప్రేమే దైవం. వారి బతుకు పరిపూర్ణం, ధన్యం.
- డాక్టర్ దామెర వేంకట సూర్యారావు
'ప్రేమ కన్నను ఎక్కువేముందిరా ఎల్లకామ్య పదవుల కన్న ప్రేమ ఎక్కువరా' అన్నాడు భావకవి. 'ప్రేమ కలుగక బ్రతుకు చీకటి' అన్నాడు గురజాడ. 'మనం ఆశించాల్సింది, అనుభవించేది, ఆనందించేది ప్రేమ మాత్రమే. పరితపించేది ప్రేమ కోసమే' అనేవారు సత్యసాయి. ప్రేమ నిత్యమైనది, సత్యమైనది అంటారు తత్వజ్ఞులు.
ప్రేమ అనే రెండక్షరాలు మహిమాన్వితమైనవి. మధురమైనవి. ప్రేమను వర్ణించడానికి భాష లేదు. మాటలు చాలవు. మనసు కన్నా, మాటల కన్నా, అతీతమైనది ప్రేమ. ప్రేమ చాలా సహజమైనది. పువ్వులు పరిమళాన్ని వెదజల్లడం, చంద్రుడు వెన్నెల కురిపించడం, నీరు ప్రవహించడం, గాలి వీచడం ఎంత సహజంగా జరుగుతాయో మనిషి హృదయంలో ప్రేమ కూడా అంతే సహజంగా పుడుతుంది.
మానవాళిని కలిపి ఉంచేది ప్రేమసూత్రం. ఆత్మను ఆత్మను కలిపి కట్టే దారమే ప్రేమ అంటారు భవభూతి మహాకవి. దేహసౌందర్యం నుంచి ఆత్మసౌందర్యం వైపు, ఆత్మసౌందర్యం నుంచి ఆధ్యాత్మిక సౌందర్యం వైపు నడిపించే మహత్తర శక్తే ప్రేమ అన్నది ప్లేటో మహాశయుడి వివరణ.
ప్రేమ ఆకాశం నుంచే వూడిపడదు. పాతాళంనుంచి ఉద్భవించదు. అది మనలోనే ఉంది. ప్రేమను మించిన అమృతత్వం మరొకటి లేదు.
ప్రేమ అనే మాటను భిన్నరీతుల్లో వింటుంటాం. ప్రేమకు ఎన్నో రూపాలు. ప్రేయసీప్రియులది ఆకర్షణ, వ్యామోహం. అది ప్రేమగా భ్రమిస్తారు. భార్యాభర్తలది వలపు. అది కూడా శాశ్వతం కాదు. అందుకే 'మరులు ప్రేమని మది దలంచకు, మరులు మరలును వయసు తోడనే' అన్నారు గురజాడ. పిల్లలపై తల్లిదండ్రులకు ఉండే ప్రేమ- వాత్సల్యం. మిత్రుల మధ్య ప్రేమ- స్నేహం! ఇవన్నీ లౌకికమైన ప్రేమలు. ఈ లౌకికమైన ప్రేమలో కామం, మోహం, స్వార్థం, ప్రతిఫలాపేక్ష చోటు చేసుకుంటాయి. స్వార్థప్రేమ విద్యుత్ కాంతి వంటిది. కృత్రిమమైనది. అన్యోన్య ప్రేమ పరస్పర క్షేమాన్ని ఆశించినా పరిమితమైనదే. అది చంద్రుడి వెలుగులాంటిది. స్పష్టత తక్కువ. పదార్థప్రేమ సూర్యకాంతి వంటిది. సర్వత్రా వ్యాపిస్తుంది. మనం ద్వేషాన్ని పెంచుకొంటున్నాం. కానీ, లోకానికి ప్రేమను పంచాలి. మనుషుల్లో ప్రేమను పెంచాలి. అందుకు మన హృదయం ప్రేమమయం కావాలి. మన దృష్టి ప్రేమమయమైనప్పుడే ఈ సృష్టి బ్రహ్మమయంగా భాసిస్తుంది. పరమేశ్వరుడిపై చూపించే భక్తే ప్రేమ అన్నాడు నారద మహర్షి. ఆర్ద్ర హృదయుడైన మానవుడు తన ప్రేమను ఈశ్వరాభిముఖంగా మరల్చినపుడు చిత్తం ద్రవిస్తుంది. భగవంతుడిపై ప్రేమ జనిస్తుంది. ఇదే పరమప్రేమ. ధర్మార్థ కామ మోక్షాలు కాక మానవుడు సాధించాల్సిన అయిదో పురుషార్థం ఈ పరమప్రేమ అంటారు తాత్వికులు.
పరమాత్మ- ప్రేమ స్వరూపుడు. పరహిత బుద్ధితో జీవనం గడుపుతూ, ప్రపంచాన్ని భగవన్మయంగా భావించేవారికి ప్రేమే దైవం. వారి బతుకు పరిపూర్ణం, ధన్యం.
- డాక్టర్ దామెర వేంకట సూర్యారావు
ᐅ శ్రీ పంచమి
ᐅ శ్రీ పంచమి
మాఘశుద్ధ పంచమి దినాన్ని 'శ్రీ పంచమి' అని పిలుస్తారు. ఈరోజుకు ఉన్న ప్రత్యేకతలనుబట్టి వసంత పంచమి అని, మదన పంచమి అనీ పేర్లున్నాయి.
ముఖ్యంగా 'ఈ రోజు ప్రత్యేకత విద్యాప్రదాత్రి అయిన సరస్వతీదేవి పుట్టిన రోజు' అని బ్రహ్మవైవర్త పురాణంలోని ప్రకృతి ఖండంలో నాలుగో అధ్యాయం చెబుతోంది. కాబట్టి ఈ రోజు విద్యారంభ దినంగా జరుపుతారు. బెంగాల్లోను, దాని సరిహద్దు రాష్ట్రాలైన ఒడిశా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లోను వైభవోపేతంగా శ్రీ పంచమి జరుపుతారు. ఈ రోజున వారంతా అత్యంత భక్తిశ్రద్ధలతో సరస్వతీదేవిని పూజిస్తారు. ముఖ్యంగా బెంగాలులో విద్యార్థినీ విద్యార్థులే కాకుండా యావన్మంది ప్రజలూ సరస్వతీ పూజ చేస్తారు. విశేషమేమిటంటే అక్షరజ్ఞానం, దాని అవసరంలేనివారు సైతం ఈ రోజున సరస్వతీదేవిని పూజిస్తారు. దేశంలో ఏ ప్రాంతంలోనూ లేనివిధంగా ఈ రోజున సరస్వతీమూర్తిని ప్రతిష్ఠించి(చాలా ప్రాంతాల్లో వినాయక విగ్రహాల్లా) పూజించి ఉత్సవాలు చేయడం ఈ ప్రాంతం ప్రత్యేకత. విద్యార్థులైతే విద్యార్జనకు సంబంధించిన పలకలు, పుస్తకాలు, సిరా సీసాలు, కలాలు మొదలైనవాటిని దేవి విగ్రహం ముందు ఉంచి పూజిస్తారు. కవులు, రచయితలు తమ తమ గ్రంథాలను ప్రాచీన సంప్రదాయానుయాయులు తమ ఇళ్ళల్లో ఉన్న ఇతర పుస్తకాలు, తాళపత్ర గ్రంథాలు మొదలైనవాటిని, సంగీత విద్వాంసులైతే ఆ పరికరాలనీ ఇలా విద్యకు సంబంధించిన వస్తువులన్నీ దేవి ముందుంచి సంప్రదాయబద్ధంగా పూజిస్తారు. అనంతరం కలాలు, పుస్తకాలు, పలకలు లాంటివి బహుమతులుగా ఇస్తారు. సాయంత్రం వరకు నృత్యగీతాదులతోను, పండితగోష్ఠులు, చర్చలు, ఇతర విద్యావిషయక సంభాషణలతో కాలం గడిపి సరస్వతీ విగ్రహాన్ని జలాశయాల్లో నిమజ్జనం చేస్తారు. ఇలా చేయడంవల్ల సరస్వతీ కటాక్షం సిద్ధిస్తుందని వారు నమ్ముతారు. మనరాష్ట్రంలో బాసర క్షేత్రంలోను, కర్నూలు జిల్లా కొలనుభారతి అనే వూరిలో విశేష ఉత్సవాలు జరుపుతారు. ఉత్తరాంధ్రలో విజయనగరం పట్టణంలో ఇటీవల వెలసిన 'జ్ఞాన సరస్వతీదేవి' ఆలయంలోనూ ఈ దినాన్ని అత్యంత వైభవంగా జరుపుతారు. ఆ ఆలయాల్లోనే కాకుండా పాఠశాలల్లో, ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాల్లో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తారు. హరిద్వార్, హృషీకేశ్, ప్రయాగ లాంటి పుణ్య దేవాలయాల ఆధ్వర్యంలో శ్రీ పంచమి ఉత్సవాలు, మేళాలు జరుపుతారు. అక్కడ ఈ రోజున పూజలు చేసేవారంతా పసుపుపచ్చని బట్టలు ధరిస్తారు. నివేదన చేసే పదార్థాలు సైతం పసుపు రంగువి (పులగం, పులిహోర, కిచిడీ లాంటివి) ఉంటాయి. జ్ఞానప్రదాయిని అయిన సరస్వతీదేవిని ఒకానొక సమయంలో సాక్షాత్తు ఆమె భర్త అయిన బ్రహ్మే జ్ఞానసిద్ధికోసం పూజించాడని, ఆ క్షణంలో ఆమెను భార్యగా కాక, జ్ఞానదాయినిగానే భావించి అలా పూజించాడని ప్రతీతి. సనత్కుమారుడి సలహాయే అలా పూజించడానికి కారణమని పురాణాలు చెబుతున్నాయి.
చైత్ర మాసారంభంతో వసంతరుతువు ప్రారంభం అవుతుంది. రాబోయే వసంత రుతువును స్వాగతించే దినంగా దీన్ని చెబుతారు. అందుకే ఈ రోజున వసంతోత్సవం చేస్తారు. 'వసంత పంచమి' అని పేరు రావడానికి అదే కారణం. రాజస్థాన్ ప్రాంతంలో ఈ రోజున జరిపే వసంతోత్సవం ప్రత్యేకత సంతరించుకుంటుంది. వసంతాగమనానికి స్వాగతసూచకంగా వీరు వసంతాన్ని(సున్నం, పసుపుల సమ్మేళనంతో ఏర్పడే ఎర్రని ద్రవం) ఇతర రంగునీళ్లను బుక్క, బర్గుండలాటి రంగు పొడులను ఒకరిపై ఒకరు చల్లుకుంటారు. దక్షిణ భారతదేశంలో ఈ ఉత్సవాలు అరుదుగా జరుగుతాయి.
తపస్సు చేసుకుంటున్న శివుడి మనసు అతడికి సేవలు చేస్తున్న పార్వతి వైపు మళ్ళేవిధంగా మదను(మన్మథు)డు తన పూలబాణం వేశాడు. అందుకు ఆగ్రహించిన శివుడు తన మూడో నేత్రంతో మదనుణ్ని భస్మం చేస్తాడు. మన్మథుడి భార్య అయిన రతీదేవి- సృష్టికి అత్యంత ఆవశ్యకమైన తన భర్తను సజీవుని చెయ్యమని కోరింది. ఆమె ప్రార్థన మన్నించిన శివుడు ఆమెకు మాత్రం శరీరధారిగా, మిగిలినవారందరికీ అనంగుడు (శరీరంలేనివాడి)గా పునరుజ్జీవింపజేశాడని పురాణ కథనం. అలా మదనుడు పునరుజ్జీవనం పొందినరోజు కాబట్టి ఈ రోజుకు 'మదనపంచమి', 'అనంగపంచమి' అనే పేర్లు వచ్చాయనీ చెబుతారు.
పైరు పంటలతో పంటలు కళకళలాడుతుంటాయి కాబట్టి ఆ ఆనందోత్సాహాలతో ప్రజలు ఈ రోజున 'యవేష్టి' అనే పూజచేసేవారని, ప్రస్తుతం ఆ ఆచారం కనుమరుగైందనీ అంటారు.
- అయ్యగారి శ్రీనివాసరావు
మాఘశుద్ధ పంచమి దినాన్ని 'శ్రీ పంచమి' అని పిలుస్తారు. ఈరోజుకు ఉన్న ప్రత్యేకతలనుబట్టి వసంత పంచమి అని, మదన పంచమి అనీ పేర్లున్నాయి.
ముఖ్యంగా 'ఈ రోజు ప్రత్యేకత విద్యాప్రదాత్రి అయిన సరస్వతీదేవి పుట్టిన రోజు' అని బ్రహ్మవైవర్త పురాణంలోని ప్రకృతి ఖండంలో నాలుగో అధ్యాయం చెబుతోంది. కాబట్టి ఈ రోజు విద్యారంభ దినంగా జరుపుతారు. బెంగాల్లోను, దాని సరిహద్దు రాష్ట్రాలైన ఒడిశా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లోను వైభవోపేతంగా శ్రీ పంచమి జరుపుతారు. ఈ రోజున వారంతా అత్యంత భక్తిశ్రద్ధలతో సరస్వతీదేవిని పూజిస్తారు. ముఖ్యంగా బెంగాలులో విద్యార్థినీ విద్యార్థులే కాకుండా యావన్మంది ప్రజలూ సరస్వతీ పూజ చేస్తారు. విశేషమేమిటంటే అక్షరజ్ఞానం, దాని అవసరంలేనివారు సైతం ఈ రోజున సరస్వతీదేవిని పూజిస్తారు. దేశంలో ఏ ప్రాంతంలోనూ లేనివిధంగా ఈ రోజున సరస్వతీమూర్తిని ప్రతిష్ఠించి(చాలా ప్రాంతాల్లో వినాయక విగ్రహాల్లా) పూజించి ఉత్సవాలు చేయడం ఈ ప్రాంతం ప్రత్యేకత. విద్యార్థులైతే విద్యార్జనకు సంబంధించిన పలకలు, పుస్తకాలు, సిరా సీసాలు, కలాలు మొదలైనవాటిని దేవి విగ్రహం ముందు ఉంచి పూజిస్తారు. కవులు, రచయితలు తమ తమ గ్రంథాలను ప్రాచీన సంప్రదాయానుయాయులు తమ ఇళ్ళల్లో ఉన్న ఇతర పుస్తకాలు, తాళపత్ర గ్రంథాలు మొదలైనవాటిని, సంగీత విద్వాంసులైతే ఆ పరికరాలనీ ఇలా విద్యకు సంబంధించిన వస్తువులన్నీ దేవి ముందుంచి సంప్రదాయబద్ధంగా పూజిస్తారు. అనంతరం కలాలు, పుస్తకాలు, పలకలు లాంటివి బహుమతులుగా ఇస్తారు. సాయంత్రం వరకు నృత్యగీతాదులతోను, పండితగోష్ఠులు, చర్చలు, ఇతర విద్యావిషయక సంభాషణలతో కాలం గడిపి సరస్వతీ విగ్రహాన్ని జలాశయాల్లో నిమజ్జనం చేస్తారు. ఇలా చేయడంవల్ల సరస్వతీ కటాక్షం సిద్ధిస్తుందని వారు నమ్ముతారు. మనరాష్ట్రంలో బాసర క్షేత్రంలోను, కర్నూలు జిల్లా కొలనుభారతి అనే వూరిలో విశేష ఉత్సవాలు జరుపుతారు. ఉత్తరాంధ్రలో విజయనగరం పట్టణంలో ఇటీవల వెలసిన 'జ్ఞాన సరస్వతీదేవి' ఆలయంలోనూ ఈ దినాన్ని అత్యంత వైభవంగా జరుపుతారు. ఆ ఆలయాల్లోనే కాకుండా పాఠశాలల్లో, ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాల్లో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తారు. హరిద్వార్, హృషీకేశ్, ప్రయాగ లాంటి పుణ్య దేవాలయాల ఆధ్వర్యంలో శ్రీ పంచమి ఉత్సవాలు, మేళాలు జరుపుతారు. అక్కడ ఈ రోజున పూజలు చేసేవారంతా పసుపుపచ్చని బట్టలు ధరిస్తారు. నివేదన చేసే పదార్థాలు సైతం పసుపు రంగువి (పులగం, పులిహోర, కిచిడీ లాంటివి) ఉంటాయి. జ్ఞానప్రదాయిని అయిన సరస్వతీదేవిని ఒకానొక సమయంలో సాక్షాత్తు ఆమె భర్త అయిన బ్రహ్మే జ్ఞానసిద్ధికోసం పూజించాడని, ఆ క్షణంలో ఆమెను భార్యగా కాక, జ్ఞానదాయినిగానే భావించి అలా పూజించాడని ప్రతీతి. సనత్కుమారుడి సలహాయే అలా పూజించడానికి కారణమని పురాణాలు చెబుతున్నాయి.
చైత్ర మాసారంభంతో వసంతరుతువు ప్రారంభం అవుతుంది. రాబోయే వసంత రుతువును స్వాగతించే దినంగా దీన్ని చెబుతారు. అందుకే ఈ రోజున వసంతోత్సవం చేస్తారు. 'వసంత పంచమి' అని పేరు రావడానికి అదే కారణం. రాజస్థాన్ ప్రాంతంలో ఈ రోజున జరిపే వసంతోత్సవం ప్రత్యేకత సంతరించుకుంటుంది. వసంతాగమనానికి స్వాగతసూచకంగా వీరు వసంతాన్ని(సున్నం, పసుపుల సమ్మేళనంతో ఏర్పడే ఎర్రని ద్రవం) ఇతర రంగునీళ్లను బుక్క, బర్గుండలాటి రంగు పొడులను ఒకరిపై ఒకరు చల్లుకుంటారు. దక్షిణ భారతదేశంలో ఈ ఉత్సవాలు అరుదుగా జరుగుతాయి.
తపస్సు చేసుకుంటున్న శివుడి మనసు అతడికి సేవలు చేస్తున్న పార్వతి వైపు మళ్ళేవిధంగా మదను(మన్మథు)డు తన పూలబాణం వేశాడు. అందుకు ఆగ్రహించిన శివుడు తన మూడో నేత్రంతో మదనుణ్ని భస్మం చేస్తాడు. మన్మథుడి భార్య అయిన రతీదేవి- సృష్టికి అత్యంత ఆవశ్యకమైన తన భర్తను సజీవుని చెయ్యమని కోరింది. ఆమె ప్రార్థన మన్నించిన శివుడు ఆమెకు మాత్రం శరీరధారిగా, మిగిలినవారందరికీ అనంగుడు (శరీరంలేనివాడి)గా పునరుజ్జీవింపజేశాడని పురాణ కథనం. అలా మదనుడు పునరుజ్జీవనం పొందినరోజు కాబట్టి ఈ రోజుకు 'మదనపంచమి', 'అనంగపంచమి' అనే పేర్లు వచ్చాయనీ చెబుతారు.
పైరు పంటలతో పంటలు కళకళలాడుతుంటాయి కాబట్టి ఆ ఆనందోత్సాహాలతో ప్రజలు ఈ రోజున 'యవేష్టి' అనే పూజచేసేవారని, ప్రస్తుతం ఆ ఆచారం కనుమరుగైందనీ అంటారు.
- అయ్యగారి శ్రీనివాసరావు
ᐅ ఆధ్యాత్మిక గురువు
ᐅ ఆధ్యాత్మిక గురువు
'మీరు మహాజ్ఞానులు. మీ దగ్గర నా ప్రతి ప్రశ్నకూ జవాబు ఉంది. మీకింత జ్ఞానాన్ని ప్రసాదించిన మీ గురువు ఎవరు?' అని శిష్యుడు అడిగాడు. గురువు మందహాసం చేస్తూ తన కుటీరం ముందున్న చెట్టును చూపించి 'ఆ వృక్షమే నా గురువు' అన్నాడు. శిష్యుడు ఆశ్చర్యపోయాడు.
'మౌనంగా జీవన సత్యాన్ని బోధిస్తుంది. శిశిరంలో ఆకులన్నీ రాల్చేసి, వేసవిలో ఎండి మోడైపోయింది. ఇంక వంట చెరకుగా తప్ప మరిదేనికీ పనికిరాదేమో అని నిస్త్రాణపడిపోయాను. కాని, వసంతకాలం వచ్చింది. ప్రతి కొమ్మకూ చిగురేసుకు వచ్చింది. మొత్తం దృశ్యమే మారిపోయింది. చిరుగాలులకు కదిలే రెమ్మలు గుసగుసలాడుతూ నాకెన్నో బోధించాయి. చచ్చిపోయిందనుకున్న చెట్టు మళ్ళీ చిగురించి ఎట్టెదుట కనిపించడం నాకొక గొప్ప సందేశాన్ని అందించింది.
'జీవితంలో ఒడుదొడుకులు వచ్చినప్పుడు ఎన్నడూ కుంగిపోకు. ఆశాభావంతో ఎదురుచూడు. మంచిరోజు తప్పక వస్తుంది. గ్రీష్మం తరవాత వసంతాగమనం తథ్యం. ప్రతి చీకటిరాత్రి గడిచాక పరవశించే పగలు రాక తప్పదు. అలాగే దుర్భరమైన ఓటమిని వెన్నంటి మనసును ఉర్రూతలూగించే విజయమూ వరిస్తుంది... దేనికీ సంచలించిపోకూడదు. జీవితంలో ఆటుపోటుల్ని సమంగా స్వీకరించటం నేర్చుకో! ఎటువంటి కఠిన పరిస్థితులు వచ్చినా నిరాశపడకు. నీ ప్రయత్నాలను సడలించకు. నీ ధర్మం నిర్విరామంగా నిర్వర్తించుకుంటూ సాగిపో! సమయం కోసం వేచిచూడు. నీకు విజయం లభిస్తుంది... అని చెప్పిందా చెట్టు!
'అది తన నిర్ణీత స్థలంనుంచి అంగుళం కదలదు. తనకు సహజంగా లభించే భూసారాన్ని మాత్రమే తీసుకుంటుంది. వరుణుడు ప్రసాదించిన వాననీటితోనే తృప్తిపడిపోతుంది. ఆ తేమను తన వేళ్లతో భూమిలో భద్రపరచుకుంటుంది. ఎక్కడా శబ్దం చేయదు. ఎవరినీ నిందించదు. చిరుగాలులకు ఆకులు చేసే సవ్వడి కూడా ఇతరుల్ని ఆనందపెట్టడానికే! ఎవరికీ సమస్యలు సృష్టించదు. ఎవరినీ బాధపెట్టదు. సరికదా తన కొమ్మలు విరిచేవాళ్లను, పళ్లను కోసేవాళ్లను ప్రతిఘటించదు. నిర్వికారంగా, నిరంతర మౌనంతో తన మొదలును ప్రేమతో స్పృశించిన వాళ్లనూ తనపై రాళ్లు విసిరినవాళ్లనూ సరిసమాన భావనతో ఆదరిస్తుంది. తాను బొగ్గు పులుసువాయువును పీల్చుకొని అందరికీ ప్రాణవాయువు అందిస్తుంది. తన పళ్లను తాను తినదు. వాటిని అందరికీ పంచిపెడుతుంది. తన కొమ్మల వూయల నీడల్లో అలసినవాళ్లను సేద తీరుస్తుంది. పైనపడే ఎండబాధను తానే భరిస్తుంది.
'బదులుగా ఎవర్నీ ఏదీ అడగదు. మానవ జీవితానికి చక్కని మార్గదర్శి. నిగర్వి. నిస్వార్థి. త్యాగమయి. పరోపకారి. సౌజన్యమూర్తి. సత్వగుణ సంజాత. ప్రకృతి అందరికీ ప్రసాదించిన ఆధ్యాత్మిక గురువు ఈ వృక్షం!'
- తటవర్తి రామచంద్రరావు
'మీరు మహాజ్ఞానులు. మీ దగ్గర నా ప్రతి ప్రశ్నకూ జవాబు ఉంది. మీకింత జ్ఞానాన్ని ప్రసాదించిన మీ గురువు ఎవరు?' అని శిష్యుడు అడిగాడు. గురువు మందహాసం చేస్తూ తన కుటీరం ముందున్న చెట్టును చూపించి 'ఆ వృక్షమే నా గురువు' అన్నాడు. శిష్యుడు ఆశ్చర్యపోయాడు.
'మౌనంగా జీవన సత్యాన్ని బోధిస్తుంది. శిశిరంలో ఆకులన్నీ రాల్చేసి, వేసవిలో ఎండి మోడైపోయింది. ఇంక వంట చెరకుగా తప్ప మరిదేనికీ పనికిరాదేమో అని నిస్త్రాణపడిపోయాను. కాని, వసంతకాలం వచ్చింది. ప్రతి కొమ్మకూ చిగురేసుకు వచ్చింది. మొత్తం దృశ్యమే మారిపోయింది. చిరుగాలులకు కదిలే రెమ్మలు గుసగుసలాడుతూ నాకెన్నో బోధించాయి. చచ్చిపోయిందనుకున్న చెట్టు మళ్ళీ చిగురించి ఎట్టెదుట కనిపించడం నాకొక గొప్ప సందేశాన్ని అందించింది.
'జీవితంలో ఒడుదొడుకులు వచ్చినప్పుడు ఎన్నడూ కుంగిపోకు. ఆశాభావంతో ఎదురుచూడు. మంచిరోజు తప్పక వస్తుంది. గ్రీష్మం తరవాత వసంతాగమనం తథ్యం. ప్రతి చీకటిరాత్రి గడిచాక పరవశించే పగలు రాక తప్పదు. అలాగే దుర్భరమైన ఓటమిని వెన్నంటి మనసును ఉర్రూతలూగించే విజయమూ వరిస్తుంది... దేనికీ సంచలించిపోకూడదు. జీవితంలో ఆటుపోటుల్ని సమంగా స్వీకరించటం నేర్చుకో! ఎటువంటి కఠిన పరిస్థితులు వచ్చినా నిరాశపడకు. నీ ప్రయత్నాలను సడలించకు. నీ ధర్మం నిర్విరామంగా నిర్వర్తించుకుంటూ సాగిపో! సమయం కోసం వేచిచూడు. నీకు విజయం లభిస్తుంది... అని చెప్పిందా చెట్టు!
'అది తన నిర్ణీత స్థలంనుంచి అంగుళం కదలదు. తనకు సహజంగా లభించే భూసారాన్ని మాత్రమే తీసుకుంటుంది. వరుణుడు ప్రసాదించిన వాననీటితోనే తృప్తిపడిపోతుంది. ఆ తేమను తన వేళ్లతో భూమిలో భద్రపరచుకుంటుంది. ఎక్కడా శబ్దం చేయదు. ఎవరినీ నిందించదు. చిరుగాలులకు ఆకులు చేసే సవ్వడి కూడా ఇతరుల్ని ఆనందపెట్టడానికే! ఎవరికీ సమస్యలు సృష్టించదు. ఎవరినీ బాధపెట్టదు. సరికదా తన కొమ్మలు విరిచేవాళ్లను, పళ్లను కోసేవాళ్లను ప్రతిఘటించదు. నిర్వికారంగా, నిరంతర మౌనంతో తన మొదలును ప్రేమతో స్పృశించిన వాళ్లనూ తనపై రాళ్లు విసిరినవాళ్లనూ సరిసమాన భావనతో ఆదరిస్తుంది. తాను బొగ్గు పులుసువాయువును పీల్చుకొని అందరికీ ప్రాణవాయువు అందిస్తుంది. తన పళ్లను తాను తినదు. వాటిని అందరికీ పంచిపెడుతుంది. తన కొమ్మల వూయల నీడల్లో అలసినవాళ్లను సేద తీరుస్తుంది. పైనపడే ఎండబాధను తానే భరిస్తుంది.
'బదులుగా ఎవర్నీ ఏదీ అడగదు. మానవ జీవితానికి చక్కని మార్గదర్శి. నిగర్వి. నిస్వార్థి. త్యాగమయి. పరోపకారి. సౌజన్యమూర్తి. సత్వగుణ సంజాత. ప్రకృతి అందరికీ ప్రసాదించిన ఆధ్యాత్మిక గురువు ఈ వృక్షం!'
- తటవర్తి రామచంద్రరావు
ᐅ సద సద్విచారణ
ᐅ సద సద్విచారణ
లోకంలో సాధారణంగా ఒక వ్యక్తివద్ద ఉన్నదానితో అతణ్ని అంచనా వేస్తుంటారు. ఇల్లు, సంపద, పదవి, అంతస్తు వంటి బాహ్యమైన అభివృద్ధే అతడి హోదాను నిర్ణయిస్తుంది. బయటకు కనిపించని వ్యక్తంకాని ఆంతరిక పురోగతి, అనుభూతి విస్తృతిని చాలామంది గమనించరు. మనిషి బాహ్యంగానే కాదు, ఆంతరికంగానూ పురోగమిస్తాడు. అతనిలో ప్రేమ, కరుణ, వివేకం వంటి గుణాలు వికసిస్తాయి. తన శరీరాన్ని, తనను మాత్రమే ప్రేమించేవాడు తన ఇల్లు, తన గ్రామం, తన దేశం, లోకం అంటూ యావత్ప్రపంచాన్నీ తనదిగా ఎంచి ప్రేమించేమేరకు అతడి భావన విస్తృతి చెందుతుంది.
ఈ ఆంతరిక అభివృద్ధే నిజమైన అభివృద్ధి. బాహ్య పురోగతికి దోహదకారులైన సిరిసంపదలు, పదవులు తొలగిపోయినప్పుడు అతడు మొదటి స్థితిలోనికే దిగజారిపోతాడు. కాని ఆంతరిక పురోగతిలో దేన్నీ కోల్పోయే ప్రమాదం ఉండదు.
ఈ రెండు దృక్పథాలకు రంగస్థలం లోకమే. అంటే లోకం ఈ రెండింటికే అవకాశం కల్పిస్తోందన్నమాట. లోకాన్ని అది అందించే సుఖభోగాలనే పరమావధిగా చేసుకొనేవారు అనేకులు. అవి కొన్ని మెట్లు మాత్రమే అని భావించి కొంతమంది ఉన్నత లక్ష్యాలను ఆశిస్తారు. ఈ రెండు భిన్నమైన ఆలోచనలు కలవారికీ లోకం ఒక్కటే. మొదటిది బాహ్య పురోగతికి దోహదం చేస్తే, రెండోది ఆంతరిక పురోగతినిస్తుంది. మొదటిది సుఖప్రదమైనది కావచ్చు, రెండోది శ్రేయస్కరమైనది. ప్రాపంచిక సుఖాలు అనుభవించే దశలో సంతోషాన్ని కలిగించవచ్చు. కానీ, చివరకు దుఃఖంగా పరిణమించవచ్చు. ఉన్నత లక్ష్యాలు ఆరంభంలో కష్టంగా తోచినా అంతిమంగా మహదానందం కలిగిస్తాయి. పైపై సుఖాలను కోరుకునేవాడు చివరికి దుఃఖంలో కూరుకుపోతాడు.
సుఖకరమైనది, శ్రేయస్కరమైనదీ రెండూ మనిషి సమీపంలో ఉన్నపుడు బుద్ధిమంతుడు వాటిని విచారణ చేసి వివేచన చేస్తాడు. సుఖకరమైన దాన్ని విడిచిపెట్టి శ్రేయస్కరమైనదాన్ని ఎంచుకుంటాడు. బుద్ధిహీనుడు దానికి భిన్నంగా శారీరక క్షేమం, తాత్కాలిక సుఖం ఇచ్చేవాటినే వరిస్తాడని కఠోపనిషత్తు చెబుతోంది.
మనం మార్గంలో వెళుతుండగా ధనం దొరుకుతుంది. దగ్గర్లో ఎవరూ లేరు. అప్పుడనేక ఆలోచనలు చుట్టుముడతాయి. ఇది భగవంతుడు నాకిచ్చినది లేదా నా అదృష్టం కొద్దీ దొరికింది అని జాగ్రత్తగా ఆ ధనాన్ని సంచిలో వేసుకుని అక్కడినుంచి జారుకోవచ్చు. లేదా, ఆ డబ్బు పోగొట్టుకున్నవారెవరో కనుక్కొని అందించే ప్రయత్నం చేయవచ్చు. ప్రభుత్వానికి అప్పగించనూ వచ్చు. లేదా, ఆ డబ్బును తాను గ్రహించి దానితో పుణ్యకార్యాలు నిర్వహించవచ్చు. ధనాన్ని సొంతం చేసుకొని అనుభవించే వ్యక్తే సుఖం పొందుతాడు. కాని, అది దొంగతనమే. తనది కానిదాన్ని అనుభవించడంవల్ల అతణ్ని పాపం అంటుతుంది. ఈ విధంగా లోకం మనకు అవకాశాలు కల్పిస్తుంది. పరిస్థితులు సృష్టిస్తుంది. మనం విచక్షణతో వివేచనతో వ్యవహరించాలి. ఎలా ప్రవర్తిస్తే మనం ఉన్నత లక్ష్యానికి చేరువవుతామో నిర్ణయించుకోవాలి.
లోకంలో విద్య, అవిద్య రెండూ ఉన్నాయి. విద్య భగవన్మార్గాన్ని చూపుతుంది. అవిద్య మోహంలో ముంచెత్తుతుంది. కామం, ధనాశ దాన్నుంచే ఉత్పన్నమవుతాయి. విద్య భక్తిని, కరుణను, జ్ఞానాన్ని, ప్రేమను జనింపజేస్తుంది.
ప్రాపంచికత నడుమ జీవించే మూఢులు తమను బుద్ధిశాలురుగా, పండితులుగా భావించుకొని అడ్డదారులు తొక్కుతారు. 'కానని వాని నూతగొని కాననివాడు విశిష్ట వస్తువుల్ కానని భంగి...' అంటారు భాగవతంలో పోతన. గుడ్డివాడి సహాయంతో మరొక గుడ్డివాడు ఎలా వస్తువులు చూడలేడో అలాగే వీళ్లు జనన మరణ సుడిగుండంలో పరిభ్రమిస్తుంటారు.
కర్రతో చేసిన క్రూరమృగం బొమ్మను చూసిన పిల్లవాడు భయపడతాడు. అతడు కొయ్యను చూడలేడు. బయటకు గోచరించే మృగాన్నే చూడగలుగుతాడు. మనోవికాసం పొందిన వ్యక్తి దాన్ని కర్రబొమ్మగానే భావించి భయపడడు. లోకం కూడా అటువంటిదే. ప్రాపంచిక సుఖాలు, ధనాశ మన మీద ఆధిక్యం చలాయిస్తున్నప్పుడు మనకు భగవన్మార్గం కనబడదు, అడ్డదారులే గోచరిస్తాయి. ఈ దారులను ఆశ్రయించేవారు మృత్యుదేవత వద్దకే పోతుంటారు. ఆంతరిక పురోగతి ధ్యేయంగా చేసుకొన్న భగవన్మార్గం కఠినంగా తోచినా, ఆనందప్రదం.
- డాక్టర్ దామెర వేంకట సూర్యారావు
లోకంలో సాధారణంగా ఒక వ్యక్తివద్ద ఉన్నదానితో అతణ్ని అంచనా వేస్తుంటారు. ఇల్లు, సంపద, పదవి, అంతస్తు వంటి బాహ్యమైన అభివృద్ధే అతడి హోదాను నిర్ణయిస్తుంది. బయటకు కనిపించని వ్యక్తంకాని ఆంతరిక పురోగతి, అనుభూతి విస్తృతిని చాలామంది గమనించరు. మనిషి బాహ్యంగానే కాదు, ఆంతరికంగానూ పురోగమిస్తాడు. అతనిలో ప్రేమ, కరుణ, వివేకం వంటి గుణాలు వికసిస్తాయి. తన శరీరాన్ని, తనను మాత్రమే ప్రేమించేవాడు తన ఇల్లు, తన గ్రామం, తన దేశం, లోకం అంటూ యావత్ప్రపంచాన్నీ తనదిగా ఎంచి ప్రేమించేమేరకు అతడి భావన విస్తృతి చెందుతుంది.
ఈ ఆంతరిక అభివృద్ధే నిజమైన అభివృద్ధి. బాహ్య పురోగతికి దోహదకారులైన సిరిసంపదలు, పదవులు తొలగిపోయినప్పుడు అతడు మొదటి స్థితిలోనికే దిగజారిపోతాడు. కాని ఆంతరిక పురోగతిలో దేన్నీ కోల్పోయే ప్రమాదం ఉండదు.
ఈ రెండు దృక్పథాలకు రంగస్థలం లోకమే. అంటే లోకం ఈ రెండింటికే అవకాశం కల్పిస్తోందన్నమాట. లోకాన్ని అది అందించే సుఖభోగాలనే పరమావధిగా చేసుకొనేవారు అనేకులు. అవి కొన్ని మెట్లు మాత్రమే అని భావించి కొంతమంది ఉన్నత లక్ష్యాలను ఆశిస్తారు. ఈ రెండు భిన్నమైన ఆలోచనలు కలవారికీ లోకం ఒక్కటే. మొదటిది బాహ్య పురోగతికి దోహదం చేస్తే, రెండోది ఆంతరిక పురోగతినిస్తుంది. మొదటిది సుఖప్రదమైనది కావచ్చు, రెండోది శ్రేయస్కరమైనది. ప్రాపంచిక సుఖాలు అనుభవించే దశలో సంతోషాన్ని కలిగించవచ్చు. కానీ, చివరకు దుఃఖంగా పరిణమించవచ్చు. ఉన్నత లక్ష్యాలు ఆరంభంలో కష్టంగా తోచినా అంతిమంగా మహదానందం కలిగిస్తాయి. పైపై సుఖాలను కోరుకునేవాడు చివరికి దుఃఖంలో కూరుకుపోతాడు.
సుఖకరమైనది, శ్రేయస్కరమైనదీ రెండూ మనిషి సమీపంలో ఉన్నపుడు బుద్ధిమంతుడు వాటిని విచారణ చేసి వివేచన చేస్తాడు. సుఖకరమైన దాన్ని విడిచిపెట్టి శ్రేయస్కరమైనదాన్ని ఎంచుకుంటాడు. బుద్ధిహీనుడు దానికి భిన్నంగా శారీరక క్షేమం, తాత్కాలిక సుఖం ఇచ్చేవాటినే వరిస్తాడని కఠోపనిషత్తు చెబుతోంది.
మనం మార్గంలో వెళుతుండగా ధనం దొరుకుతుంది. దగ్గర్లో ఎవరూ లేరు. అప్పుడనేక ఆలోచనలు చుట్టుముడతాయి. ఇది భగవంతుడు నాకిచ్చినది లేదా నా అదృష్టం కొద్దీ దొరికింది అని జాగ్రత్తగా ఆ ధనాన్ని సంచిలో వేసుకుని అక్కడినుంచి జారుకోవచ్చు. లేదా, ఆ డబ్బు పోగొట్టుకున్నవారెవరో కనుక్కొని అందించే ప్రయత్నం చేయవచ్చు. ప్రభుత్వానికి అప్పగించనూ వచ్చు. లేదా, ఆ డబ్బును తాను గ్రహించి దానితో పుణ్యకార్యాలు నిర్వహించవచ్చు. ధనాన్ని సొంతం చేసుకొని అనుభవించే వ్యక్తే సుఖం పొందుతాడు. కాని, అది దొంగతనమే. తనది కానిదాన్ని అనుభవించడంవల్ల అతణ్ని పాపం అంటుతుంది. ఈ విధంగా లోకం మనకు అవకాశాలు కల్పిస్తుంది. పరిస్థితులు సృష్టిస్తుంది. మనం విచక్షణతో వివేచనతో వ్యవహరించాలి. ఎలా ప్రవర్తిస్తే మనం ఉన్నత లక్ష్యానికి చేరువవుతామో నిర్ణయించుకోవాలి.
లోకంలో విద్య, అవిద్య రెండూ ఉన్నాయి. విద్య భగవన్మార్గాన్ని చూపుతుంది. అవిద్య మోహంలో ముంచెత్తుతుంది. కామం, ధనాశ దాన్నుంచే ఉత్పన్నమవుతాయి. విద్య భక్తిని, కరుణను, జ్ఞానాన్ని, ప్రేమను జనింపజేస్తుంది.
ప్రాపంచికత నడుమ జీవించే మూఢులు తమను బుద్ధిశాలురుగా, పండితులుగా భావించుకొని అడ్డదారులు తొక్కుతారు. 'కానని వాని నూతగొని కాననివాడు విశిష్ట వస్తువుల్ కానని భంగి...' అంటారు భాగవతంలో పోతన. గుడ్డివాడి సహాయంతో మరొక గుడ్డివాడు ఎలా వస్తువులు చూడలేడో అలాగే వీళ్లు జనన మరణ సుడిగుండంలో పరిభ్రమిస్తుంటారు.
కర్రతో చేసిన క్రూరమృగం బొమ్మను చూసిన పిల్లవాడు భయపడతాడు. అతడు కొయ్యను చూడలేడు. బయటకు గోచరించే మృగాన్నే చూడగలుగుతాడు. మనోవికాసం పొందిన వ్యక్తి దాన్ని కర్రబొమ్మగానే భావించి భయపడడు. లోకం కూడా అటువంటిదే. ప్రాపంచిక సుఖాలు, ధనాశ మన మీద ఆధిక్యం చలాయిస్తున్నప్పుడు మనకు భగవన్మార్గం కనబడదు, అడ్డదారులే గోచరిస్తాయి. ఈ దారులను ఆశ్రయించేవారు మృత్యుదేవత వద్దకే పోతుంటారు. ఆంతరిక పురోగతి ధ్యేయంగా చేసుకొన్న భగవన్మార్గం కఠినంగా తోచినా, ఆనందప్రదం.
- డాక్టర్ దామెర వేంకట సూర్యారావు
ᐅ భక్తిలోని పరమార్థం
ᐅ భక్తిలోని పరమార్థం!
జీవాత్మ పరమాత్మను చేరుకోవడానికి సోపానం 'భక్తి'. 'భక్తి' అంటే సేవించడం అని అర్థం. జీవాత్మ పుట్టుకకూ, స్థితికీ, చివరికి మోక్షానికీ మూలకారణమైనవాడు పరమాత్మ. కనుక జీవుడు బతికి ఉన్నంతకాలం సేవించవలసింది పరమాత్మనే కాని, అంతకంటె భిన్నమైనవారిని కాదు. పరమాత్మ ముందు సకల జీవరాశులూ అల్పమైనవే. వాటికి అస్తిత్వమేదీ లేదు. వాటికి ఉండే అస్తిత్వమంతా పరమాత్మలోనే. కనుక సేవించడం అనేది జీవుడి ప్రాణం ఉన్నంతవరకు పరమాత్మను ఉద్దేశించిందే.
భక్తి తొమ్మిది విధాలని భాగవతం చెబుతోంది. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అనే ఈ నవవిధ భక్తులు మానవుడి జీవితాన దినచర్యలోని అంశాలే కాని వేరు కాదు. భక్తి అంటే సేవించడం ఒక్కటేకాదనీ, భగవంతుడి పట్ల పరమప్రేమగా ఉండటం, ఎప్పుడూ తైలధారవలె ఎడబాటు లేకుండా అనుసంధానమై ఉండటం, ఇతరమైన ఆసక్తి ఏదీ లేకుండా భగవంతుడిపైనే ఆసక్తి కలిగి ఉండటం, భగవంతుడికి సర్వకాల సర్వావస్థల్లో అనుకూలంగా ఉండటం, ఎల్లవేళలా భగవంతుణ్ని స్మరించడం, ధ్యానం చేయడం, అంతఃకరణంలో భగవంతుడి ఆకృతిని ఆరాధించడం... మొదలైనవన్నీ భక్తిలోని అంతర్భాగాలేనని రుషుల ఉపదేశం.
లౌకికుడైన మానవుడు ఏ లాభమూ లేనిదే భగవంతుణ్ని అయినా తలచుకోడు. అందుకే భగవద్గీతలో కృష్ణుడు- 'ఓ అర్జునా! నన్ను నాలుగువిధాలుగా జనులు ఆశ్రయిస్తారు. వీరిలో మొదటిరకంవారు తమకేదైనా ఆపద కలిగితే దాన్ని తొలగించాలని కోరతారు. రెండోరకంవారు నా తత్వాన్ని తెలుసుకోవాలనే తపనతో ఉన్నవారు. మూడోరకంవారు డబ్బుకోసం నన్ను ప్రార్థించేవారు. నాలుగోరకంవారు జ్ఞానసముపార్జనకోసం నన్ను అర్థించేవారు. ఇలా ఎవరెవరు ఏ కోరికతో నన్ను భజిస్తారో వారి వారికి ఆయా ఫలితాలనే నేను ప్రసాదిస్తాను' అంటాడు. అంటే 'భక్తి' అనేది జీవుడి ఉపయోగం కోసమే తప్ప మరొకటి కాదని స్పష్టమవుతోంది. కోరికలే లేని భగవంతుడికి భక్తులు సమర్పించే వాటితో ఏ అవసరమూ లేదు. అయినా భగవంతుడు జీవులకోసం అన్నీ ఓర్చుకుంటాడు. ఏది ఇచ్చినా, ఇవ్వకున్నా పట్టించుకోడు. చిత్తశుద్ధిని మాత్రమే కోరుకుంటాడు. సద్గుణరాశిని ఇష్టపడతాడు.
భగవత్కథల శ్రవణం వల్ల పరీక్షిత్తు ముక్తిని పొందాడు. భగవన్నామ సంకీర్తనం వల్ల నారదాదియోగులు తరించారు. నారాయణ నామస్మరణం వల్ల అజామిళునివంటివారు పుణ్యాత్ములయ్యారు. భగవత్పాదసేవనం వల్ల భరతుడు కృతకృత్యుడయ్యాడు. భగవదర్చనం వల్ల విష్ణుచిత్తుడివంటి భాగవతోత్తముడు ధన్యుడయ్యాడు. భగవద్వందనంవల్ల రుషులు చిరంజీవులయ్యారు. భగవంతుడికి దాస్యం చేయడంవల్ల ఆంజనేయుడివంటివారు మహావీరులయ్యారు. భగవంతుడితో సఖ్యం చేసి సుదాముడు మోక్షాన్ని పొందాడు. భగవంతుడికి సర్వం అర్పణచేసి రంతిదేవుడివంటివారు త్రిలోకవంద్యులయ్యారు. ఇలా భక్తి చేయని పనిలేదు. మానవులకు భక్తిని మించిన మరొక ఉపాయం లోకంలో లేనేలేదు.
భక్తిలోని పరమార్థాన్ని గ్రహిస్తే ఏ చింతా ఉండదనడానికి ప్రహ్లాదాదులు నిదర్శనంగా నిలుస్తారు. దేనికంటే ఉత్తమమైనది మరొకటి లేదో, దేన్ని నిరంతరం భావిస్తే శాశ్వత శాంతి లభిస్తుందో అదే భగవద్విషయం. అంటే భగవంతుడికి సంబంధించిన మాట. అది అమృతతుల్యమైంది. దానికి జరామరణాలు లేవు. ఈతిబాధలు లేవు. లాభనష్టాల లెక్కలు లేవు. అన్నీ శుభాలే. అన్నీ లాభాలే. అన్నీ సౌభాగ్యాలే. అన్నీ ఆనందాలే. ఆనందాలకే ఆనందం, ఆహ్లాదానికే ఆహ్లాదం అయిన భగవంతుడిపైగల 'భక్తి' జీవాత్ములకు ఏకైక తరుణోపాయం. దాన్ని వదలకుండా ఉంటే లోకంలో ఏ జీవికీ బాధలు ఉండవు.
- డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ
జీవాత్మ పరమాత్మను చేరుకోవడానికి సోపానం 'భక్తి'. 'భక్తి' అంటే సేవించడం అని అర్థం. జీవాత్మ పుట్టుకకూ, స్థితికీ, చివరికి మోక్షానికీ మూలకారణమైనవాడు పరమాత్మ. కనుక జీవుడు బతికి ఉన్నంతకాలం సేవించవలసింది పరమాత్మనే కాని, అంతకంటె భిన్నమైనవారిని కాదు. పరమాత్మ ముందు సకల జీవరాశులూ అల్పమైనవే. వాటికి అస్తిత్వమేదీ లేదు. వాటికి ఉండే అస్తిత్వమంతా పరమాత్మలోనే. కనుక సేవించడం అనేది జీవుడి ప్రాణం ఉన్నంతవరకు పరమాత్మను ఉద్దేశించిందే.
భక్తి తొమ్మిది విధాలని భాగవతం చెబుతోంది. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అనే ఈ నవవిధ భక్తులు మానవుడి జీవితాన దినచర్యలోని అంశాలే కాని వేరు కాదు. భక్తి అంటే సేవించడం ఒక్కటేకాదనీ, భగవంతుడి పట్ల పరమప్రేమగా ఉండటం, ఎప్పుడూ తైలధారవలె ఎడబాటు లేకుండా అనుసంధానమై ఉండటం, ఇతరమైన ఆసక్తి ఏదీ లేకుండా భగవంతుడిపైనే ఆసక్తి కలిగి ఉండటం, భగవంతుడికి సర్వకాల సర్వావస్థల్లో అనుకూలంగా ఉండటం, ఎల్లవేళలా భగవంతుణ్ని స్మరించడం, ధ్యానం చేయడం, అంతఃకరణంలో భగవంతుడి ఆకృతిని ఆరాధించడం... మొదలైనవన్నీ భక్తిలోని అంతర్భాగాలేనని రుషుల ఉపదేశం.
లౌకికుడైన మానవుడు ఏ లాభమూ లేనిదే భగవంతుణ్ని అయినా తలచుకోడు. అందుకే భగవద్గీతలో కృష్ణుడు- 'ఓ అర్జునా! నన్ను నాలుగువిధాలుగా జనులు ఆశ్రయిస్తారు. వీరిలో మొదటిరకంవారు తమకేదైనా ఆపద కలిగితే దాన్ని తొలగించాలని కోరతారు. రెండోరకంవారు నా తత్వాన్ని తెలుసుకోవాలనే తపనతో ఉన్నవారు. మూడోరకంవారు డబ్బుకోసం నన్ను ప్రార్థించేవారు. నాలుగోరకంవారు జ్ఞానసముపార్జనకోసం నన్ను అర్థించేవారు. ఇలా ఎవరెవరు ఏ కోరికతో నన్ను భజిస్తారో వారి వారికి ఆయా ఫలితాలనే నేను ప్రసాదిస్తాను' అంటాడు. అంటే 'భక్తి' అనేది జీవుడి ఉపయోగం కోసమే తప్ప మరొకటి కాదని స్పష్టమవుతోంది. కోరికలే లేని భగవంతుడికి భక్తులు సమర్పించే వాటితో ఏ అవసరమూ లేదు. అయినా భగవంతుడు జీవులకోసం అన్నీ ఓర్చుకుంటాడు. ఏది ఇచ్చినా, ఇవ్వకున్నా పట్టించుకోడు. చిత్తశుద్ధిని మాత్రమే కోరుకుంటాడు. సద్గుణరాశిని ఇష్టపడతాడు.
భగవత్కథల శ్రవణం వల్ల పరీక్షిత్తు ముక్తిని పొందాడు. భగవన్నామ సంకీర్తనం వల్ల నారదాదియోగులు తరించారు. నారాయణ నామస్మరణం వల్ల అజామిళునివంటివారు పుణ్యాత్ములయ్యారు. భగవత్పాదసేవనం వల్ల భరతుడు కృతకృత్యుడయ్యాడు. భగవదర్చనం వల్ల విష్ణుచిత్తుడివంటి భాగవతోత్తముడు ధన్యుడయ్యాడు. భగవద్వందనంవల్ల రుషులు చిరంజీవులయ్యారు. భగవంతుడికి దాస్యం చేయడంవల్ల ఆంజనేయుడివంటివారు మహావీరులయ్యారు. భగవంతుడితో సఖ్యం చేసి సుదాముడు మోక్షాన్ని పొందాడు. భగవంతుడికి సర్వం అర్పణచేసి రంతిదేవుడివంటివారు త్రిలోకవంద్యులయ్యారు. ఇలా భక్తి చేయని పనిలేదు. మానవులకు భక్తిని మించిన మరొక ఉపాయం లోకంలో లేనేలేదు.
భక్తిలోని పరమార్థాన్ని గ్రహిస్తే ఏ చింతా ఉండదనడానికి ప్రహ్లాదాదులు నిదర్శనంగా నిలుస్తారు. దేనికంటే ఉత్తమమైనది మరొకటి లేదో, దేన్ని నిరంతరం భావిస్తే శాశ్వత శాంతి లభిస్తుందో అదే భగవద్విషయం. అంటే భగవంతుడికి సంబంధించిన మాట. అది అమృతతుల్యమైంది. దానికి జరామరణాలు లేవు. ఈతిబాధలు లేవు. లాభనష్టాల లెక్కలు లేవు. అన్నీ శుభాలే. అన్నీ లాభాలే. అన్నీ సౌభాగ్యాలే. అన్నీ ఆనందాలే. ఆనందాలకే ఆనందం, ఆహ్లాదానికే ఆహ్లాదం అయిన భగవంతుడిపైగల 'భక్తి' జీవాత్ములకు ఏకైక తరుణోపాయం. దాన్ని వదలకుండా ఉంటే లోకంలో ఏ జీవికీ బాధలు ఉండవు.
- డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ
ᐅ మేరీమాత ఉత్సవాలు
ᐅ మేరీమాత ఉత్సవాలు
ప్రత్యక్ష దైవాలు తల్లి, తండ్రి, గురువు. వీరిలో తల్లికే ప్రథమస్థానం. మాతృదేవోభవ అని తల్లిని కీర్తించారు. అలా తల్లి దేవుడికి ప్రతీకగా నిలిస్తే ఆ దేవుడికే జన్మనిచ్చిన తల్లి ఎంత గొప్పది? ఆమే యేసుక్రీస్తు ప్రభువుకు జన్మనిచ్చిన మేరీమాత. యేసుక్రీస్తు ప్రభువు వర్తమానం, ప్రబోధాలు విస్తరించిన అన్నిచోట్లా ఆమె తల్లి అయిన మేరీమాత పట్లా భక్తుల్లో ఎంతో ఆదరణ నమ్మకం, భక్తిప్రపత్తులు క్రీస్తుశకం రెండు అయిదో శతాబ్దాల మధ్యకాలంలోనే మొదలైంది.
1830లో పారిస్లోని సోదరి క్యాతరిన్ లాబార్ అనే క్రైస్తవ సన్యాసినికి మేరీమాత చిత్రపటంలో ఆమె దర్శనం కలిగిందని చెబుతారు. 15, 16 శతాబ్దాల మధ్యకాలంలో యూరప్లోని యుద్ధం, మత విప్లవాలవల్ల ఆనాటి ప్రజలు సాంత్వనకోసం ఆమెను ఆరాధించడం మొదలుపెట్టారు. కష్టాలనుంచి గట్టెక్కించే దేవతగా ఆమెను పూజించటం ప్రారంభించారు. మెడలో ఉత్తరీయం ధరించి, పాదయాత్రలు చేస్తూ నవదిన జపాలతో ఆ తల్లిని కీర్తించడం ఆనాడే ఆరంభమైంది. పందొమ్మిది, ఇరవై శతాబ్దాల్లో ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో మేరీమాత దివ్యదర్శనాలు కలిగాయని చెబుతారు. వేళాంగణి, లూర్థు, ఫాతిమా, గడలుపె, గారబాండల్ అనే ప్రాంతాల్లో మేరీమాత దర్శనమిచ్చిందంటారు. అనంతరకాలంలో ఆ ప్రాంతాలు సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలుగా పరిణామం చెందాయి. వీటిలో భారతదేశంలోని వేళాంగణి, ఫ్రాన్సుదేశంలోని లూర్థు, పోర్చుగల్లోని ఫాతిమా అత్యంత ప్రాచుర్యం పొందిన పుణ్యక్షేత్రాలు.
ఫ్రాన్సు దేశంలోని లూర్థునగరంలో 1858వ సంవత్సరంలో ఫిబ్రవరి 11న మేరీమాత బెర్నెదెత్ అనే బాలికకు దర్శనమిచ్చింది. ఆ దర్శనం స్ఫూర్తిగా 1925వ సంవత్సరంలో విజయవాడలోని గుణదలలో ఫాదర్ ఆర్లతి అనే మతబోధకులు మేరీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కాలగతిలో 1971వ సంవత్సరం వచ్చేసరికి ప్రకృతిసిద్ధమైన ఆ కొండ గుహల ప్రాంతం మేరీమాత ఆలయంగా రూపొందింది. ప్రతి సంవత్సరం ఆ ప్రాంతంలో జనవరి 31నుంచి తొమ్మిది రోజులు నవదిన ప్రార్థనలతో మొదలవుతాయి. ఫిబ్రవరి తొమ్మిది నుంచి 11 వరకు మూడు రోజులపాటు జరిగే ఉత్సవాలకు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది భక్తులు వస్తుంటారు. భక్తులు మేరీమాతను అమలోద్భవి, ఉత్థాపితమాత, వ్యాకులమాత అనే పేర్లతో వేరువేరు ప్రాంతాల్లో పూజిస్తున్నారు. మేరీమాత దేవుడి కుమారుడికి జన్మనిచ్చిన తల్లి. ఆమె తల్లి గర్భంనుంచే జన్మపాపం లేకుండా జన్మించింది. అందుకే ఆమె 'అమలోద్భవి' అన్నారు 13వ శతాబ్దంలో జీవించిన స్కోతుస్ అనే మత బోధకుడు.
మేరీమాత మూడేళ్ల వయసులోనే దేవుడి అనుగ్రహానికి పాత్రురాలై యెరుషలేము దేవాలయంలో అర్పణ చెంది అక్కడే పెరిగి పెద్దదైనట్లు, ఏడు సంవత్సరాల వయసులోనే కన్యకా వ్రత దీక్ష తీసుకున్నట్లు లేఖనాలు పేర్కొంటున్నాయి. అలా దైవకుమారుడికి జన్మనిచ్చి, ఆయన పునరుత్థానం వరకు ఆయనతో ఉండి తిరిగి మోక్షారోహణంతో తన జీవితాన్ని సంపూర్ణం చేసుకుందని, అందుకే ఆమె ఉత్థాపితమాతగా ఆధ్యాత్మికులు పేర్కొంటున్నారు. యేసుక్రీస్తు సిలువపై మరణయాతన అనుభవిస్తున్నప్పుడు సైనికులు ఆయన గుండెలపై ఈటెతో పొడిచిన దృశ్యం చూసిన ఆ తల్లి హృదయం, తన గుండెలోనే ఆ ఖడ్గం దిగినంతగా తల్లడిల్లిందని ఆమెను 'వ్యాకులమాత'గా భక్తులు ఆరాధిస్తున్నారు. బాల్యంలో యేసుక్రీస్తు దేవాలయంలో తప్పిపోయినప్పుడు ఆమె ఎంతో వ్యాకులపడింది. దీనుల పాప పరిహారార్థం సిలువపై బలియాగం చెందిన కుమారుడి మరణాన్ని తట్టుకుని ఆమె నిలబడింది. ఇన్ని కష్టాలు ఎదురైనా వాటిని ధైర్యంగా స్వీకరించి అంతులేని ఆత్మవిశ్వాసంతో దృఢచిత్తంతో ముందుకు సాగింది.
ఆ లోకమాతను ఆరాధించే క్రమంలో మేరీమాత ఒక స్త్రీ మూర్తి అనే విషయం గుర్తించాలి. నేటి సమాజంలోని స్త్రీమూర్తులను పూజనీయ భావంతో గౌరవించడం నేర్చుకోవాలి. నేడు స్త్రీలపై జరుగుతున్న అమానవీయ దాడుల్ని ఖండించాలి. ప్రతి స్త్రీ ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు వారిని సమాయత్తపరచాలి. అందుకు మేరీమాత ఉత్సవాలు ఒక వేదిక కావాలి. ఉత్సవాలకు విచ్చేస్తున్న ప్రతిఒక్కరు బాల్యంలో తమతమ తల్లులు చూపిన ప్రేమాభిమానాలను తిరిగి అనుభూతి చెందాలి. కుల, మత, ప్రాంతీయ, భాషా భేదాలకు అతీతంగా లక్షలాది భక్తులు మేరీమాత ఉత్సవాలకు విచ్చేయడంద్వారా ఈ ఉత్సవాలు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయి.
- డాక్టర్ ఎమ్.సుగుణరావు
ప్రత్యక్ష దైవాలు తల్లి, తండ్రి, గురువు. వీరిలో తల్లికే ప్రథమస్థానం. మాతృదేవోభవ అని తల్లిని కీర్తించారు. అలా తల్లి దేవుడికి ప్రతీకగా నిలిస్తే ఆ దేవుడికే జన్మనిచ్చిన తల్లి ఎంత గొప్పది? ఆమే యేసుక్రీస్తు ప్రభువుకు జన్మనిచ్చిన మేరీమాత. యేసుక్రీస్తు ప్రభువు వర్తమానం, ప్రబోధాలు విస్తరించిన అన్నిచోట్లా ఆమె తల్లి అయిన మేరీమాత పట్లా భక్తుల్లో ఎంతో ఆదరణ నమ్మకం, భక్తిప్రపత్తులు క్రీస్తుశకం రెండు అయిదో శతాబ్దాల మధ్యకాలంలోనే మొదలైంది.
1830లో పారిస్లోని సోదరి క్యాతరిన్ లాబార్ అనే క్రైస్తవ సన్యాసినికి మేరీమాత చిత్రపటంలో ఆమె దర్శనం కలిగిందని చెబుతారు. 15, 16 శతాబ్దాల మధ్యకాలంలో యూరప్లోని యుద్ధం, మత విప్లవాలవల్ల ఆనాటి ప్రజలు సాంత్వనకోసం ఆమెను ఆరాధించడం మొదలుపెట్టారు. కష్టాలనుంచి గట్టెక్కించే దేవతగా ఆమెను పూజించటం ప్రారంభించారు. మెడలో ఉత్తరీయం ధరించి, పాదయాత్రలు చేస్తూ నవదిన జపాలతో ఆ తల్లిని కీర్తించడం ఆనాడే ఆరంభమైంది. పందొమ్మిది, ఇరవై శతాబ్దాల్లో ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో మేరీమాత దివ్యదర్శనాలు కలిగాయని చెబుతారు. వేళాంగణి, లూర్థు, ఫాతిమా, గడలుపె, గారబాండల్ అనే ప్రాంతాల్లో మేరీమాత దర్శనమిచ్చిందంటారు. అనంతరకాలంలో ఆ ప్రాంతాలు సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలుగా పరిణామం చెందాయి. వీటిలో భారతదేశంలోని వేళాంగణి, ఫ్రాన్సుదేశంలోని లూర్థు, పోర్చుగల్లోని ఫాతిమా అత్యంత ప్రాచుర్యం పొందిన పుణ్యక్షేత్రాలు.
ఫ్రాన్సు దేశంలోని లూర్థునగరంలో 1858వ సంవత్సరంలో ఫిబ్రవరి 11న మేరీమాత బెర్నెదెత్ అనే బాలికకు దర్శనమిచ్చింది. ఆ దర్శనం స్ఫూర్తిగా 1925వ సంవత్సరంలో విజయవాడలోని గుణదలలో ఫాదర్ ఆర్లతి అనే మతబోధకులు మేరీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కాలగతిలో 1971వ సంవత్సరం వచ్చేసరికి ప్రకృతిసిద్ధమైన ఆ కొండ గుహల ప్రాంతం మేరీమాత ఆలయంగా రూపొందింది. ప్రతి సంవత్సరం ఆ ప్రాంతంలో జనవరి 31నుంచి తొమ్మిది రోజులు నవదిన ప్రార్థనలతో మొదలవుతాయి. ఫిబ్రవరి తొమ్మిది నుంచి 11 వరకు మూడు రోజులపాటు జరిగే ఉత్సవాలకు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది భక్తులు వస్తుంటారు. భక్తులు మేరీమాతను అమలోద్భవి, ఉత్థాపితమాత, వ్యాకులమాత అనే పేర్లతో వేరువేరు ప్రాంతాల్లో పూజిస్తున్నారు. మేరీమాత దేవుడి కుమారుడికి జన్మనిచ్చిన తల్లి. ఆమె తల్లి గర్భంనుంచే జన్మపాపం లేకుండా జన్మించింది. అందుకే ఆమె 'అమలోద్భవి' అన్నారు 13వ శతాబ్దంలో జీవించిన స్కోతుస్ అనే మత బోధకుడు.
మేరీమాత మూడేళ్ల వయసులోనే దేవుడి అనుగ్రహానికి పాత్రురాలై యెరుషలేము దేవాలయంలో అర్పణ చెంది అక్కడే పెరిగి పెద్దదైనట్లు, ఏడు సంవత్సరాల వయసులోనే కన్యకా వ్రత దీక్ష తీసుకున్నట్లు లేఖనాలు పేర్కొంటున్నాయి. అలా దైవకుమారుడికి జన్మనిచ్చి, ఆయన పునరుత్థానం వరకు ఆయనతో ఉండి తిరిగి మోక్షారోహణంతో తన జీవితాన్ని సంపూర్ణం చేసుకుందని, అందుకే ఆమె ఉత్థాపితమాతగా ఆధ్యాత్మికులు పేర్కొంటున్నారు. యేసుక్రీస్తు సిలువపై మరణయాతన అనుభవిస్తున్నప్పుడు సైనికులు ఆయన గుండెలపై ఈటెతో పొడిచిన దృశ్యం చూసిన ఆ తల్లి హృదయం, తన గుండెలోనే ఆ ఖడ్గం దిగినంతగా తల్లడిల్లిందని ఆమెను 'వ్యాకులమాత'గా భక్తులు ఆరాధిస్తున్నారు. బాల్యంలో యేసుక్రీస్తు దేవాలయంలో తప్పిపోయినప్పుడు ఆమె ఎంతో వ్యాకులపడింది. దీనుల పాప పరిహారార్థం సిలువపై బలియాగం చెందిన కుమారుడి మరణాన్ని తట్టుకుని ఆమె నిలబడింది. ఇన్ని కష్టాలు ఎదురైనా వాటిని ధైర్యంగా స్వీకరించి అంతులేని ఆత్మవిశ్వాసంతో దృఢచిత్తంతో ముందుకు సాగింది.
ఆ లోకమాతను ఆరాధించే క్రమంలో మేరీమాత ఒక స్త్రీ మూర్తి అనే విషయం గుర్తించాలి. నేటి సమాజంలోని స్త్రీమూర్తులను పూజనీయ భావంతో గౌరవించడం నేర్చుకోవాలి. నేడు స్త్రీలపై జరుగుతున్న అమానవీయ దాడుల్ని ఖండించాలి. ప్రతి స్త్రీ ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు వారిని సమాయత్తపరచాలి. అందుకు మేరీమాత ఉత్సవాలు ఒక వేదిక కావాలి. ఉత్సవాలకు విచ్చేస్తున్న ప్రతిఒక్కరు బాల్యంలో తమతమ తల్లులు చూపిన ప్రేమాభిమానాలను తిరిగి అనుభూతి చెందాలి. కుల, మత, ప్రాంతీయ, భాషా భేదాలకు అతీతంగా లక్షలాది భక్తులు మేరీమాత ఉత్సవాలకు విచ్చేయడంద్వారా ఈ ఉత్సవాలు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయి.
- డాక్టర్ ఎమ్.సుగుణరావు
ᐅ బాధ
ᐅ బాధ
దురదృష్టం, బాధలు, దుర్విధి- ఇవన్నీ మానవాళి అంతా అనుభవించవలసిందే. ప్రపంచంలో బాధ ఉపయోగం ఏమిటి? ప్రసిద్ధ తత్వవేత్తలను వేధించే ప్రశ్న అది. తుపానులు, భూకంపాలు, యుద్ధాల వంటి ప్రకృతి బీభత్సాల్లో అసంఖ్యాకులు మరణించడం చూసి కొందరు భగవంతుడు మంచివాడు కాడనుకుంటారు.
కష్టాలు, బాధలవల్లా ఉపయోగాలు ఉన్నాయన్నది పరిపూర్ణ అనుభవం పొందిన జ్ఞానులు చెప్పే మాట. వారు సృష్టిని, సృష్టిలోని రహస్యాలను ప్రగాఢంగా పరిశోధించిన పిమ్మటే ఆ అభిప్రాయానికి వచ్చారు.
బాధ అనేది లేకపోతే మహోన్నత భవితవ్యం, అమృతత్వ విజ్ఞానంవైపు మనిషి పరిణామం చెందడు. అతడిలో మనోవికాసం రాదు. బాధవల్లనే మానవాత్మ సృష్టి పరమార్థం ఏమిటో, విశ్వానికి అసలు పునాదులు ఏమిటో అర్థం చేసుకోగలుగుతుంది.
మనిషి ఆత్మ బాధాగ్ని ప్రజ్వలమైనప్పుడే జీవితాలు ఉత్తమ విలువలవైపు, జీవితాల అసలు స్వరూపం, శక్తి వైపు- జీవన ద్వారాలు తెరచుకుంటాయి.
బాధ వల్లనే అతి సూక్ష్మమైన ఆధ్యాత్మిక సీమలవైపు పురోగతి సాధ్యం అవుతుంది. బాధాగ్ని జ్వాలావలయాల్లో నడిచివెళ్లినప్పుడే జీవితాల పరిపూర్ణ సౌందర్యం, జ్యోతిర్మయ మహత్వం తెలుస్తాయి.
జీవి జన్మించాడంటే బాధామయ జీవితం సంసిద్ధంగా ఉందని అర్థం. ప్రతి బీజం బాధగా బద్దలైనప్పుడే పూలు, ఫలాల అందం, మాధురి బయటపడతాయి. స్త్రీ పురిటినొప్పుల పిమ్మటే అందమైన, అమాయకమైన, చిరునవ్వులు నవ్వే శిశువు ఉదయిస్తుంది. అగ్నిజ్వాలల్లో ముడిఖనిజం మండినప్పుడే మెరిసే స్వర్ణం ప్రవాహంలాగా బయటపడుతుంది. రాతిదెబ్బలు తిన్నప్పుడే ఏలకుల వంటి ద్రవ్యాల సుగంధం వ్యాపిస్తుంది. సాన రాపిడితో సగమయ్యే వజ్రం కాంతులీనుతుంది. నాగలితో భూమి గుండెను దున్నినప్పుడే పచ్చని పంటలు పండుతాయి.
బాధ లేకపోతే జీవితం పేలవంగా ఉంటుంది. జీవితానికి రుచి ఉండదు. వ్యధార్థ జీవన గర్భంనుంచే నిజమైన సౌందర్యం, శాంతి, ఆనందం ప్రభవిస్తాయి. బాధల పిమ్మట సుఖాల తీయదనం మరింత మనోహరంగా ఉంటుంది. అమృతత్వ లక్ష్యం సాధించదలచినవారు కష్టాలు, కన్నీరు, పరీక్షలను చిరునవ్వుతో ఆహ్వానిస్తారు. అవన్నీ వారి సంకల్ప శక్తిని మరింత పెంచుతాయి. శాంతి, ఆనంద శిఖరాలకు బాధలే సోపానాలు. ఆత్మ అమృతశాంతి పొందినప్పుడు జీవితం ఒక నిరంతర, అవర్ణనీయ ఆనందసుధా స్రవంతిగా మారుతుంది. బాధలు, కష్టాలు తమ విజయ కేతనాన్ని ఆ శిఖరాగ్రంపై ఎగరవేస్తాయి.
సృష్టికర్త కరుణార్ద్ర హృదయుడని, దయాసింధువని వారు లోకానికి ప్రకటిస్తారు. ప్రపంచంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు తమకు అనుకూలంగా లేవని వారు తప్పుపట్టరు. జీవితంలోని అతి ప్రగాఢ చీకటి క్షణాలు అమృత మహోదయాలకు మణిద్వారాలని వారికి తెలుసు. బాధల వల్ల ఆత్మ పువ్వులా విరిసి, అనంతత్వపు పరిమళాలు వెదజల్లుతుంది. శాశ్వతత్వపు ఆనందం వశమవుతుంది. శాంతి, కాంతి, ప్రేమ నిరపేక్ష ప్రవాహాలుగా పొంగి ముంచెత్తుతాయి.
- కె.యజ్ఞన్న
దురదృష్టం, బాధలు, దుర్విధి- ఇవన్నీ మానవాళి అంతా అనుభవించవలసిందే. ప్రపంచంలో బాధ ఉపయోగం ఏమిటి? ప్రసిద్ధ తత్వవేత్తలను వేధించే ప్రశ్న అది. తుపానులు, భూకంపాలు, యుద్ధాల వంటి ప్రకృతి బీభత్సాల్లో అసంఖ్యాకులు మరణించడం చూసి కొందరు భగవంతుడు మంచివాడు కాడనుకుంటారు.
కష్టాలు, బాధలవల్లా ఉపయోగాలు ఉన్నాయన్నది పరిపూర్ణ అనుభవం పొందిన జ్ఞానులు చెప్పే మాట. వారు సృష్టిని, సృష్టిలోని రహస్యాలను ప్రగాఢంగా పరిశోధించిన పిమ్మటే ఆ అభిప్రాయానికి వచ్చారు.
బాధ అనేది లేకపోతే మహోన్నత భవితవ్యం, అమృతత్వ విజ్ఞానంవైపు మనిషి పరిణామం చెందడు. అతడిలో మనోవికాసం రాదు. బాధవల్లనే మానవాత్మ సృష్టి పరమార్థం ఏమిటో, విశ్వానికి అసలు పునాదులు ఏమిటో అర్థం చేసుకోగలుగుతుంది.
మనిషి ఆత్మ బాధాగ్ని ప్రజ్వలమైనప్పుడే జీవితాలు ఉత్తమ విలువలవైపు, జీవితాల అసలు స్వరూపం, శక్తి వైపు- జీవన ద్వారాలు తెరచుకుంటాయి.
బాధ వల్లనే అతి సూక్ష్మమైన ఆధ్యాత్మిక సీమలవైపు పురోగతి సాధ్యం అవుతుంది. బాధాగ్ని జ్వాలావలయాల్లో నడిచివెళ్లినప్పుడే జీవితాల పరిపూర్ణ సౌందర్యం, జ్యోతిర్మయ మహత్వం తెలుస్తాయి.
జీవి జన్మించాడంటే బాధామయ జీవితం సంసిద్ధంగా ఉందని అర్థం. ప్రతి బీజం బాధగా బద్దలైనప్పుడే పూలు, ఫలాల అందం, మాధురి బయటపడతాయి. స్త్రీ పురిటినొప్పుల పిమ్మటే అందమైన, అమాయకమైన, చిరునవ్వులు నవ్వే శిశువు ఉదయిస్తుంది. అగ్నిజ్వాలల్లో ముడిఖనిజం మండినప్పుడే మెరిసే స్వర్ణం ప్రవాహంలాగా బయటపడుతుంది. రాతిదెబ్బలు తిన్నప్పుడే ఏలకుల వంటి ద్రవ్యాల సుగంధం వ్యాపిస్తుంది. సాన రాపిడితో సగమయ్యే వజ్రం కాంతులీనుతుంది. నాగలితో భూమి గుండెను దున్నినప్పుడే పచ్చని పంటలు పండుతాయి.
బాధ లేకపోతే జీవితం పేలవంగా ఉంటుంది. జీవితానికి రుచి ఉండదు. వ్యధార్థ జీవన గర్భంనుంచే నిజమైన సౌందర్యం, శాంతి, ఆనందం ప్రభవిస్తాయి. బాధల పిమ్మట సుఖాల తీయదనం మరింత మనోహరంగా ఉంటుంది. అమృతత్వ లక్ష్యం సాధించదలచినవారు కష్టాలు, కన్నీరు, పరీక్షలను చిరునవ్వుతో ఆహ్వానిస్తారు. అవన్నీ వారి సంకల్ప శక్తిని మరింత పెంచుతాయి. శాంతి, ఆనంద శిఖరాలకు బాధలే సోపానాలు. ఆత్మ అమృతశాంతి పొందినప్పుడు జీవితం ఒక నిరంతర, అవర్ణనీయ ఆనందసుధా స్రవంతిగా మారుతుంది. బాధలు, కష్టాలు తమ విజయ కేతనాన్ని ఆ శిఖరాగ్రంపై ఎగరవేస్తాయి.
సృష్టికర్త కరుణార్ద్ర హృదయుడని, దయాసింధువని వారు లోకానికి ప్రకటిస్తారు. ప్రపంచంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు తమకు అనుకూలంగా లేవని వారు తప్పుపట్టరు. జీవితంలోని అతి ప్రగాఢ చీకటి క్షణాలు అమృత మహోదయాలకు మణిద్వారాలని వారికి తెలుసు. బాధల వల్ల ఆత్మ పువ్వులా విరిసి, అనంతత్వపు పరిమళాలు వెదజల్లుతుంది. శాశ్వతత్వపు ఆనందం వశమవుతుంది. శాంతి, కాంతి, ప్రేమ నిరపేక్ష ప్రవాహాలుగా పొంగి ముంచెత్తుతాయి.
- కె.యజ్ఞన్న
ᐅ జీవిత పరమార్థం
ᐅ జీవిత పరమార్థం
కావ్య ప్రపంచంలో కరుణ రసానికి పెద్దపీట వేశాడు భవభూతి మహాకవి. అసలు వాల్మీకి మహర్షి కన్నీటి నుంచే ఆది కావ్యమైన రామాయణం పుట్టింది. కరుణరసం కఠిన పాషాణాన్నీ వెన్నగా చేస్తుంది. ఇక స్త్రీ హృదయంలా సుకుమారం, కోమలమైన కవి హృదయం గురించి వేరే చెప్పాలా? వేటగాడి వేటు తిన్న మగపక్షి నేలమీద పడి గిలగిల్లాడుతోంది. ఆడ పక్షి దానిచుట్టూ తిరుగుతూ రోదిస్తోంది. ఈ దృశ్యం కనిపించగానే వాల్మీకి గుండె పగిలింది. ఆ తరవాత ఆయనలో కోపం రగిలింది. నిషాదుడు కల్పించిన విషాద సంఘటన నేపథ్యంలో శోకతప్తమైన వాల్మీకి హృదయ ఘోష శ్లోకమై వెలువడింది.
మానవ జీవితం ఒక ప్రవాహం లాంటిది. ఎక్కడో కొండచరియలపై నుంచి కిందికి దూకి, ఎత్తుపల్లాలు దాటుకుంటూ, ఎన్నెన్నో మలుపులు తిరిగి మైదానం చేరుకుంటుంది. కొండవాగు విశాలమైన నదిగా మారి చివరికి సాగరసంగమం సాధించినప్పుడే ప్రవాహం శాంతిస్తుంది. మనిషి జీవితమూ ఎన్నో ఒడుదొకులు ఎదుర్కొని, కన్నీళ్ళు పన్నీళ్లు పంచుకుంటోంది. జీవితం నేర్పే పాఠాలను జీర్ణించుకుని తనలో లోటుపాట్లు సరిదిద్దుకుని పరిపూర్ణత్వం సాధించినప్పుడే జీవితం ధన్యమవుతుంది. ఎదుటి మనిషి కన్నీళ్లను అర్థం చేసుకోవటానికి ఈ ప్రపంచాన్ని ఒక ప్రయోగశాలగా స్వీకరించాలి. ఎదుటి మనిషి కష్టాలకు స్పందించని మనిషి జీవితం అడవిలోని మానుతో సమానం. బాధను, వ్యధను అర్థం చేసుకుని ఆర్ద్రత చెందినప్పుడే మనిషికి, మనిషికి మధ్య స్నేహానుబంధాలు చిగురిస్తాయి. కష్టసుఖాలు పంచుకుని కలకాలం మనగలిగినప్పుడే ఆ స్నేహం నిజమైన స్నేహంగా గుర్తింపు పొందుతుంది.
జీవితంలో మనకు మూడు రకాలైన మనుషులు కనిపిస్తారు. వారివారి మనస్తత్వాలనుబట్టి మనిషికీ మనిషికీ మధ్య తేడాలు కనిపిస్తాయి. హితుడు, సన్నిహితుడు, స్నేహితుడు- ఈ ముగ్గురూ ఒకేలా అనిపించినా, నడుమ కనిపించని అంతరాలున్నాయి. హితుడు సలహాలకు పరిమితమై తన చుట్టూ ఒక గిరిగీసుకుంటాడు. సన్నిహితుడు ఒక అడుగు ముందుకువేసి భుజంతట్టి శుభం పలుకుతాడు. చివరికి ఆదుకుని అడుగులో అడుగువేస్తూ కలిసి నడిచేవాడు స్నేహితుడొక్కడే! మనల్ని నిజంగా ప్రేమించేవాడే స్నేహ హస్తం చాచి స్వాగతిస్తాడు. ఆ తరవాత మనకోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడతాడు. హితుడు, సన్నిహితుడు సానుభూతి అందజేయవచ్చు కాని, సహ అనుభూతి స్నేహానికే చెల్లుతుంది. బాధను వ్యధను పంచుకుని ఆనందాన్ని అందివ్వటానికి స్నేహితుడు ఎప్పుడూ ముందువరసలో ఉంటాడు. అందుకే స్నేహాన్ని అమృతంగా, మైత్రీబంధాన్ని అద్వైత సౌందర్యంగా కవులు వర్ణిస్తారు.
ప్రేమ, కరుణ, స్నేహంలాంటి సుకుమారమైన మనోభావాలకు రూపకల్పన మానవ హృదయంలోనే జరుగుతుంది. కరుణామయుడైన పరమాత్మ నివసించేది హృదయ మందిరంలోనే! బాధ, వ్యధ శరీరానికి, మనసుకు సంబంధించిన జాడ్యాలు. కాలికి దెబ్బ తగిలితే కళ్లవెంట నీళ్లు జల్లుమని రాలుతాయి. ఈ రెంటికీ అవినాభావ సంబంధం ఉంది. తాత్కాలికంగా అవి జీవితంలో అలజడి సృష్టించే మాట నిజమే కాని, ఆధ్యాత్మికంగా పురోగమించటానికి పరిపూర్ణమైన మానవుడై పరిమళించటానికి పరోక్షంగా తోడ్పడతాయి. అందుకే కష్టాలను భగవంతుడి దీవెనలుగా, వరాలుగా స్వీకరించాలంటారు స్వామి శివానందులవారు. కరుణామయుడైన బుద్ధ భగవానుడు మానవ హృదయాల్లో నేటికీ అఖండజ్యోతి స్వరూపమై వెలుగుతున్నాడు. బౌద్ధులు 'టోంగ్-లెన్' అనే ధ్యానముద్రలో కరుణరసావిష్కరణ కోసం ఏకాగ్రబుద్ధితో గుండె కరిగించే సంఘటనలు సందర్శిస్తారు. దుర్లభమైన మానవ జీవిత పరమార్థం- ఉన్న నాలుగునాళ్లు హృదయాళువుగా మనగలగటమే!
- ఉప్పు రాఘవేంద్రరావు
కావ్య ప్రపంచంలో కరుణ రసానికి పెద్దపీట వేశాడు భవభూతి మహాకవి. అసలు వాల్మీకి మహర్షి కన్నీటి నుంచే ఆది కావ్యమైన రామాయణం పుట్టింది. కరుణరసం కఠిన పాషాణాన్నీ వెన్నగా చేస్తుంది. ఇక స్త్రీ హృదయంలా సుకుమారం, కోమలమైన కవి హృదయం గురించి వేరే చెప్పాలా? వేటగాడి వేటు తిన్న మగపక్షి నేలమీద పడి గిలగిల్లాడుతోంది. ఆడ పక్షి దానిచుట్టూ తిరుగుతూ రోదిస్తోంది. ఈ దృశ్యం కనిపించగానే వాల్మీకి గుండె పగిలింది. ఆ తరవాత ఆయనలో కోపం రగిలింది. నిషాదుడు కల్పించిన విషాద సంఘటన నేపథ్యంలో శోకతప్తమైన వాల్మీకి హృదయ ఘోష శ్లోకమై వెలువడింది.
మానవ జీవితం ఒక ప్రవాహం లాంటిది. ఎక్కడో కొండచరియలపై నుంచి కిందికి దూకి, ఎత్తుపల్లాలు దాటుకుంటూ, ఎన్నెన్నో మలుపులు తిరిగి మైదానం చేరుకుంటుంది. కొండవాగు విశాలమైన నదిగా మారి చివరికి సాగరసంగమం సాధించినప్పుడే ప్రవాహం శాంతిస్తుంది. మనిషి జీవితమూ ఎన్నో ఒడుదొకులు ఎదుర్కొని, కన్నీళ్ళు పన్నీళ్లు పంచుకుంటోంది. జీవితం నేర్పే పాఠాలను జీర్ణించుకుని తనలో లోటుపాట్లు సరిదిద్దుకుని పరిపూర్ణత్వం సాధించినప్పుడే జీవితం ధన్యమవుతుంది. ఎదుటి మనిషి కన్నీళ్లను అర్థం చేసుకోవటానికి ఈ ప్రపంచాన్ని ఒక ప్రయోగశాలగా స్వీకరించాలి. ఎదుటి మనిషి కష్టాలకు స్పందించని మనిషి జీవితం అడవిలోని మానుతో సమానం. బాధను, వ్యధను అర్థం చేసుకుని ఆర్ద్రత చెందినప్పుడే మనిషికి, మనిషికి మధ్య స్నేహానుబంధాలు చిగురిస్తాయి. కష్టసుఖాలు పంచుకుని కలకాలం మనగలిగినప్పుడే ఆ స్నేహం నిజమైన స్నేహంగా గుర్తింపు పొందుతుంది.
జీవితంలో మనకు మూడు రకాలైన మనుషులు కనిపిస్తారు. వారివారి మనస్తత్వాలనుబట్టి మనిషికీ మనిషికీ మధ్య తేడాలు కనిపిస్తాయి. హితుడు, సన్నిహితుడు, స్నేహితుడు- ఈ ముగ్గురూ ఒకేలా అనిపించినా, నడుమ కనిపించని అంతరాలున్నాయి. హితుడు సలహాలకు పరిమితమై తన చుట్టూ ఒక గిరిగీసుకుంటాడు. సన్నిహితుడు ఒక అడుగు ముందుకువేసి భుజంతట్టి శుభం పలుకుతాడు. చివరికి ఆదుకుని అడుగులో అడుగువేస్తూ కలిసి నడిచేవాడు స్నేహితుడొక్కడే! మనల్ని నిజంగా ప్రేమించేవాడే స్నేహ హస్తం చాచి స్వాగతిస్తాడు. ఆ తరవాత మనకోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడతాడు. హితుడు, సన్నిహితుడు సానుభూతి అందజేయవచ్చు కాని, సహ అనుభూతి స్నేహానికే చెల్లుతుంది. బాధను వ్యధను పంచుకుని ఆనందాన్ని అందివ్వటానికి స్నేహితుడు ఎప్పుడూ ముందువరసలో ఉంటాడు. అందుకే స్నేహాన్ని అమృతంగా, మైత్రీబంధాన్ని అద్వైత సౌందర్యంగా కవులు వర్ణిస్తారు.
ప్రేమ, కరుణ, స్నేహంలాంటి సుకుమారమైన మనోభావాలకు రూపకల్పన మానవ హృదయంలోనే జరుగుతుంది. కరుణామయుడైన పరమాత్మ నివసించేది హృదయ మందిరంలోనే! బాధ, వ్యధ శరీరానికి, మనసుకు సంబంధించిన జాడ్యాలు. కాలికి దెబ్బ తగిలితే కళ్లవెంట నీళ్లు జల్లుమని రాలుతాయి. ఈ రెంటికీ అవినాభావ సంబంధం ఉంది. తాత్కాలికంగా అవి జీవితంలో అలజడి సృష్టించే మాట నిజమే కాని, ఆధ్యాత్మికంగా పురోగమించటానికి పరిపూర్ణమైన మానవుడై పరిమళించటానికి పరోక్షంగా తోడ్పడతాయి. అందుకే కష్టాలను భగవంతుడి దీవెనలుగా, వరాలుగా స్వీకరించాలంటారు స్వామి శివానందులవారు. కరుణామయుడైన బుద్ధ భగవానుడు మానవ హృదయాల్లో నేటికీ అఖండజ్యోతి స్వరూపమై వెలుగుతున్నాడు. బౌద్ధులు 'టోంగ్-లెన్' అనే ధ్యానముద్రలో కరుణరసావిష్కరణ కోసం ఏకాగ్రబుద్ధితో గుండె కరిగించే సంఘటనలు సందర్శిస్తారు. దుర్లభమైన మానవ జీవిత పరమార్థం- ఉన్న నాలుగునాళ్లు హృదయాళువుగా మనగలగటమే!
- ఉప్పు రాఘవేంద్రరావు
ᐅ ఆధ్యాత్మిక ప్రగతి
ᐅ ఆధ్యాత్మిక ప్రగతి
ఆధ్యాత్మిక జీవనం ప్రపంచంలో యాంత్రికంగా మారిపోయింది.
అలవాటుగా ఉదయాన్నే లేచి, స్నానసంధ్యలు ముగించుకుని, నొసట విభూతిరేఖలో, త్రిపుండ్రాలో, కుంకుమబొట్టో ధరించి, ఇష్టదేవతా పూజకు కూర్చోవడం, ఎలాగోలా ముగించి, ప్రసాదం పుచ్చుకొని 'హమ్మయ్య! ఓ పనైపోయింది' అనుకోవడంతో ఆరోజు కార్యక్రమంలో ఒక ఘట్టం ముగుస్తుంది. రోజంతా ఏవేవో వృత్తివ్యాపారాల వ్యాపకాలు, సాయంత్రానికి అలసట. భోజనానంతరం నిద్ర. తెల్లారగానే మళ్ళీ పాత దినచర్య.
ఇలా మన ఆధ్యాత్మికత గొర్రెతోకలాగ ఎదుగుబొదుగులేకుండా, కాగితం పువ్వులా చూడటానికి తప్ప, ఆనందం కలిగించేదిగా ఉండదు. ప్రకృతిని పరిశీలించండి. మొక్కలు ప్రతిరోజూ ప్రగతిని చూపిస్తాయి. కొత్తచివుళ్లు వేస్తాయి. పువ్వులు పూస్తాయి. పువ్వులు కాయలవుతాయి. కాయలు పళ్లవుతాయి. మనకు కనిపించే ఈ ప్రగతిలో ఒక మౌనసందేశం ఉంది.
చైతన్యమే జీవితం, జడత్వం కాదు- అన్నదే ఆ సందేశం. ప్రతిరోజూ మన ఆయుష్షు తగ్గిపోతుంటుంది.
జ్ఞానం మాత్రం ఎదగకుండా ఉండిపోతోంది. కొవ్వొత్తి కరిగిపోతున్నా, చివరిదాకా వెలుగునిస్తూనే ఉంటుంది. అదే మనకు ఆదర్శం కావాలి.
ఎంతకాలం జీవించామని కాదు.
జీవితాన్ని ఎంత సఫలీకృతం చేసుకున్నామన్నదే ముఖ్యం.
తపస్సు విషయం చూడండి. ప్రతిరోజూ తాపసికి శక్తి పెరుగుతూనే ఉంటుంది. పౌరాణికగాథలు- మహాతపస్వుల తపోజ్వాలలు వూర్ధ్వలోకాలను తల్లడిల్లజేశాయని, దేవుడు దిగిరాక, వరాలు ఇవ్వక తప్పలేదని చెబుతారు.
ఆధ్యాత్మిక ప్రగతికది పరాకాష్ఠ అన్నమాట.
పరమేష్ఠి అయినా, పరమేశ్వరుడైనా, పరాత్పరుడైనా, తపస్వికి వరాలియ్యక తప్పదు. ఈ పరమసత్యాన్ని మనం మరచిపోకూడదు. మనందరం తపస్వులం కాకపోవచ్చు. కానీ తమస్వులం కాకుండా మనల్ని మనం తప్పక కాపాడుకోగలం.
యాంత్రిక పూజాతంతులకు బదులు, ఆత్మతో, అంతర్యామితో అనుసంధానానికి అహరహం కృషిచెయ్యాలి. ఏ క్షణంలో మనకు 'ఈ శరీరం నేను కాదు' అనే స్థిరబుద్ధి కలుగుతుందో, ఆ క్షణమే మనకు జ్ఞానమార్గం దొరికినట్లు! ఆ క్షణం నుంచీ...
మనం ఎవరినీ శరీరధారులుగా చూడం.
ఆత్మజ్యోతులుగానే చూస్తాం. 'ఆత్మవత్ సర్వభూతాని' అన్నట్లుగా- అన్నింటా అంతటా ఆత్మనే చూడగల స్థాయికి చేరుకోవటమే అసలైన ఆధ్యాత్మిక ప్రగతి.
అప్పుడు కులమత భేదాలుండవు. అసూయాద్వేషాలు ఉండవు. ఆధిక్యతాభావాలు, అహంకారమూ ఉండవు.
ఎటు చూసినా ఆనంద తరంగాలు... ఎవర్ని చూసినా ఆత్మీయతాభావాలు... ఇదే భారతీయ ఆధ్యాత్మిక పునాది.
ఈ పునాదుల్ని తిరిగి మనం నిర్మించుకోవాలి.
- కాటూరు రవీంద్రత్రివిక్రమ్
ఆధ్యాత్మిక జీవనం ప్రపంచంలో యాంత్రికంగా మారిపోయింది.
అలవాటుగా ఉదయాన్నే లేచి, స్నానసంధ్యలు ముగించుకుని, నొసట విభూతిరేఖలో, త్రిపుండ్రాలో, కుంకుమబొట్టో ధరించి, ఇష్టదేవతా పూజకు కూర్చోవడం, ఎలాగోలా ముగించి, ప్రసాదం పుచ్చుకొని 'హమ్మయ్య! ఓ పనైపోయింది' అనుకోవడంతో ఆరోజు కార్యక్రమంలో ఒక ఘట్టం ముగుస్తుంది. రోజంతా ఏవేవో వృత్తివ్యాపారాల వ్యాపకాలు, సాయంత్రానికి అలసట. భోజనానంతరం నిద్ర. తెల్లారగానే మళ్ళీ పాత దినచర్య.
ఇలా మన ఆధ్యాత్మికత గొర్రెతోకలాగ ఎదుగుబొదుగులేకుండా, కాగితం పువ్వులా చూడటానికి తప్ప, ఆనందం కలిగించేదిగా ఉండదు. ప్రకృతిని పరిశీలించండి. మొక్కలు ప్రతిరోజూ ప్రగతిని చూపిస్తాయి. కొత్తచివుళ్లు వేస్తాయి. పువ్వులు పూస్తాయి. పువ్వులు కాయలవుతాయి. కాయలు పళ్లవుతాయి. మనకు కనిపించే ఈ ప్రగతిలో ఒక మౌనసందేశం ఉంది.
చైతన్యమే జీవితం, జడత్వం కాదు- అన్నదే ఆ సందేశం. ప్రతిరోజూ మన ఆయుష్షు తగ్గిపోతుంటుంది.
జ్ఞానం మాత్రం ఎదగకుండా ఉండిపోతోంది. కొవ్వొత్తి కరిగిపోతున్నా, చివరిదాకా వెలుగునిస్తూనే ఉంటుంది. అదే మనకు ఆదర్శం కావాలి.
ఎంతకాలం జీవించామని కాదు.
జీవితాన్ని ఎంత సఫలీకృతం చేసుకున్నామన్నదే ముఖ్యం.
తపస్సు విషయం చూడండి. ప్రతిరోజూ తాపసికి శక్తి పెరుగుతూనే ఉంటుంది. పౌరాణికగాథలు- మహాతపస్వుల తపోజ్వాలలు వూర్ధ్వలోకాలను తల్లడిల్లజేశాయని, దేవుడు దిగిరాక, వరాలు ఇవ్వక తప్పలేదని చెబుతారు.
ఆధ్యాత్మిక ప్రగతికది పరాకాష్ఠ అన్నమాట.
పరమేష్ఠి అయినా, పరమేశ్వరుడైనా, పరాత్పరుడైనా, తపస్వికి వరాలియ్యక తప్పదు. ఈ పరమసత్యాన్ని మనం మరచిపోకూడదు. మనందరం తపస్వులం కాకపోవచ్చు. కానీ తమస్వులం కాకుండా మనల్ని మనం తప్పక కాపాడుకోగలం.
యాంత్రిక పూజాతంతులకు బదులు, ఆత్మతో, అంతర్యామితో అనుసంధానానికి అహరహం కృషిచెయ్యాలి. ఏ క్షణంలో మనకు 'ఈ శరీరం నేను కాదు' అనే స్థిరబుద్ధి కలుగుతుందో, ఆ క్షణమే మనకు జ్ఞానమార్గం దొరికినట్లు! ఆ క్షణం నుంచీ...
మనం ఎవరినీ శరీరధారులుగా చూడం.
ఆత్మజ్యోతులుగానే చూస్తాం. 'ఆత్మవత్ సర్వభూతాని' అన్నట్లుగా- అన్నింటా అంతటా ఆత్మనే చూడగల స్థాయికి చేరుకోవటమే అసలైన ఆధ్యాత్మిక ప్రగతి.
అప్పుడు కులమత భేదాలుండవు. అసూయాద్వేషాలు ఉండవు. ఆధిక్యతాభావాలు, అహంకారమూ ఉండవు.
ఎటు చూసినా ఆనంద తరంగాలు... ఎవర్ని చూసినా ఆత్మీయతాభావాలు... ఇదే భారతీయ ఆధ్యాత్మిక పునాది.
ఈ పునాదుల్ని తిరిగి మనం నిర్మించుకోవాలి.
- కాటూరు రవీంద్రత్రివిక్రమ్
ᐅ రజ్జు సర్ప భ్రాంతి
ᐅ రజ్జు సర్ప భ్రాంతి
మనిషి అమృత పుత్రుడు. ఆత్మస్వరూపుడు. సాక్షాత్ బ్రహ్మ! సాధారణ స్థాయిలోని మనుషులెవరూ ఈ మాటల్ని నమ్మరు. పూర్తిస్థాయి సాధన చేయనివారూ పూర్తిగా నమ్మరు. సహజమే. ఎప్పటికప్పుడు మరణిస్తూ పోతున్న మనిషికి మరణం లేకపోవటమేమిటి?! అమృతత్వమేమిటి!?
మనిషికున్న భయాల్లో మరణం తరవాతే ఏదైనా. అయితే మరణం అన్నది మనం కల్పించుకున్నదే. మన మనసు కల్పించుకున్నదే. కనీసం దాని అర్థం. దేహ, మనో స్థాయులనుంచి పైకెదగలేని, భూస్థాయిలోని మనిషికి మరణ భయం సహజమే. మనం శరీరం కాదు. ఆత్మ అనే జ్ఞానాన్ని పొందినప్పుడు, ఆత్మకు మరణం లేదు కాబట్టి అమృతత్వాన్ని పొందటం అంటే ఏమిటో అర్థమవుతుంది. చాలామందికి అనుమానం... మరణం లేకపోవటం ఏమిటి! వీరాధివీరుడైనా, చక్రవర్తి అయినా, చివరకు మహా భక్తుడైనా, మహిమాన్వితుడైనా మనిషన్నాక మరణించే తీరుతున్నాడు కదా అని. నిజమే. కానీ దేహభావం నశించాక ఇక మరణం ఎక్కడుంది? తాను దేహం కాదు, ఆత్మ అని గ్రహించాక జీర్ణమైన వస్త్రాన్ని తొలగించుకున్నట్లు మరణం పేరిట దేహం రాలిపోతుంటే నిర్వికారంగా, నిర్లిప్తంగా చూస్తాడు మనిషి.
అయితే 'మరక... మంచిదే' అన్నంత సులభం కాదు మరణం మంచిదే అనటమైనా. నమ్మటమైనా. ఎందుకంటే 'నేను దేహం కాదు, ఆత్మ' అనే స్పృహ ఉన్నవారే మరణాన్ని కేవలం మార్పుగానే అంగీకరించగలరు. ఆనందించగలరు. ఎందుకంటే జీర్ణవస్త్రాన్ని వదిలివేయటం ఎవరికైనా ఆనందదాయకమే! దేహం వస్త్రంలాంటిదనే జ్ఞానం కావాలి. ఈ జ్ఞానం, స్థాయి వూరకే రావు. దాని వెనక ఎంతో ప్రయత్నం, పట్టుదల, సాధన, సుకృతం ఉండాలి. వీటివల్ల రాత్రి చీకట్లో ఉన్నంత అయోమయంలోంచి క్రమంగా ఉదయించే కాంతిపుంజాల జల్లులో తానే ఓ ఉషోదయమైనట్లు మనిషి ప్రయత్న ఫలంగా, తపోఫలంగా తనకు తెలీకుండానే తానే ఓ జ్ఞానజ్యోతిలా వెలగటం ప్రారంభిస్తాడు. అలాంటివారికి మాత్రమే నేను ఆత్మననే ఉత్కృష్ట భావన స్థిరమవుతుంది. తనను తాను ఆత్మగా భావించేవారు, ఆత్మగా జీవించేవారు తాను మరణిస్తాననే భావనకు అతీతంగా ఉంటారు. అంతర్ముఖులై ఉంటారు. ఇదే మరణాతీతం అంటే. అమృతత్వం అంటే. మరణ భావన లేనివాడు అమృత పుత్రుడు. ఇది ఉన్నపాటున రాదు. మనం ముందు సద్గురువు ద్వారా, సత్సంగం ద్వారా పరతత్వాన్ని గ్రహించాలి. గ్రహించినదాన్ని ఆచరణలో పెట్టాలి. తీవ్ర సాధన చేయాలి. 'నేను శరీరాన్ని కాదు, ఆత్మను' అని వినటం, చదవటం, అనుకోవటం... చాలా సులభం. అయినంత మాత్రాన ఆత్మ భావంలో నిలబడలేం. చిత్తశుద్ధితో సాధన చేయాలి. తపించాలి. ప్రాణంపెట్టి ఆ భావాన్ని నిలుపుకొనే ప్రయత్నం చేయాలి.
మరణ భయం మనిషిని అనుక్షణం మరణింపజేస్తుంది. ఈ భయాన్నించి మనిషి బయటపడినప్పుడే జీవితాన్ని ఆస్వాదించగలడు. మరణం అనేది ఎప్పుడైనా సూచించి వచ్చేది కాదు. ఉరికంబం ఎక్కి మెడలో ఉరితాడు పడినవాడూ శిక్షనుంచి బయటపడవచ్చు. శ్మశానంలో చితిమీద శవంగా ఉంచబడినవాడూ లేచిరావచ్చు. మరణం అనేది మామూలు మనిషికి సంబంధించినంత వరకూ ఒక ప్రమాదం. అనుకోని అకస్మాత్ సంఘటన. దానికోసం అనుక్షణం భయంతో మరణించాల్సిన అవసరం లేదు. ఇంత జీవితాన్నీ చివరాఖర్లో ఎప్పుడో వచ్చే మరణం కోసం వెచ్చించవలసిన అగత్యం లేదు. ధైర్యంగా, ప్రశాంతంగా జీవితాన్ని ఆనందించాలి. జన్మించిన కారణాన్ని గ్రహించి ఆ ప్రయత్నంలో తలమునకలుగా మునిగిపోవాలి. ప్రాపంచికంగా మనం ఏం ఆస్వాదించదలచుకున్నా ఆ ఆలోచన వెనక, ఆ ఆనందం వెనక జీవిత సాఫల్యతకు సంబంధించిన స్పృహ పరిమళించాలి. ప్రతి అనుభవం వెనక, ఆనందం వెనక సాధన వెన్నెముక కావాలి. అనుక్షణ అప్రమత్త ప్రయత్నమే సాధన. సాధనల సర్వోత్కృష్ట ఫలమే ఆత్మ భావన. అదే అమృతత్వ భావన. ఈ భావనలో స్థితులమైతే, స్థిరులమైతే మరణభయం పోతుంది. భయంతో అనుక్షణం మరణించే మనిషి జీవిత స్వారస్యాన్ని ఆస్వాదించలేడు. తనకు తానే శిక్ష వేసుకుంటూ జీవితకాల ఖైదీలా జీవిస్తాడు... కాదు కాదు... మరణిస్తూ జీవిస్తాడు. ఆత్మ భావన మరణాన్ని అధిగమిస్తుంది.
నిజానికి మరణం అన్నదాని అర్థం జ్ఞాని దృష్టిలో వేరు. శాశ్వతమైన ఆత్మ జీవాత్మగా లోకంలో నడయాడేందుకు ఓ ఉపాధి కావాలి. ఆ ఉపాధే దేహం. కాలానుగుణంగా ఆ ఉపాధి జీర్ణమైపోతే మరో ఉపాధి వస్త్రాన్ని ధరించే ప్రయత్నమే మరణం. ఏదిఏమైనా మనం మరణమనే ఈ 'రజ్జు సర్ప భ్రాంతి' నుంచి బయటపడాలి. మనం భయపడే ఈ మరణం కేవలం రజ్జువు మాత్రమే. సర్పం కాదు.
- చక్కిలం విజయలక్ష్మి
మనిషి అమృత పుత్రుడు. ఆత్మస్వరూపుడు. సాక్షాత్ బ్రహ్మ! సాధారణ స్థాయిలోని మనుషులెవరూ ఈ మాటల్ని నమ్మరు. పూర్తిస్థాయి సాధన చేయనివారూ పూర్తిగా నమ్మరు. సహజమే. ఎప్పటికప్పుడు మరణిస్తూ పోతున్న మనిషికి మరణం లేకపోవటమేమిటి?! అమృతత్వమేమిటి!?
మనిషికున్న భయాల్లో మరణం తరవాతే ఏదైనా. అయితే మరణం అన్నది మనం కల్పించుకున్నదే. మన మనసు కల్పించుకున్నదే. కనీసం దాని అర్థం. దేహ, మనో స్థాయులనుంచి పైకెదగలేని, భూస్థాయిలోని మనిషికి మరణ భయం సహజమే. మనం శరీరం కాదు. ఆత్మ అనే జ్ఞానాన్ని పొందినప్పుడు, ఆత్మకు మరణం లేదు కాబట్టి అమృతత్వాన్ని పొందటం అంటే ఏమిటో అర్థమవుతుంది. చాలామందికి అనుమానం... మరణం లేకపోవటం ఏమిటి! వీరాధివీరుడైనా, చక్రవర్తి అయినా, చివరకు మహా భక్తుడైనా, మహిమాన్వితుడైనా మనిషన్నాక మరణించే తీరుతున్నాడు కదా అని. నిజమే. కానీ దేహభావం నశించాక ఇక మరణం ఎక్కడుంది? తాను దేహం కాదు, ఆత్మ అని గ్రహించాక జీర్ణమైన వస్త్రాన్ని తొలగించుకున్నట్లు మరణం పేరిట దేహం రాలిపోతుంటే నిర్వికారంగా, నిర్లిప్తంగా చూస్తాడు మనిషి.
అయితే 'మరక... మంచిదే' అన్నంత సులభం కాదు మరణం మంచిదే అనటమైనా. నమ్మటమైనా. ఎందుకంటే 'నేను దేహం కాదు, ఆత్మ' అనే స్పృహ ఉన్నవారే మరణాన్ని కేవలం మార్పుగానే అంగీకరించగలరు. ఆనందించగలరు. ఎందుకంటే జీర్ణవస్త్రాన్ని వదిలివేయటం ఎవరికైనా ఆనందదాయకమే! దేహం వస్త్రంలాంటిదనే జ్ఞానం కావాలి. ఈ జ్ఞానం, స్థాయి వూరకే రావు. దాని వెనక ఎంతో ప్రయత్నం, పట్టుదల, సాధన, సుకృతం ఉండాలి. వీటివల్ల రాత్రి చీకట్లో ఉన్నంత అయోమయంలోంచి క్రమంగా ఉదయించే కాంతిపుంజాల జల్లులో తానే ఓ ఉషోదయమైనట్లు మనిషి ప్రయత్న ఫలంగా, తపోఫలంగా తనకు తెలీకుండానే తానే ఓ జ్ఞానజ్యోతిలా వెలగటం ప్రారంభిస్తాడు. అలాంటివారికి మాత్రమే నేను ఆత్మననే ఉత్కృష్ట భావన స్థిరమవుతుంది. తనను తాను ఆత్మగా భావించేవారు, ఆత్మగా జీవించేవారు తాను మరణిస్తాననే భావనకు అతీతంగా ఉంటారు. అంతర్ముఖులై ఉంటారు. ఇదే మరణాతీతం అంటే. అమృతత్వం అంటే. మరణ భావన లేనివాడు అమృత పుత్రుడు. ఇది ఉన్నపాటున రాదు. మనం ముందు సద్గురువు ద్వారా, సత్సంగం ద్వారా పరతత్వాన్ని గ్రహించాలి. గ్రహించినదాన్ని ఆచరణలో పెట్టాలి. తీవ్ర సాధన చేయాలి. 'నేను శరీరాన్ని కాదు, ఆత్మను' అని వినటం, చదవటం, అనుకోవటం... చాలా సులభం. అయినంత మాత్రాన ఆత్మ భావంలో నిలబడలేం. చిత్తశుద్ధితో సాధన చేయాలి. తపించాలి. ప్రాణంపెట్టి ఆ భావాన్ని నిలుపుకొనే ప్రయత్నం చేయాలి.
మరణ భయం మనిషిని అనుక్షణం మరణింపజేస్తుంది. ఈ భయాన్నించి మనిషి బయటపడినప్పుడే జీవితాన్ని ఆస్వాదించగలడు. మరణం అనేది ఎప్పుడైనా సూచించి వచ్చేది కాదు. ఉరికంబం ఎక్కి మెడలో ఉరితాడు పడినవాడూ శిక్షనుంచి బయటపడవచ్చు. శ్మశానంలో చితిమీద శవంగా ఉంచబడినవాడూ లేచిరావచ్చు. మరణం అనేది మామూలు మనిషికి సంబంధించినంత వరకూ ఒక ప్రమాదం. అనుకోని అకస్మాత్ సంఘటన. దానికోసం అనుక్షణం భయంతో మరణించాల్సిన అవసరం లేదు. ఇంత జీవితాన్నీ చివరాఖర్లో ఎప్పుడో వచ్చే మరణం కోసం వెచ్చించవలసిన అగత్యం లేదు. ధైర్యంగా, ప్రశాంతంగా జీవితాన్ని ఆనందించాలి. జన్మించిన కారణాన్ని గ్రహించి ఆ ప్రయత్నంలో తలమునకలుగా మునిగిపోవాలి. ప్రాపంచికంగా మనం ఏం ఆస్వాదించదలచుకున్నా ఆ ఆలోచన వెనక, ఆ ఆనందం వెనక జీవిత సాఫల్యతకు సంబంధించిన స్పృహ పరిమళించాలి. ప్రతి అనుభవం వెనక, ఆనందం వెనక సాధన వెన్నెముక కావాలి. అనుక్షణ అప్రమత్త ప్రయత్నమే సాధన. సాధనల సర్వోత్కృష్ట ఫలమే ఆత్మ భావన. అదే అమృతత్వ భావన. ఈ భావనలో స్థితులమైతే, స్థిరులమైతే మరణభయం పోతుంది. భయంతో అనుక్షణం మరణించే మనిషి జీవిత స్వారస్యాన్ని ఆస్వాదించలేడు. తనకు తానే శిక్ష వేసుకుంటూ జీవితకాల ఖైదీలా జీవిస్తాడు... కాదు కాదు... మరణిస్తూ జీవిస్తాడు. ఆత్మ భావన మరణాన్ని అధిగమిస్తుంది.
నిజానికి మరణం అన్నదాని అర్థం జ్ఞాని దృష్టిలో వేరు. శాశ్వతమైన ఆత్మ జీవాత్మగా లోకంలో నడయాడేందుకు ఓ ఉపాధి కావాలి. ఆ ఉపాధే దేహం. కాలానుగుణంగా ఆ ఉపాధి జీర్ణమైపోతే మరో ఉపాధి వస్త్రాన్ని ధరించే ప్రయత్నమే మరణం. ఏదిఏమైనా మనం మరణమనే ఈ 'రజ్జు సర్ప భ్రాంతి' నుంచి బయటపడాలి. మనం భయపడే ఈ మరణం కేవలం రజ్జువు మాత్రమే. సర్పం కాదు.
- చక్కిలం విజయలక్ష్మి
ᐅ ప్రేమ ప్రతిమలు
ᐅ ప్రేమ ప్రతిమలు
మనలో అంతర్యామిగా వెలుగొందే ఆ పరమేశ్వరుడు స్వయంగా ప్రేమమయుడు. ప్రేమమూర్తి. ప్రేమే అతడు. అతడే ప్రేమ. అతడెవరో కాదు. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు. విశ్వానికి ఆధారభూతుడు. విశ్వవ్యాప్తుడు. అందుచేత ప్రేమతత్వమూ విశ్వమంతటా నిండి ఉన్నదని తెలుస్తుంది.
ప్రాణులన్నింటిలాగే మానవులూ దేవుడి సంతానమే. అందుచేత మానవుడు దైవాంశ సంభూతుడవుతున్నాడు. ప్రేమజ్యోతిగా వెలుగొందుతున్నాడు. చల్లని ప్రేమ కిరణాలను వెదజల్లే మానవుడిలోని ప్రేమ కూడా దైవంలాగే ఎంతో నిర్మలమైనదీ, పవిత్రమైనదీ అవుతుంది. మానవుడి ప్రేమలో కోరిక ఉండదు, ఉండరాదు. కోరిక ఉంటే అది స్వార్థమవుతుంది. ప్రేమ అనిపించుకోదు!
ప్రేమ ఎంతో పవిత్రమైనది. మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో వాళ్ల ఇష్టాలను గౌరవిస్తాం. వాళ్లు కోరిన దాన్ని ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంటాం. చివరికి మన ప్రాణాన్నయినా సరే వాళ్లకోసం త్యజించడానికి వెనకాడం. అంటే ప్రేమ ఎంతో శక్తిమంతమైనదనీ ఔదార్యంతో నిండిన ఉదాత్తమైన త్యాగగుణం ప్రేమలో ఉందనీ తెలుస్తోంది. త్యాగంతో నిండిన ప్రేమ పవిత్రమైనదంటారు. పవిత్రమైన ప్రేమతో సావిత్రి చనిపోయిన తన భర్త సత్యవంతుణ్ని తిరిగి ప్రాణాలతో పొందగలిగిందని చదువుకున్నాం. రుక్మిణీదేవి పవిత్ర ప్రేమను పొందడం కోసం శ్రీకృష్ణుడు ఎందరో రాజులతో యుద్ధం చేయవలసి వచ్చింది. ప్రేమజంట లైలా మజ్నూలు ఒకరి కోసం ఒకరు చనిపోవడాన్ని సూఫీ సంప్రదాయానికి సంబంధించిన పవిత్ర ప్రేమగా నేటికీ చెప్పుకొంటారు. షీరీ ఫరహాద్ల ప్రేమగాథ, పార్వతీ దేవదాసుల ప్రేమగాథ ఆయా సాహిత్యాల్లో అమరమయ్యాయి. ప్రేమ, త్యాగం రెండూ వేరు కాదు. ఒక్కటే!
భగవంతుడు ఎల్లవేళలా అందరికీ కావలసినవన్నీ సమకూరుస్తూ ఉంటాడని చెబుతారు. బదులుగా ఆయన ఎవరి నుంచీ ఏమీ కోరడు. కారణం? భగవంతుడు ప్రేమ స్వరూపుడు గనక.
ప్రేమకు ఇవ్వడమే తెలుసు. బదులుగా దేన్నీ పొందాలని ఆశించదు. అందుకే ప్రేమమార్గం కోరిక లేని, స్వార్థం లేని ఉత్తమ మార్గమైంది.
దంపతులు ఒకరికొకరు తమ సర్వస్వాన్నీ ఇవ్వడానికి బద్ధులై ఉంటారు. తల్లిదండ్రులు తమ సర్వస్వమూ బిడ్డలకే ఇస్తారు. తిరిగి వాళ్లనుంచి ఏమీ కోరరు. పిల్లలు కూడా వృద్ధులైన తమ తల్లిదండ్రులకు ఎన్నో సేవలు చేస్తారు. వీరందరి చేత ఈ పనుల్ని చేయిస్తున్నది వాళ్లలో ఉండే నిస్వార్థమైన ప్రేమే. పెద్దలు పిన్నల మీద చూపించే వాత్సల్యంలో ఈ ప్రేమే ఉంది. తల్లి తన సంతానం మీద చూపే మమత ఈ ప్రేమే. ఇరువురు మిత్రుల మైత్రి, అనురాగాల్లో సైతం ఈ ప్రేమ పరిమళమే గుబాళిస్తూ ఉంటుంది. భగవంతుడి మీద చూపించే భక్తిపారవశ్యంలోనూ భక్తుని ప్రేమభావమే వెల్లివిరుస్తుంది. ఇలా, మనమంతా ప్రేమ ప్రతిమలమే. ప్రేమకు ప్రతినిధులమే. వెన్నెల సెలయేరులా చల్లగా ప్రేమ మన హృదయాలను సేద తీరుస్తుంది. శాంతినిస్తుంది. నిస్వార్థమైన ప్రేమమార్గాన్ని మనం అనుసరిద్దాం.
- కాలిపు వీరభద్రుడు
మనలో అంతర్యామిగా వెలుగొందే ఆ పరమేశ్వరుడు స్వయంగా ప్రేమమయుడు. ప్రేమమూర్తి. ప్రేమే అతడు. అతడే ప్రేమ. అతడెవరో కాదు. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు. విశ్వానికి ఆధారభూతుడు. విశ్వవ్యాప్తుడు. అందుచేత ప్రేమతత్వమూ విశ్వమంతటా నిండి ఉన్నదని తెలుస్తుంది.
ప్రాణులన్నింటిలాగే మానవులూ దేవుడి సంతానమే. అందుచేత మానవుడు దైవాంశ సంభూతుడవుతున్నాడు. ప్రేమజ్యోతిగా వెలుగొందుతున్నాడు. చల్లని ప్రేమ కిరణాలను వెదజల్లే మానవుడిలోని ప్రేమ కూడా దైవంలాగే ఎంతో నిర్మలమైనదీ, పవిత్రమైనదీ అవుతుంది. మానవుడి ప్రేమలో కోరిక ఉండదు, ఉండరాదు. కోరిక ఉంటే అది స్వార్థమవుతుంది. ప్రేమ అనిపించుకోదు!
ప్రేమ ఎంతో పవిత్రమైనది. మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో వాళ్ల ఇష్టాలను గౌరవిస్తాం. వాళ్లు కోరిన దాన్ని ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంటాం. చివరికి మన ప్రాణాన్నయినా సరే వాళ్లకోసం త్యజించడానికి వెనకాడం. అంటే ప్రేమ ఎంతో శక్తిమంతమైనదనీ ఔదార్యంతో నిండిన ఉదాత్తమైన త్యాగగుణం ప్రేమలో ఉందనీ తెలుస్తోంది. త్యాగంతో నిండిన ప్రేమ పవిత్రమైనదంటారు. పవిత్రమైన ప్రేమతో సావిత్రి చనిపోయిన తన భర్త సత్యవంతుణ్ని తిరిగి ప్రాణాలతో పొందగలిగిందని చదువుకున్నాం. రుక్మిణీదేవి పవిత్ర ప్రేమను పొందడం కోసం శ్రీకృష్ణుడు ఎందరో రాజులతో యుద్ధం చేయవలసి వచ్చింది. ప్రేమజంట లైలా మజ్నూలు ఒకరి కోసం ఒకరు చనిపోవడాన్ని సూఫీ సంప్రదాయానికి సంబంధించిన పవిత్ర ప్రేమగా నేటికీ చెప్పుకొంటారు. షీరీ ఫరహాద్ల ప్రేమగాథ, పార్వతీ దేవదాసుల ప్రేమగాథ ఆయా సాహిత్యాల్లో అమరమయ్యాయి. ప్రేమ, త్యాగం రెండూ వేరు కాదు. ఒక్కటే!
భగవంతుడు ఎల్లవేళలా అందరికీ కావలసినవన్నీ సమకూరుస్తూ ఉంటాడని చెబుతారు. బదులుగా ఆయన ఎవరి నుంచీ ఏమీ కోరడు. కారణం? భగవంతుడు ప్రేమ స్వరూపుడు గనక.
ప్రేమకు ఇవ్వడమే తెలుసు. బదులుగా దేన్నీ పొందాలని ఆశించదు. అందుకే ప్రేమమార్గం కోరిక లేని, స్వార్థం లేని ఉత్తమ మార్గమైంది.
దంపతులు ఒకరికొకరు తమ సర్వస్వాన్నీ ఇవ్వడానికి బద్ధులై ఉంటారు. తల్లిదండ్రులు తమ సర్వస్వమూ బిడ్డలకే ఇస్తారు. తిరిగి వాళ్లనుంచి ఏమీ కోరరు. పిల్లలు కూడా వృద్ధులైన తమ తల్లిదండ్రులకు ఎన్నో సేవలు చేస్తారు. వీరందరి చేత ఈ పనుల్ని చేయిస్తున్నది వాళ్లలో ఉండే నిస్వార్థమైన ప్రేమే. పెద్దలు పిన్నల మీద చూపించే వాత్సల్యంలో ఈ ప్రేమే ఉంది. తల్లి తన సంతానం మీద చూపే మమత ఈ ప్రేమే. ఇరువురు మిత్రుల మైత్రి, అనురాగాల్లో సైతం ఈ ప్రేమ పరిమళమే గుబాళిస్తూ ఉంటుంది. భగవంతుడి మీద చూపించే భక్తిపారవశ్యంలోనూ భక్తుని ప్రేమభావమే వెల్లివిరుస్తుంది. ఇలా, మనమంతా ప్రేమ ప్రతిమలమే. ప్రేమకు ప్రతినిధులమే. వెన్నెల సెలయేరులా చల్లగా ప్రేమ మన హృదయాలను సేద తీరుస్తుంది. శాంతినిస్తుంది. నిస్వార్థమైన ప్రేమమార్గాన్ని మనం అనుసరిద్దాం.
- కాలిపు వీరభద్రుడు
ᐅ కర్మలు-ఫలాలు
ᐅ కర్మలు-ఫలాలు
భారతదేశానికి 'కర్మభూమి' అని పేరు. వాస్తవానికి ప్రపంచంలోని దేశాలన్నింటా కర్మ జరుగుతూనే ఉంటుంది. విశ్వానికంతటికీ శ్రేయం చేకూర్చటమే సరైన కర్మ అని ప్రబోధించే ప్రవచనాలు, ప్రసంగాలు, ఉపదేశాలు, ఆచరణలు, బోధలు కేవలం మనదేశంలోని మహర్షులు, యోగులు, ఆచార్యుల వల్లనే అందుతున్నాయి. కనుకనే మనదేశాన్ని ప్రత్యేకంగా 'కర్మభూమి' అని వ్యవహరిస్తారు.
మనది భోగభూమి కాదు, యోగభూమి. 'ఏ పనైనా చేస్తున్నది 'నేనే' అయినా చేయిస్తున్నది మాత్రం విశ్వచైతన్యమే. అంటే భగవంతుడే. నేను నిమిత్త మాత్రుడను. కర్మఫలితం కూడా భగవత్ప్రసాదమే. ఫలితంపైన నాకెటువంటి ఆశా, వ్యామోహం, తపన లేవు. అధికారమూ లేదు' అన్న భావనతో త్రికరణశుద్ధిగా పనులను చేసుకుంటూ పోవడమే కర్మ సిద్ధాంతం. ఈ భావమే భారతదేశానికి 'కర్మభూమి' అన్న పేరు తెచ్చిపెట్టింది. ఒక కర్మ చేస్తున్నామంటే ఫలితంపైన ఒక ఆశ, అవగాహన, అంచనా ఏర్పడటం ఎవరికైనా సహజం. అంచనాలు, ఫలితాలు తారుమారు అయినప్పుడు దుఃఖం, కోపం, దిగులు, ప్రతీకారవాంఛ కలగటం కూడా సహజమే. అందుచేత పని చెయ్యడమే మన వంతు ఫలితం, భగవదనుగ్రహం అనుకున్నప్పుడు ఏ బాధా ఉండదు. సుఖదుఃఖాలకు ప్రభావితులం కాకుండా, మనసు సమస్థితిలో ఉంచుకోవటమే ఈ కర్మ సిద్ధాంతంలోని పరమార్థం.
ఫలితం మీద లేనిపోని ఆశలు, వూహలు పెంచుకొని, పూర్తిగా దానిమీదనే ధ్యాస పెట్టి కర్మలు చేసినట్లయితే ఆ కర్మ సక్రమంగా పూర్తికాదు. చిత్తశుద్ధి, శ్రద్ధ, ఆసక్తి లోపిస్తాయి. ఫలితంగా స్వార్థం, అవినీతి, ఆగ్రహం, వంచన, ద్రోహం, అసూయ, ద్వేషం వంటి ప్రమాదకర భావనలకు లోనయ్యే అవకాశముంటుంది. ఇక ధనం, మద్యం, మగువ, పదవులను ఎరగా చూపించి ప్రజల్ని ప్రలోభపరచే మహానేతలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నారు. కర్మ చెయ్యకుండా సత్వరం సత్ఫలితాలను పొందేందుకు వారు పడుతున్న తపన, చేసే ఒత్తిళ్లు ఇంతా అంతా కాదు. అటువంటివారి పట్ల అప్రమత్తతతో వ్యవహరించడం ఎంతైనా అవసరం. బతుకు పోరాటంలో పరమాత్మ బోధించిన కర్మసిద్ధాంతాన్ని పెద్దల అనుభవసారంలో రంగరించి అనుసరిస్తే, ఆచరిస్తే- ఆరోగ్యంగా, ఆనందంగా పూర్ణాయుష్కులుగా జీవిస్తారు. లేకపోతే, ఉద్రేకాలకు భావోద్వేగాలకు లోనై జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకోవాల్సి వస్తుంది.
ప్రతి ఒక్కరికీ కార్యసాఫల్యం మీదనే మక్కువ ఎక్కువ. పనిలో విజయం సాధించగానే తమ శక్తియుక్తులు, సామర్థ్యం, ప్రతిభ, మేధాసంపత్తిని తామే పొగడుకుంటుంటారు. కర్మ పట్ల నిరాసక్తి, అలక్ష్యం, వివేకరాహిత్యం, ఇతరులపై ఆధారపడటం, సామర్థ్యరాహిత్యం ఇలాంటి బలహీనతలవల్ల అపజయం పొందేవారికీ, ఆ పొగడుకునేవారికీ పెద్ద తేడా ఏమీ ఉండదు. పరమాత్మ కర్మసన్యాసం కాదు, కర్మఫలత్యాగం చెయ్యమన్నాడు. సంసారిగా ఉంటూనే ధార్మిక కర్మలను నిర్వర్తించుకొమ్మన్నాడు. శారీరకతపస్సు, మానసిక తపస్సు, వాక్ తపస్సు సత్కర్మలను ఆచరించేందుకే ప్రేరణ కలిగిస్తుందన్నాడు.
కర్మలో అనేక భేదాలున్నాయి. నిత్యకర్మ, నైమిత్తిక కర్మ, కామ్య కర్మ, దుష్కర్మ, అకర్మ, కాయిక కర్మ, వాచక కర్మ, మానసిక కర్మ, ప్రారబ్ధకర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ... ఇలా ఎన్నో. స్థూలంగా పుణ్యకర్మలనీ, పాపకర్మలనీ ఉంటాయన్నారు. పుణ్యకర్మాచరణవల్ల మోక్షం, పాప కర్మాచరణవల్ల నరకమూ ప్రాప్తిస్తాయన్నది నిర్వివాదాంశం. గుచ్చుకున్న ముల్లును మరో ముల్లుతోనే తీస్తారు. అలాగే ఒక కర్మబంధాన్ని మరో కర్మాచరణవల్లనే తొలగించడం సాధ్యమన్నారు. కోరికలతో కర్మ చేస్తే బంధవిముక్తి కాదు. మామిడిటెంక నాటితే మామిడిపళ్లు పొందగలం, కాకర విత్తనం నాటితే చేదు కాకరకాయలే లభిస్తాయి. ఇదే కామ్యకర్మ విధానం. జ్యోతిస్టోమ, అతిరాత్ర, పాండరీక, సోమయాగాది కర్మలు శ్రౌతకర్మలు. బావులు, చెరువులు తవ్వించటం, దేవాలయాది ప్రతిష్ఠాపనలు స్మార్త కర్మలు. నిష్కామ కర్మనిష్ఠులు సంసారంనుంచి తరిస్తారు. బంధాల్ని పెంచనిది నిజమైన కర్మ అని విష్ణుపురాణం చెబుతోంది. సకాలంలో వర్షాలు పడి, మంచి పంటలతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని చేసే కర్మలు నైమిత్తిక కర్మలు. కర్మబంధాలు తొలగించుకోవాలంటే జ్ఞానప్రాప్తి అత్యంతావశ్యకం.
దైవదర్శనం చేసుకొని గుడి వెలుపలికి వచ్చిన ఇద్దరు మిత్రుల్లో మొదటివాడు దానం ఉత్తమధర్మంగా భావించి బిచ్చగాడికొక రూపాయి వేస్తే, రెండోవాడు తానూ వేయకపోతే బాగుండదని మొహమాటంగా రూపాయి వేశాడు. అంటే దానమనే కర్మ ఒకటే అయినా ఆ రెండు కర్మలకూ వేర్వేరు ఫలితాలుంటాయని గమనించాలి. కర్తవ్య నిర్వహణలో బ్రహ్మానందం, ముక్తిని పొందిన ధర్మవ్యాధుడి కథ మనకు తెలిసిందే. సత్కర్మాచరణే మోక్ష భవనానికి ప్రథమ సోపానం.
- చిమ్మపూడి శ్రీరామమూర్తి
భారతదేశానికి 'కర్మభూమి' అని పేరు. వాస్తవానికి ప్రపంచంలోని దేశాలన్నింటా కర్మ జరుగుతూనే ఉంటుంది. విశ్వానికంతటికీ శ్రేయం చేకూర్చటమే సరైన కర్మ అని ప్రబోధించే ప్రవచనాలు, ప్రసంగాలు, ఉపదేశాలు, ఆచరణలు, బోధలు కేవలం మనదేశంలోని మహర్షులు, యోగులు, ఆచార్యుల వల్లనే అందుతున్నాయి. కనుకనే మనదేశాన్ని ప్రత్యేకంగా 'కర్మభూమి' అని వ్యవహరిస్తారు.
మనది భోగభూమి కాదు, యోగభూమి. 'ఏ పనైనా చేస్తున్నది 'నేనే' అయినా చేయిస్తున్నది మాత్రం విశ్వచైతన్యమే. అంటే భగవంతుడే. నేను నిమిత్త మాత్రుడను. కర్మఫలితం కూడా భగవత్ప్రసాదమే. ఫలితంపైన నాకెటువంటి ఆశా, వ్యామోహం, తపన లేవు. అధికారమూ లేదు' అన్న భావనతో త్రికరణశుద్ధిగా పనులను చేసుకుంటూ పోవడమే కర్మ సిద్ధాంతం. ఈ భావమే భారతదేశానికి 'కర్మభూమి' అన్న పేరు తెచ్చిపెట్టింది. ఒక కర్మ చేస్తున్నామంటే ఫలితంపైన ఒక ఆశ, అవగాహన, అంచనా ఏర్పడటం ఎవరికైనా సహజం. అంచనాలు, ఫలితాలు తారుమారు అయినప్పుడు దుఃఖం, కోపం, దిగులు, ప్రతీకారవాంఛ కలగటం కూడా సహజమే. అందుచేత పని చెయ్యడమే మన వంతు ఫలితం, భగవదనుగ్రహం అనుకున్నప్పుడు ఏ బాధా ఉండదు. సుఖదుఃఖాలకు ప్రభావితులం కాకుండా, మనసు సమస్థితిలో ఉంచుకోవటమే ఈ కర్మ సిద్ధాంతంలోని పరమార్థం.
ఫలితం మీద లేనిపోని ఆశలు, వూహలు పెంచుకొని, పూర్తిగా దానిమీదనే ధ్యాస పెట్టి కర్మలు చేసినట్లయితే ఆ కర్మ సక్రమంగా పూర్తికాదు. చిత్తశుద్ధి, శ్రద్ధ, ఆసక్తి లోపిస్తాయి. ఫలితంగా స్వార్థం, అవినీతి, ఆగ్రహం, వంచన, ద్రోహం, అసూయ, ద్వేషం వంటి ప్రమాదకర భావనలకు లోనయ్యే అవకాశముంటుంది. ఇక ధనం, మద్యం, మగువ, పదవులను ఎరగా చూపించి ప్రజల్ని ప్రలోభపరచే మహానేతలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నారు. కర్మ చెయ్యకుండా సత్వరం సత్ఫలితాలను పొందేందుకు వారు పడుతున్న తపన, చేసే ఒత్తిళ్లు ఇంతా అంతా కాదు. అటువంటివారి పట్ల అప్రమత్తతతో వ్యవహరించడం ఎంతైనా అవసరం. బతుకు పోరాటంలో పరమాత్మ బోధించిన కర్మసిద్ధాంతాన్ని పెద్దల అనుభవసారంలో రంగరించి అనుసరిస్తే, ఆచరిస్తే- ఆరోగ్యంగా, ఆనందంగా పూర్ణాయుష్కులుగా జీవిస్తారు. లేకపోతే, ఉద్రేకాలకు భావోద్వేగాలకు లోనై జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకోవాల్సి వస్తుంది.
ప్రతి ఒక్కరికీ కార్యసాఫల్యం మీదనే మక్కువ ఎక్కువ. పనిలో విజయం సాధించగానే తమ శక్తియుక్తులు, సామర్థ్యం, ప్రతిభ, మేధాసంపత్తిని తామే పొగడుకుంటుంటారు. కర్మ పట్ల నిరాసక్తి, అలక్ష్యం, వివేకరాహిత్యం, ఇతరులపై ఆధారపడటం, సామర్థ్యరాహిత్యం ఇలాంటి బలహీనతలవల్ల అపజయం పొందేవారికీ, ఆ పొగడుకునేవారికీ పెద్ద తేడా ఏమీ ఉండదు. పరమాత్మ కర్మసన్యాసం కాదు, కర్మఫలత్యాగం చెయ్యమన్నాడు. సంసారిగా ఉంటూనే ధార్మిక కర్మలను నిర్వర్తించుకొమ్మన్నాడు. శారీరకతపస్సు, మానసిక తపస్సు, వాక్ తపస్సు సత్కర్మలను ఆచరించేందుకే ప్రేరణ కలిగిస్తుందన్నాడు.
కర్మలో అనేక భేదాలున్నాయి. నిత్యకర్మ, నైమిత్తిక కర్మ, కామ్య కర్మ, దుష్కర్మ, అకర్మ, కాయిక కర్మ, వాచక కర్మ, మానసిక కర్మ, ప్రారబ్ధకర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ... ఇలా ఎన్నో. స్థూలంగా పుణ్యకర్మలనీ, పాపకర్మలనీ ఉంటాయన్నారు. పుణ్యకర్మాచరణవల్ల మోక్షం, పాప కర్మాచరణవల్ల నరకమూ ప్రాప్తిస్తాయన్నది నిర్వివాదాంశం. గుచ్చుకున్న ముల్లును మరో ముల్లుతోనే తీస్తారు. అలాగే ఒక కర్మబంధాన్ని మరో కర్మాచరణవల్లనే తొలగించడం సాధ్యమన్నారు. కోరికలతో కర్మ చేస్తే బంధవిముక్తి కాదు. మామిడిటెంక నాటితే మామిడిపళ్లు పొందగలం, కాకర విత్తనం నాటితే చేదు కాకరకాయలే లభిస్తాయి. ఇదే కామ్యకర్మ విధానం. జ్యోతిస్టోమ, అతిరాత్ర, పాండరీక, సోమయాగాది కర్మలు శ్రౌతకర్మలు. బావులు, చెరువులు తవ్వించటం, దేవాలయాది ప్రతిష్ఠాపనలు స్మార్త కర్మలు. నిష్కామ కర్మనిష్ఠులు సంసారంనుంచి తరిస్తారు. బంధాల్ని పెంచనిది నిజమైన కర్మ అని విష్ణుపురాణం చెబుతోంది. సకాలంలో వర్షాలు పడి, మంచి పంటలతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని చేసే కర్మలు నైమిత్తిక కర్మలు. కర్మబంధాలు తొలగించుకోవాలంటే జ్ఞానప్రాప్తి అత్యంతావశ్యకం.
దైవదర్శనం చేసుకొని గుడి వెలుపలికి వచ్చిన ఇద్దరు మిత్రుల్లో మొదటివాడు దానం ఉత్తమధర్మంగా భావించి బిచ్చగాడికొక రూపాయి వేస్తే, రెండోవాడు తానూ వేయకపోతే బాగుండదని మొహమాటంగా రూపాయి వేశాడు. అంటే దానమనే కర్మ ఒకటే అయినా ఆ రెండు కర్మలకూ వేర్వేరు ఫలితాలుంటాయని గమనించాలి. కర్తవ్య నిర్వహణలో బ్రహ్మానందం, ముక్తిని పొందిన ధర్మవ్యాధుడి కథ మనకు తెలిసిందే. సత్కర్మాచరణే మోక్ష భవనానికి ప్రథమ సోపానం.
- చిమ్మపూడి శ్రీరామమూర్తి
ᐅ మహా ప్రజ్ఞ
ᐅ మహా ప్రజ్ఞ
దొరికిన ప్రతి పుస్తకం చదివాం. గ్రంథాలయాల్లో రోజులకొద్దీ గడిపాం. ఎన్నో చర్చల్లో పాల్గొన్నాం. సభలకు వెళ్లాం. సమావేశాలు నిర్వహించాం. విపరీతంగా జ్ఞానం పెంచుకున్నాం. ఉపనిషత్తుల జ్ఞానం కరతలామలకం. వేదజ్ఞానం ఔపోసన పట్టాం. ప్రపంచంలో ఉన్న జ్ఞానమంతా బుర్రలో నిండిపోయింది. పాండిత్యంతో గర్వ అహంకారాలు పెరిగిపోయాయి. ఓ విజ్ఞాన సర్వస్వంగా తయారైపోయాం. ఎన్నో బిరుదులు, ఎన్నో గౌరవాలు, మరెన్నో పురస్కారాలు...
అందరూ 'నడుస్తున్న గ్రంథాలయం' అని పిలుస్తున్నారు. 'నడుస్తున్న జ్ఞాననిధి' అని స్తుతిస్తున్నారు. దీనివల్ల అంతరంగంలో ఉండే అసలైన అజ్ఞానం నశిస్తుందా? ఘోరంగా ఆ అజ్ఞానం మన లోపల మరింత గోప్యంగా దాక్కుంటుంది. మరింత రహస్యంగా దాక్కుంటుంది. మన హృదయపు లోతుల్లో కనిపించని ప్రదేశంలోకి వెళ్లి దాక్కుంటుంది. పైకి మాత్రం మనం మహాజ్ఞానులుగా కనిపిస్తూ ఉంటాం.
లోతుల్లో మాత్రం మనం అజ్ఞానులుగానే ఉంటాం. ఎప్పుడూ ఇదే జరుగుతూ ఉంటుంది. అన్ని విశ్వవిద్యాలయాలు ఈ సహాయాన్నే చేస్తూ ఉంటాయి. మన అజ్ఞానం ఎన్నటికీ నశించిపోదు. అది పనిచేస్తూనే ఉంటుంది.
పైకి మాత్రం మనం సర్వాలంకార భూషితులుగా కనిపిస్తాం. చక్కటి ఆహార్యంతో జ్ఞానపు పూత పూసుకొని కనిపిస్తూ ఉంటాం. కాని, మనలో అజ్ఞానం మహా ప్రగాఢంగా తిష్ఠ వేసుకుని ఉండిపోతుంది.
నిజమైన జ్ఞానం మన అంతరంలో ఉన్న అజ్ఞానం అంతరించి పోయినప్పుడే సంభవిస్తుంది.
ఇదివరకు మనకు ఉన్న జ్ఞానమంతా, సమాచారంగా, అరువు తెచ్చుకునే విషయంగానే ఉంది. అది మన సొంతం కానిది. అది అప్రమాణికంగానే ఉంటుంది తప్ప మనకు కలిగిన జ్ఞానంగా ఉండదు. సజీవంగా మనం అనుభవించి తెలుసుకున్న జ్ఞానంగా ఉండదు.
ఆధ్యాత్మిక భూమికల్లో వివిధ స్థాయుల్లో దివ్యమార్గాన్ని అనుసరించి, సాధన చేస్తేనే అంతరిస్తుంది అజ్ఞానం. అప్పుడే కలుగుతుంది అనుభవ జ్ఞానం. అదే అనుభూతి.
ఒకసారి, అరుణాచల రమణ మహర్షి సమక్షంలో ఒక సంగీత విద్వాంసురాలు అద్భుతమైన కచేరి చేసింది. శ్రోతలందరికీ వీనుల విందు అయింది. రమణ ఆశీస్సులు తీసుకోవడానికి ఆమె ఆయన దగ్గరకు వెళ్లినప్పుడు ఇలా అంది.
'త్యాగయ్య, అన్నమయ్యల లాగే నేను కూడా ఇలా సంగీతం పాడి తరిద్దామనుకుంటున్నాను' అని. దానికి మహర్షి ఇలా సమాధానం ఇచ్చారు-
'వాళ్లు పాడి తరించలేదమ్మా, తరించి పాడారు' అని.
అంతరంగంలో అజ్ఞానం అంతరించినప్పుడే నిజమైన శుద్ధజ్ఞానం కలుగుతుంది. అప్పుడే మహాప్రజ్ఞకు దారి ఏర్పడుతుంది.
మహాప్రజ్ఞ వివేకవంతుణ్ని చేస్తుంది. వివేకవంతుడే నిజమైన జ్ఞాని. అతడి ముందు పండితులూ నిలబడలేరు. కేశవచంద్రసేన్ లాంటి గొప్ప పండితుడు రామకృష్ణ పరమహంస ముందు మోకరిల్లాడు.
పరమ భాగవతోత్తముడైన పోతన ముందు స్వచ్ఛందంగా తన ఓటమిని అంగీకరించాడు శ్రీనాథ పండితుడు.
సచ్చిదానంద సముద్రమై అలరారుతున్న దైవ హృదయం దగ్గరకు ఏ అరమరికలు లేకుండా తీసుకువెళ్లేదే నిజమైన జ్ఞానం. అది ప్రాతఃకాల చీకట్లు తొలగిపోయిన వెంటనే సంభవించే సూర్యోదయం లాంటిది.
తనకు తెలిసిన చిన్న చిన్న ఉదాహరణలతోనే గొప్ప జ్ఞానం అందించాడు క్రీస్తు. చిన్నచిన్న కథలతోనే బుద్ధుడు జీవన తత్వాన్ని తెలియజేశాడు. ప్రేమతో తన భక్తులను ఆకట్టుకున్నాడు శిరిడి సాయి.
హృదయంలో వెలిగే జ్ఞానజ్యోతి విశ్వమంతా చూపిస్తుంది. విశ్వమంతా కొనియాడే లౌకిక జ్ఞానం సూర్యుడి ముందు దివిటీ అయిపోతుంది. అందుకే ప్రహ్లాదుడు, తండ్రి అడిగినప్పుడు, మహాప్రజ్ఞ కలిగిన వాడై-
'చదువులనెల్ల చదివితి తండ్రీ!' అని తెలిపాడు. హరి అనుగ్రహం పొందినవాడికి సరస్వతి కటాక్షానికి కొదవేముంటుంది? ఆత్మ తెలిస్తే సర్వమూ తెలుస్తుంది. సర్వమూ తెలిసినా, ఆత్మ తెలియకపోతే అది అసంపూర్ణ జ్ఞానమే కదా!
- ఆనందసాయి స్వామి
దొరికిన ప్రతి పుస్తకం చదివాం. గ్రంథాలయాల్లో రోజులకొద్దీ గడిపాం. ఎన్నో చర్చల్లో పాల్గొన్నాం. సభలకు వెళ్లాం. సమావేశాలు నిర్వహించాం. విపరీతంగా జ్ఞానం పెంచుకున్నాం. ఉపనిషత్తుల జ్ఞానం కరతలామలకం. వేదజ్ఞానం ఔపోసన పట్టాం. ప్రపంచంలో ఉన్న జ్ఞానమంతా బుర్రలో నిండిపోయింది. పాండిత్యంతో గర్వ అహంకారాలు పెరిగిపోయాయి. ఓ విజ్ఞాన సర్వస్వంగా తయారైపోయాం. ఎన్నో బిరుదులు, ఎన్నో గౌరవాలు, మరెన్నో పురస్కారాలు...
అందరూ 'నడుస్తున్న గ్రంథాలయం' అని పిలుస్తున్నారు. 'నడుస్తున్న జ్ఞాననిధి' అని స్తుతిస్తున్నారు. దీనివల్ల అంతరంగంలో ఉండే అసలైన అజ్ఞానం నశిస్తుందా? ఘోరంగా ఆ అజ్ఞానం మన లోపల మరింత గోప్యంగా దాక్కుంటుంది. మరింత రహస్యంగా దాక్కుంటుంది. మన హృదయపు లోతుల్లో కనిపించని ప్రదేశంలోకి వెళ్లి దాక్కుంటుంది. పైకి మాత్రం మనం మహాజ్ఞానులుగా కనిపిస్తూ ఉంటాం.
లోతుల్లో మాత్రం మనం అజ్ఞానులుగానే ఉంటాం. ఎప్పుడూ ఇదే జరుగుతూ ఉంటుంది. అన్ని విశ్వవిద్యాలయాలు ఈ సహాయాన్నే చేస్తూ ఉంటాయి. మన అజ్ఞానం ఎన్నటికీ నశించిపోదు. అది పనిచేస్తూనే ఉంటుంది.
పైకి మాత్రం మనం సర్వాలంకార భూషితులుగా కనిపిస్తాం. చక్కటి ఆహార్యంతో జ్ఞానపు పూత పూసుకొని కనిపిస్తూ ఉంటాం. కాని, మనలో అజ్ఞానం మహా ప్రగాఢంగా తిష్ఠ వేసుకుని ఉండిపోతుంది.
నిజమైన జ్ఞానం మన అంతరంలో ఉన్న అజ్ఞానం అంతరించి పోయినప్పుడే సంభవిస్తుంది.
ఇదివరకు మనకు ఉన్న జ్ఞానమంతా, సమాచారంగా, అరువు తెచ్చుకునే విషయంగానే ఉంది. అది మన సొంతం కానిది. అది అప్రమాణికంగానే ఉంటుంది తప్ప మనకు కలిగిన జ్ఞానంగా ఉండదు. సజీవంగా మనం అనుభవించి తెలుసుకున్న జ్ఞానంగా ఉండదు.
ఆధ్యాత్మిక భూమికల్లో వివిధ స్థాయుల్లో దివ్యమార్గాన్ని అనుసరించి, సాధన చేస్తేనే అంతరిస్తుంది అజ్ఞానం. అప్పుడే కలుగుతుంది అనుభవ జ్ఞానం. అదే అనుభూతి.
ఒకసారి, అరుణాచల రమణ మహర్షి సమక్షంలో ఒక సంగీత విద్వాంసురాలు అద్భుతమైన కచేరి చేసింది. శ్రోతలందరికీ వీనుల విందు అయింది. రమణ ఆశీస్సులు తీసుకోవడానికి ఆమె ఆయన దగ్గరకు వెళ్లినప్పుడు ఇలా అంది.
'త్యాగయ్య, అన్నమయ్యల లాగే నేను కూడా ఇలా సంగీతం పాడి తరిద్దామనుకుంటున్నాను' అని. దానికి మహర్షి ఇలా సమాధానం ఇచ్చారు-
'వాళ్లు పాడి తరించలేదమ్మా, తరించి పాడారు' అని.
అంతరంగంలో అజ్ఞానం అంతరించినప్పుడే నిజమైన శుద్ధజ్ఞానం కలుగుతుంది. అప్పుడే మహాప్రజ్ఞకు దారి ఏర్పడుతుంది.
మహాప్రజ్ఞ వివేకవంతుణ్ని చేస్తుంది. వివేకవంతుడే నిజమైన జ్ఞాని. అతడి ముందు పండితులూ నిలబడలేరు. కేశవచంద్రసేన్ లాంటి గొప్ప పండితుడు రామకృష్ణ పరమహంస ముందు మోకరిల్లాడు.
పరమ భాగవతోత్తముడైన పోతన ముందు స్వచ్ఛందంగా తన ఓటమిని అంగీకరించాడు శ్రీనాథ పండితుడు.
సచ్చిదానంద సముద్రమై అలరారుతున్న దైవ హృదయం దగ్గరకు ఏ అరమరికలు లేకుండా తీసుకువెళ్లేదే నిజమైన జ్ఞానం. అది ప్రాతఃకాల చీకట్లు తొలగిపోయిన వెంటనే సంభవించే సూర్యోదయం లాంటిది.
తనకు తెలిసిన చిన్న చిన్న ఉదాహరణలతోనే గొప్ప జ్ఞానం అందించాడు క్రీస్తు. చిన్నచిన్న కథలతోనే బుద్ధుడు జీవన తత్వాన్ని తెలియజేశాడు. ప్రేమతో తన భక్తులను ఆకట్టుకున్నాడు శిరిడి సాయి.
హృదయంలో వెలిగే జ్ఞానజ్యోతి విశ్వమంతా చూపిస్తుంది. విశ్వమంతా కొనియాడే లౌకిక జ్ఞానం సూర్యుడి ముందు దివిటీ అయిపోతుంది. అందుకే ప్రహ్లాదుడు, తండ్రి అడిగినప్పుడు, మహాప్రజ్ఞ కలిగిన వాడై-
'చదువులనెల్ల చదివితి తండ్రీ!' అని తెలిపాడు. హరి అనుగ్రహం పొందినవాడికి సరస్వతి కటాక్షానికి కొదవేముంటుంది? ఆత్మ తెలిస్తే సర్వమూ తెలుస్తుంది. సర్వమూ తెలిసినా, ఆత్మ తెలియకపోతే అది అసంపూర్ణ జ్ఞానమే కదా!
- ఆనందసాయి స్వామి
ᐅ ప్రేమప్రయాణం
ᐅ ప్రేమప్రయాణం
మానవులకూ జంతువులకూ 'ప్రేమించే గుణం' పుట్టుకతోనే అబ్బుతుంది. మనిషిలోని మహిత శక్తి, అభివృద్ధి చెందితే అతడి 'ప్రేమ' కూడా విస్తరిస్తుంది. పశుప్రాయస్థితి నుంచి దివ్యత్వంవైపు అతడి బుద్ధి వికసిస్తుంది. ఇంద్రియ సుఖాలకూ విషయ లాలసతకూ స్వస్తి చెబుతాడు. శునకం తనకిష్టమైన ఆహారాన్ని భుజించేటప్పుడు అమృతం పెట్టినా ఆరగించదు. సర్వేంద్రియాలనూ తన ఆహారంపైనే కేంద్రీకరించి, అమితానందంతో ఆరగిస్తుంది. పశుప్రాయస్థితిలో మానవుడూ అలాగే ప్రవర్తిస్తాడు. కానీ, పరమాత్మ దివ్యసౌందర్యం వైపు మనసు మళ్లిందో... అమరకాంత వచ్చినా కన్నెత్తి చూడడు!
ఒకదశలో యువతీయువకులకు 'ప్రేమ' అనేది ఒక అద్భుత భావనగా కనపడుతుంది. తమ ప్రేమ అమలినమైనదని, అమరమైనదనీ వర్ణిస్తారు. ప్రేమకోసం త్యాగాలు, ఆత్మార్పణలు... ఎన్నో కథలూ గాథలూ! 'నీవు నా ప్రాణాధికురాలివి' అంటూ ప్రేయసి ముందు మోకరిల్లాడు ఒక ప్రియుడు. అతడి ఆరాధన అతి పవిత్రమనీ, మహత్తర ఆదర్శమనీ కవివరేణ్యులు భావగీతాలు ఆలపించారు. ఒక భక్తుడు తన ఇష్టదైవం పాదాలపై సాగిలపడ్డాడు. మూఢత్వమని ఆధునికులొకరు అపహసించారు. ప్రేమకు ఎన్నో రూపాలున్నాయి. లౌకిక జీవితమే పరమ పదంగా భావించేవారికి స్త్రీ పురుషుల ప్రణయమే పరమావధి. అలౌకిక ప్రేమ భగవంతుడిపై లగ్నమవుతుంది. అది పలువిధాలుగా వ్యక్తమవుతుంది!
విగ్రహంలో తన ఇష్టదైవాన్ని దర్శించడం ఒక మార్గం మాత్రమే! సీతారామ లక్ష్మణులకు ఆభరణాలు చేయించి రామదాసు మురిసిపోయాడు. త్యాగరాజు తన ఇష్టదైవం శ్రీరామచంద్రుడి విగ్రహం కానరాక కన్నీరు మున్నీరుగా విలపించాడు. తిరుప్పాణి ఆళ్వారు శ్రీరంగడి దివ్యమంగళ విగ్రహాన్ని చూసే భాగ్యం తనకు లేదే అని బాధపడ్డాడు. భగవంతుడిపై ఆ మహాత్ములకుగల అద్భుత ప్రేమకు అవి నిదర్శనాలు.
వివేకానంద స్వామి ఒక పర్యాయం గురువుగారిని 'స్వామీ! ఈ ప్రజలు గుడ్డి నమ్మకాలతో జీవిస్తున్నారే! వీరికి మోక్షం ఎలా వస్తుంది?' అని ప్రశ్నించాడు. రామకృష్ణ పరమహంస కాసేపు మౌనం వహించి, ఇలా సమాధానమిచ్చాడు- 'ప్రతి ఇంటికీ ఒక సింహద్వారం, ఒక దొడ్డిద్వారం ఉంటాయి. అవకాశాన్నిబట్టి, అవసరాన్నిబట్టి ఎవరికిష్టమైనదాన్ని వాళ్లు ఉపయోగించుకుంటారు. భగవంతుడి విషయంలో అంధవిశ్వాసం అనేది లేదు!'. గురువుగారి బోధననుసరించి వివేకానందుడు విశాల దృక్పథాన్ని ఏర్పరచుకున్నాడు. ప్రతిమలను పూజించడం దేవతారాధనలో ఒక పద్ధతి అని గ్రహించాడు.
ఆలోచిస్తే ఐహిక ప్రేమల అశాశ్వతత్వం తెలుస్తుంది. ఒక జంట ప్రేమించి పెండ్లి చేసుకొన్నది. భార్య తన భర్తపై అంతులేని ప్రేమానురాగాలను వర్షించింది. కొంతకాలానికి ఆమె తల్లి అయింది. సగమో... అంతకంటే ఎక్కువో... ఆమె ప్రేమను బిడ్డ దక్కించుకున్నది. సహజంగానే భర్తపై ఆమె ప్రేమ ప్రదర్శన తగ్గుముఖం పట్టింది- ఇది లోకంలో అంతటా కనబడే విషయమే, విచిత్రం ఏమీలేదు! పటిష్ఠమైన మన వివాహా వ్యవస్థ భార్యాభర్తల నడుమ ఉండే ప్రేమను పవిత్రీకృతం చేయగలుగుతోంది. లౌకిక వాసనలకు దూరమైన వృద్ధదంపతుల ప్రేమ ఆది దంపతుల ప్రేమలా దివ్యత్వాన్ని సంతరించుకొంటుంది.
అల్పమైన వాటిని ప్రేమిస్తూ అనల్పమైన ముక్తిసాధన చేయగలమా? చూస్తూ ఉండగానే కాలం గడచిపోతుంది. నదిలో పడవ అవతలి ఒడ్డును చేరుతుంది. పడవ లోపల కూర్చున్నవారికి అది అసలు కదిలినట్లే కనపడదు. ఆయుష్షు కూడా అలాంటిదే! యముడు ప్రత్యక్షమై రారమ్మని పిలుస్తాడు. 'ఆగు, కొంచెం ఓపిక పట్టు. నా మనవరాలి పెళ్లి చూసివస్తా!' అంటే సమవర్తి 'సరే' అని వెనక్కి మళ్లిపోతాడా? యమపాశం విసురుతాడు. అప్పుడు 'అయ్యో! పనికిమాలిన విషయాలను ప్రేమిస్తూ బంగారంలాంటి కాలమంతా వ్యర్థం చేశానే' అని చింతిస్తే ఏం ప్రయోజనం? మనలో ఉన్న సహజమైన ప్రేమ ఈశ్వర స్వరూపమైన సమాజ ప్రేమ వైపు పయనించాలి. 'ఎవరినీ ద్వేషించకుండా ఉండటం, అందరిపై కరుణ చూపడం, అహంకార మమకారాలు త్యజించడం, నిత్య సంతుష్టులై జీవించడం, పవిత్ర జీవనం గడపడం...' ఇవి దైవభక్తుడి లక్షణాలుగా చెబుతారు. మన ప్రేమప్రయాణం ఆ వైపే సాగాలి!
- డాక్టర్ పులిచెర్ల సాంబశివరావు
మానవులకూ జంతువులకూ 'ప్రేమించే గుణం' పుట్టుకతోనే అబ్బుతుంది. మనిషిలోని మహిత శక్తి, అభివృద్ధి చెందితే అతడి 'ప్రేమ' కూడా విస్తరిస్తుంది. పశుప్రాయస్థితి నుంచి దివ్యత్వంవైపు అతడి బుద్ధి వికసిస్తుంది. ఇంద్రియ సుఖాలకూ విషయ లాలసతకూ స్వస్తి చెబుతాడు. శునకం తనకిష్టమైన ఆహారాన్ని భుజించేటప్పుడు అమృతం పెట్టినా ఆరగించదు. సర్వేంద్రియాలనూ తన ఆహారంపైనే కేంద్రీకరించి, అమితానందంతో ఆరగిస్తుంది. పశుప్రాయస్థితిలో మానవుడూ అలాగే ప్రవర్తిస్తాడు. కానీ, పరమాత్మ దివ్యసౌందర్యం వైపు మనసు మళ్లిందో... అమరకాంత వచ్చినా కన్నెత్తి చూడడు!
ఒకదశలో యువతీయువకులకు 'ప్రేమ' అనేది ఒక అద్భుత భావనగా కనపడుతుంది. తమ ప్రేమ అమలినమైనదని, అమరమైనదనీ వర్ణిస్తారు. ప్రేమకోసం త్యాగాలు, ఆత్మార్పణలు... ఎన్నో కథలూ గాథలూ! 'నీవు నా ప్రాణాధికురాలివి' అంటూ ప్రేయసి ముందు మోకరిల్లాడు ఒక ప్రియుడు. అతడి ఆరాధన అతి పవిత్రమనీ, మహత్తర ఆదర్శమనీ కవివరేణ్యులు భావగీతాలు ఆలపించారు. ఒక భక్తుడు తన ఇష్టదైవం పాదాలపై సాగిలపడ్డాడు. మూఢత్వమని ఆధునికులొకరు అపహసించారు. ప్రేమకు ఎన్నో రూపాలున్నాయి. లౌకిక జీవితమే పరమ పదంగా భావించేవారికి స్త్రీ పురుషుల ప్రణయమే పరమావధి. అలౌకిక ప్రేమ భగవంతుడిపై లగ్నమవుతుంది. అది పలువిధాలుగా వ్యక్తమవుతుంది!
విగ్రహంలో తన ఇష్టదైవాన్ని దర్శించడం ఒక మార్గం మాత్రమే! సీతారామ లక్ష్మణులకు ఆభరణాలు చేయించి రామదాసు మురిసిపోయాడు. త్యాగరాజు తన ఇష్టదైవం శ్రీరామచంద్రుడి విగ్రహం కానరాక కన్నీరు మున్నీరుగా విలపించాడు. తిరుప్పాణి ఆళ్వారు శ్రీరంగడి దివ్యమంగళ విగ్రహాన్ని చూసే భాగ్యం తనకు లేదే అని బాధపడ్డాడు. భగవంతుడిపై ఆ మహాత్ములకుగల అద్భుత ప్రేమకు అవి నిదర్శనాలు.
వివేకానంద స్వామి ఒక పర్యాయం గురువుగారిని 'స్వామీ! ఈ ప్రజలు గుడ్డి నమ్మకాలతో జీవిస్తున్నారే! వీరికి మోక్షం ఎలా వస్తుంది?' అని ప్రశ్నించాడు. రామకృష్ణ పరమహంస కాసేపు మౌనం వహించి, ఇలా సమాధానమిచ్చాడు- 'ప్రతి ఇంటికీ ఒక సింహద్వారం, ఒక దొడ్డిద్వారం ఉంటాయి. అవకాశాన్నిబట్టి, అవసరాన్నిబట్టి ఎవరికిష్టమైనదాన్ని వాళ్లు ఉపయోగించుకుంటారు. భగవంతుడి విషయంలో అంధవిశ్వాసం అనేది లేదు!'. గురువుగారి బోధననుసరించి వివేకానందుడు విశాల దృక్పథాన్ని ఏర్పరచుకున్నాడు. ప్రతిమలను పూజించడం దేవతారాధనలో ఒక పద్ధతి అని గ్రహించాడు.
ఆలోచిస్తే ఐహిక ప్రేమల అశాశ్వతత్వం తెలుస్తుంది. ఒక జంట ప్రేమించి పెండ్లి చేసుకొన్నది. భార్య తన భర్తపై అంతులేని ప్రేమానురాగాలను వర్షించింది. కొంతకాలానికి ఆమె తల్లి అయింది. సగమో... అంతకంటే ఎక్కువో... ఆమె ప్రేమను బిడ్డ దక్కించుకున్నది. సహజంగానే భర్తపై ఆమె ప్రేమ ప్రదర్శన తగ్గుముఖం పట్టింది- ఇది లోకంలో అంతటా కనబడే విషయమే, విచిత్రం ఏమీలేదు! పటిష్ఠమైన మన వివాహా వ్యవస్థ భార్యాభర్తల నడుమ ఉండే ప్రేమను పవిత్రీకృతం చేయగలుగుతోంది. లౌకిక వాసనలకు దూరమైన వృద్ధదంపతుల ప్రేమ ఆది దంపతుల ప్రేమలా దివ్యత్వాన్ని సంతరించుకొంటుంది.
అల్పమైన వాటిని ప్రేమిస్తూ అనల్పమైన ముక్తిసాధన చేయగలమా? చూస్తూ ఉండగానే కాలం గడచిపోతుంది. నదిలో పడవ అవతలి ఒడ్డును చేరుతుంది. పడవ లోపల కూర్చున్నవారికి అది అసలు కదిలినట్లే కనపడదు. ఆయుష్షు కూడా అలాంటిదే! యముడు ప్రత్యక్షమై రారమ్మని పిలుస్తాడు. 'ఆగు, కొంచెం ఓపిక పట్టు. నా మనవరాలి పెళ్లి చూసివస్తా!' అంటే సమవర్తి 'సరే' అని వెనక్కి మళ్లిపోతాడా? యమపాశం విసురుతాడు. అప్పుడు 'అయ్యో! పనికిమాలిన విషయాలను ప్రేమిస్తూ బంగారంలాంటి కాలమంతా వ్యర్థం చేశానే' అని చింతిస్తే ఏం ప్రయోజనం? మనలో ఉన్న సహజమైన ప్రేమ ఈశ్వర స్వరూపమైన సమాజ ప్రేమ వైపు పయనించాలి. 'ఎవరినీ ద్వేషించకుండా ఉండటం, అందరిపై కరుణ చూపడం, అహంకార మమకారాలు త్యజించడం, నిత్య సంతుష్టులై జీవించడం, పవిత్ర జీవనం గడపడం...' ఇవి దైవభక్తుడి లక్షణాలుగా చెబుతారు. మన ప్రేమప్రయాణం ఆ వైపే సాగాలి!
- డాక్టర్ పులిచెర్ల సాంబశివరావు
Subscribe to:
Posts (Atom)